గీతా ఆర్ట్స్ లో మ‌హేష్ బాబు?

గీతా ఆర్ట్స్‌లో హీరోల‌కు కొద‌వ ఉండ‌దు. మెగా కుటుంబంలోనే దాదాపు అర‌డ‌జ‌ను మంది హీరోలున్నారు. అయితే… బ‌య‌టి హీరోల‌తోనూ సినిమాలు తీస్తూ… ఓ మంచి సంప్ర‌దాయానికి తెర తీసింది గీతా ఆర్ట్స్. బ‌య‌టి హీరోతో ఎప్పుడు సినిమా చేసినా.. వాళ్ల‌కో సూప‌ర్ హిట్ క‌ట్ట‌బెట్టింది. ఇప్పుడు మ‌హేష్‌బాబుతో ఓ సినిమా చేయ‌డానికి ప్లాన్ చేస్తోంది. అందుకు సంబంధించి క‌థ‌ల‌కు జ‌ల్లెడ ప‌డుతోంది.

‘అర్జున్ రెడ్డి’ ద‌ర్శ‌కుడు సందీప్ రెడ్డి వంగాతో మ‌హేష్ ఓ సినిమా చేయాల‌ని భావిస్తున్నాడు. ఈ ప్రాజెక్టు గీతా ఆర్ట్స్‌లోనే ఉండ‌బోతోంది. సందీప్ రెడ్డి ప్ర‌స్తుతం హిందీ `అర్జున్ రెడ్డి` సినిమాతో బిజీగాఉన్నాడు. ఈలోగా… గీతా టీమ్ ఓ క‌థ సిద్ధం చేసే ప‌నిలో ఉంద‌ట‌. ఈసారి సందీప్ రెడ్డి బ‌య‌టి క‌థ‌తోనే సినిమా చేస్తాడ‌ని, అందుకు మ‌హేష్ కూడా ఓకే అన్నాడ‌ని… ఇటు మ‌హేష్‌కీ, అటు సందీప్ శైలికీ మ్యాచ్ అయ్యే ఓ లైన్ పై ఇప్ప‌టికే… గీతా ఆర్ట్స్‌లో క‌స‌ర‌త్తులు మొద‌ల‌య్యాయని స‌మాచారం. ప్ర‌స్తుతం ‘మ‌హ‌ర్షి’తో బిజీగా ఉన్నాడు మ‌హేష్ బాబు. ఆ త‌ర‌వాత సుకుమార్‌తో ఓ సినిమా చేయాల్సివుంది. ఆ త‌ర‌వాతే.. సందీప్ రెడ్డి వంగా సినిమా ప‌ట్టాలెక్కొచ్చు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.