మాక్స్‌వెల్ చేసెను అద్భుతం…!

వరల్డ్ కప్ లో ఓ అద్భుతం నమోదైయింది. ఐదు సార్లు వరల్డ్ కప్ గెలిచిన ఆస్ట్రేలియా జట్టు.. అందులోని ఆటగాళ్ళు ఎంత ప్రమాదకరమో మరోసారి చాటి చెప్పారు. వన్డే ప్రపంచకప్‌ లో భాగంగా ముంబై వాంఖడే మైదానంలో అఫ్గానిస్థాన్‌ తో జరిగిన మ్యాచ్ లో ఆసిస్ ఆటగాడు మాక్స్‌వెల్ విధ్వంసం సృష్టించాడు. విధ్వంసం అనడం కంటే అద్భుతం అనడం సబబు.

ఈ మ్యాచ్ లో తొలుత బ్యాటింగ్ చేసిన ఆఫ్గానిస్తాన్ జట్టు నిర్ణీత 50 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి అఫ్గాన్‌ 291 పరుగులు చేసింది. ఓపెనర్‌ ఇబ్రహీం జద్రాన్‌ (129*) సెంచరీ సాధించి అలరించాడు. వరల్డ్ కప్ లో తొలి సెంచరీ చేసిన అఫ్గాన్‌ బ్యాటర్ గా నిలిచాడు.

292 పరుగుల లక్ష్యంతో దిగిన ఆసీస్ కు ఆఫ్గాన్ బౌలర్లు షాక్ ఇచ్చాడు. యాబై పరుగులకే టాప్ ఆర్డర్ అంతా కూల్చేశారు. 91 పరుగులకే ఆసీస్ ఏడు వికెట్లు కోల్పోయి మ్యాచ్ పై ఆశలు వదులుకుంది. ఈ దశలో క్రీజ్ లో వున్న ఏకైక బ్యాటర్ మ్యాక్స్ వెల్. అయితే ఈ ఒక్క బ్యాటరే.. ఓ చారిత్రాత్మక ఇన్నింగ్ ఆడాడు. ప్యాట్ కమిన్స్ ని మరో ఎండ్ లో వుంచి.. తనే ఎక్కువ స్ట్రయిక్ తీసుకుంటూ.. ఏకంగా ఒంటి చెత్తో డబుల్ సెంచరీ చేసి ఓ అద్భుతమైన విజయాన్ని టీంకి అందించాడు.

మ్యాక్స్ వెల్ ఇన్నింగ్ లో 21 ఫోర్లు, 10 సిక్సులు వున్నాయి. కేవలం 128 బంతుల్లో 201 పరుగులు బాదేశాడు. ఒక దశలో అతని శరీరం సహకరించలేదు. క్రాంప్స్ పట్టేశాయి. ఒక కాలు పని చేయలేదు. కేవలం ఒంటి కాలుతో కుంటుకొని బౌండరీలే కొడుతూ.. ఒక అద్భుతం లాంటి ఇన్నింగ్ ఆడాడు. వరల్డ్ కప్ లోనే కాదు.. ప్రపంచ క్రికెట్ చరిత్రలో మ్యాక్ వెల్ ఆడిన ఇన్నింగ్ ఎప్పటికీ నిలిచిపోతుంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ఎగ్జిట్ పోల్స్ : తెలంగాణలో కాంగ్రెస్‌కు అడ్వాంటేజ్

తెలంగాణలో కాంగ్రెస్ పార్టీకి అడ్వాంటేజ్ ఉందని అత్యధిక ఎగ్జిట్ పోల్స్ వెల్లడిస్తున్నయి. దేశంలో అత్యధిక స్ట్రైక్ రేట్ ఉన్న ఎగ్జిట్ పోల్స్ అన్నింటిలో కూడా కాంగ్రెస్ కే అడ్వాంటేజ్ లభించింది. జాతీయ మీడియాలు...

ఏపీ పోలీసులతో సాగర్ గేట్లు ఎత్తేయించి జగన్ రెడ్డి సాధించిందేంటి ?

తెలుగుదేశం పార్టీ నేతలను అరెస్టు చేయాలంటే వారు అందుబాటులో ఉన్నా సరే. అర్థరాత్రి వాళ్లు నిద్రపోయిన తర్వాత గేట్లు దూకి, తలుపులు బద్దలు కొట్టి అరెస్టు చేస్తారు. అది కోర్టులో నిలబడని కేసు.....

ప్రాసెస్‌లో క్వాష్ పిటిషన్‌పై తీర్పు : సుప్రీంకోర్టు ధర్మాసనం

చంద్రబాబు దాఖలు చేసుకున్న క్వాష్ పిటిషన్ పై తీర్పు ప్రాసెస్ లో ఉందని సుప్రీంకోర్టు ధర్మాసనం తెలిపింది. ఫైబర్ నెట్ స్కాంలో ముందస్తు బెయిల్ ఇవ్వాలంటూ చంద్రబాబు దాఖలు చేసిన పిటిషన్ పై...

తెలంగాణ ఓటరు నిరాసక్తత

తెలంగాణ ఓటరు పెద్దగా ఆసక్తి చూపించడం లేదు. పెద్ద పెద్ద క్యూలైన్లు ఎక్కడా కనిపించడం లేదు. మధ్యాహ్నం ఒంటింగంట వరకూ పోలింగ్ పర్సంటేజీ కేవలం 37 శాతం వరకే ఉంది. 2018లో ఇది...

HOT NEWS

css.php
[X] Close
[X] Close