బిల్లులు రావట్లేదని ఆ ఎమ్మెల్యే బాధ అలా చెప్పుకున్నారు !

ఏపీలో వైసీపీ ఎమ్మెల్యేలకు నియోజకవర్గంలో పనులు చేసిన వారికి బిల్లులు ఇప్పించడం తలకు మించిన భారం అవుతోంది. మంత్రులో లేకపోతే సీఎం దగ్గర పలుకుబడి ఉన్న వారో అతి కష్టం మీద కొన్ని బిల్లులు మంజూరు చేయించుకుంటున్నారు కానీ ఇతరులకు సాధ్యం కావడం లేదు. ప్రభుత్వం మీద ఒత్తిడి తేవడానికి ఒకరిద్దరు బయటకు చెబుతున్నారు. ఇటీవల శ్రీకాకుళం ఎమ్మెల్యే ధర్మాన ప్రసాదరావు అదే చెప్పారు… ఇప్పుడు ఆయన బాటలోకి నెల్లూరు జిల్లా కోవూరు ఎమ్మెల్యే వచ్చి చేరారు.

కోవరూ నియోజకవర్గంలో ప్రభుత్వ పనులు చేసిన ద్వితీయ శ్రేణి నేతలకు రూ. నలభై ఐదు కోట్ల బిల్లులు రావాల్సి ఉందని .. కానీ రెండున్నరేళ్ల నుంచి రావట్లేదన్నారు. నాయకులు, కాంట్రాక్టర్లు అవస్థలు పడుతున్నారని అన్నారు. అయితే ఈ విషయం నేరుగా చెబితే ప్రభు్తవ, పార్టీ పెద్దలకు కోపం వస్తుంది. ఆ కోపాన్ని ఎమ్మెల్యే తట్టకోగలరా అందుకే ఈ విషయాన్ని అవినీతితో ముడిపెట్టారు. కొంత మంది పార్టీ నేతలు బిల్లులు రాకపోయినా అవినీతికి పాల్పడటం లేదని కానీ మరికొంత మంది మాత్రం తన పేరు చెప్పుకుని పేదల వద్ద నుంచి డబ్బులు వసూలు చేస్తున్నారని ఆయన అంటున్నారు.

అందుకే బిల్లులు రాకపోయినా నిజాయితీగా ఉంటున్న వారిని ఆదర్శంగా తీసుకుని ఇతర నేతలు లంచాలు తీసుకోవద్దని ప్రజల్ని పీడించవద్దని అడుగుతున్నారు. నిజానికి నియోజకవర్గంలో పనులు చేసిన పార్టీ నేతలకు బిల్లులు ఇప్పించేది ఎమ్మెల్యేనే. అందుకే వారిపై ఒత్తిడి చేస్తూ ఉంటారు. ఈ ఒత్తిడి నల్లపురెడ్డికి ఎక్కవైపోయిందేమో కానీ.. మరో రూపంలో అసంతృప్తి బయటకు విడుదల చేశారు. దీన్ని మరి ప్రభుత్వం గుర్తిస్తుందా ?

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

కొన్ని చోట్ల స్వతంత్రులకు గాజు గ్లాస్ గుర్తు – ఈసీ ఆదేశాలపై గందరగోళం !

ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో ఎన్నికల సంఘం నిర్దిష్టమైన ఆదేశాలపై రిటర్నింగ్ అధికారులకే స్పష్టత లేకపోవడంతో ఎక్కడికక్కడ గందరగోళం ఏర్పడుతోంది. నామినేషన్ల ఉపసంహరణ గడువు ముగియడంతో స్వతంత్రులకు రిటర్నింగ్ అధికారులు గుర్తులు కేటాయింటారు. ఫ్రీ సింబల్స్...

పదేళ్ల తర్వాత ఓయూపై స్పందించిన కేసీఆర్

తెలంగాణ ఉద్యమ సమయంలో నిత్యం ఓయూను పలవరించిన కేసీఆర్.. గద్దెనెక్కాక ఒక్కసారి కూడా ఓయూను సందర్శించలేదు. విద్యార్థులు రోడ్డెక్కి ప్రొఫెసర్లను నియమించాలని,స్కాలర్ షిప్స్ పెంచాలని, వసతి గృహాల్లో నాణ్యమైన ఆహారం అందించాలని డిమాండ్...

నోరు జారిన ర‌చ‌యిత‌.. ఫైర్ అవుతున్న ఫ్యాన్స్

తోట‌ప‌ల్లి మ‌ధు... ఈ త‌రానికి పెద్ద‌గా ఈ ర‌చ‌యిత పేరు తెలియ‌క‌పోవొచ్చు కానీ, 90ల్లో వ‌చ్చిన కొన్ని సినిమాల‌కు ఆయ‌న మాట‌లు అందించారు. కొన్ని పెద్ద హిట్లు కొట్టారు. న‌టుడిగానూ త‌న‌దైన ముద్ర...

బడా భాయ్ కి కోపమొచ్చింది… ఛోటా భాయ్ కి సమన్లు వచ్చాయి..!!

తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, మోడీని బడా భాయి అని పిలిచినా,సరదాగా ఆహ్వానించినా రాజకీయాల్లో తమ్ముడు.. తమ్ముడే.. పేకాట.. పేకాటే అని నిరూపిస్తున్నారు బీజేపీ నేతలు. బడా భాయి అని మోడీని ఉద్దేశించి...

HOT NEWS

css.php
[X] Close
[X] Close