వచ్చే నెలలో జి.హెచ్.ఎం.సి.ఎన్నికల నోటిఫికేషన్?

సుమారు ఏడాదిగా ఎదురు చూస్తున్న జి.హెచ్.ఎం.సి. (గ్రేటర్ హైదరాబాద్ మునిసిపల్ కార్పోరేషన్) ఎన్నికల నిర్వహణకి ఎట్టకేలకు తెలంగాణా ప్రభుత్వం సిద్దపడుతోంది. జనవరి నెలాఖరులోగా జి.హెచ్.ఎం.సి. ఎన్నికలు తప్పకుండా నిర్వహిస్తామని తెలంగాణా ప్రభుత్వం హైకోర్టుకి మాట ఇచ్చినందున ఇక ఈసారి ఎన్నికలు వాయిదా వేసే అవకాశం లేదనే భావించవచ్చును. డిశంబర్ 25 తరువాత ఎన్నికల నోటిఫికేషన్ జారీ చేయడానికి సన్నాహాలు ప్రారంభించింది. అందులో భాగంగా నేటి నుంచి సవరించిన ఓటర్ల జాబితాలను సంబంధిత వార్డులు, జోనల్, తహసిల్దార్ కార్యాలయాలలో రాజకీయ పార్టీల మరియు ఓటర్ల పరిశీలన కోసం అందుబాటులో ఉంచుతారు.

ఈనెల 27న ప్రభుత్వం అన్ని పార్టీలతో ఒక సమావేశం ఏర్పాటు చేసి ఓటర్ల జాబితాల సవరణలు, ఎస్సీ, ఎస్టీ, బీసీల కోటాలు, జి.హెచ్.ఎం.సి. ఎన్నికల షెడ్యూల్ తదితర అన్ని అంశాల మీద విస్తృతంగా చర్చించిస్తుంది. అనంతరం డిశంబర్ 8న వివిధ వార్డులకు ఖరారు చేసిన ఎస్సీ, బీసీల కోటాల వివరాలను ప్రకటిస్తుంది. ఎస్సీలకు 15 శాతం, ఎస్టీలకు 8 శాతం, బీసీలకు 33 శాతం వార్డులు కేటాయించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. అంటే ఈ మూడు వర్గాలకు మొత్తంగా 56 శాతం రిజర్వ్ చేయగా మిగిలిన 44 శాతంలో మైనార్టీలు, మహిళలు ఇతరులకి కేటాయించతారు. డిశంబర్ 25న నోటిఫికేషన్ విడుదల చేసి జనవరి 20-25 తేదీల మధ్య జి.హెచ్.ఎం.సి. ఎన్నికలు నిర్వహించాలని ప్రభుత్వం భావిస్తోంది. ఓటర్ల జాబితాలో తప్పులున్నట్లు ఓటర్లు గుర్తించినా లేదా కొత్తగా నమోదు చేయించుకోదలచినా నోటిఫికేషన్ విడుదలయ్యే వరకు అవకాశం కల్పించాలని ప్రభుత్వం నిశ్చయించుకొంది. జి.హెచ్.ఎం.సి. ఎన్నికల నిర్వహణకు సుమారు 40 వేల మంది సిబ్బంది, 5 వేల ఈవీఎంలు ఏర్పాటు చేసుకోవలసిందిగా ప్రభుత్వం జి.హెచ్.ఎం.సి.కి లేఖ వ్రాసినట్లు తెలుస్తోంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

సూప‌ర్ హిట్ ల‌వ్ స్టోరీకి సీక్వెల్ కూడా!

ఈమ‌ధ్య సీక్వెల్ క‌థ‌ల జోరు ఎక్కువ‌గా క‌నిపిస్తోంది. అయితే యాక్ష‌న్‌, క్రైమ్‌, థ్రిల్ల‌ర్‌, హార‌ర్ చిత్రాల‌కు సీక్వెల్ చూశాం. ఇప్పుడు ల‌వ్ స్టోరీల్లోనూ ఆ ట్రెండ్ మొద‌లైపోయింది. ఇటీవ‌ల మ‌ల‌యాళంలో సూప‌ర్ హిట్...

చంద్రబాబు వస్తే : జగన్

చంద్రబాబు రాబోతున్నాడని.. టీడీపీ కూటమి గెలవబోతోందని జగన్ కు కూడా అర్థమైపోయింది. ఆయన ప్రసంగాలు పూర్తిగా చంద్రబాబు వస్తే ఏదో జరిగిపోతుందని భయపెట్టడానికే పరిమితవుతున్నాయి . కాకినాడలో జరిగిన సభలో .. తోలుకొచ్చిన...

ఏపీలో పోస్టల్ బ్యాలెట్‌పై కుట్రలు – ఈసీ పట్టించుకోదా ?

ఏపీలో ఉద్యోగులు ప్రభుత్వంపై మండిపోతున్నారు. ముఖ్యంగా ఉపాధ్యాయులు రగిలిపోతున్నారు. అందుకే వారు ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉంటారు. ఈ విషయంలో జగన్మోహన్ రెడ్డి సర్కార్ కు.. ఆయన జీ హూజూర్ బ్యాచ్‌కు బాగా...
video

సంక్షేమ ప‌థ‌కాల బిస్కెట్లు అయిపోయాయ్‌!

https://www.youtube.com/watch?v=C4ZKy1Gi1nQ&t=2s వెండి తెర‌పై మ‌రో పొలిటిక‌ల్ డ్రామా వ‌స్తోంది. అదే 'ప్ర‌తినిధి 2'. మీడియాలో పాపుల‌ర్ అయిన‌ టీవీ 5 మూర్తి ద‌ర్శ‌కుడు కావ‌డం, నారా రోహిత్ హీరోగా న‌టించ‌డం, అన్నింటికంటే 'ప్ర‌తినిధి' ఫ్రాంచైజీ...

HOT NEWS

css.php
[X] Close
[X] Close