ఆంధ్రప్రదేశ్ చరిత్రలో చారిత్రక ఘట్టం

హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ చరిత్రలో ఇవాళ ఒక చారిత్రక ఘట్టం చోటుచేసుకుంది. గోదావరి జలాలలు ఇవాళ కృష్ణానదిలో ప్రవేశిస్తున్నాయి. తాటిపూడి ఎత్తిపోతల పథకంనుంచి పోలవరం కుడికాల్వలోకి విడుదలైన 60 క్యూసెక్కుల గోదావరి జలాలు ఇవాళ ఉదయం పల్లెర్లమూడి గ్రామంవద్ద కృష్ణాజిల్లాలోకి ప్రవేశించాయి. ఈ జలాలు ఈ సాయంత్రంలోగా కృష్ణానదిలోకి ప్రవేశిస్తాయి. కృష్ణాజిల్లా నూజివీడు సమీపంలోని పల్లెర్లమూడివద్ద గోదావరిజలాలకు స్వాగతం పలికేందుకు ఏర్పాటుచేసిన కార్యక్రమానికి రైతులు పెద్దసంఖ్యలో హాజరయ్యారు. ఏపీ నీటిపారుదలశాఖమంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు, టీడీపీ ఎమ్మెల్యేలు చింతమనేని ప్రభాకర్, మాగంటిబాబు, వల్లభనేని వంశీ తదితరులు పూర్ణకుంభంతో గోదావరి జలాలకు స్వాగతం పలికారు. పూజల చేసి కొబ్బరికాయలుకొట్టి హారతి ఇచ్చారు.

గోదావరి, కృష్ణా నదుల అనుసంధానం ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు చిరకాల స్వప్నం అని దేవినేని ఉమా అన్నారు. పట్టిసీమ ప్రాజెక్ట్ పైప్ లైన్ పనులు ఇంకా పూర్తికాకపోవటంతో ఇప్పుడు తాటిపూడినుంచి పోలవరం కుడికాల్పలోకి నీటిని విడుదలచేశామని, ఈ నెల 15న సీఎమ్ పట్టిసీమనుంచి పోలవరం కుడికాల్పలోకి గోదావరి నీటిని ముఖ్యమంత్రి విడుదలచేసి అధికారికంగా నదుల అనుసంధానాన్ని ప్రకటిస్తారని ఉమా చెప్పారు. వృథాగా సముద్రంలో కలిసిపోతున్న గోదావరినీటిని కృష్ణాజిల్లాలోకి మళ్ళించి చంద్రబాబు చరిత్ర సృష్టించారని అన్నారు. ఇది వృథా ప్రాజెక్ట్ అని ప్రతిపక్షాలు చేసిన విమర్శలు గోదావరిజలాలలో కొట్టుకోపోతాయని చెప్పారు. నీళ్ళలో దిగిన తెలుగుదేశం నేతలు చిన్నపిల్లలైపోయి ఆనందంతో నీళ్ళలో తడిసిపోతూ కేరింతలు కొట్టారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

కాంగ్రెస్‌తో కాదు రేవంత్ తోనే బీజేపీ, బీఆర్ఎస్ పోటీ !

తెలంగాణ లోక్ సభ ఎన్నికల్లో తాము కాంగ్రెస్ తో కాకుండా రేవంత్ తో పోటీ పడుతున్నట్లుగా రాజకీయాలు చేస్తున్నారు. రేవంత్ ను మాత్రమే టార్గెట్ చేస్తున్నారు. కాంగ్రెస్ పార్టీని ఏమీ...

ప్రచారంలో పొలిటికల్ గ్లామర్ ఏదీ..?

ఎన్నికలు అనగానే ప్రధాన పార్టీలు సినీ తారల సేవలను ప్రచారంలో ఒకప్పుడు వాడుకునేవి. కానీ, రానురాను ఆ సంప్రదాయం తెరమరుగు అవుతోంది. తమ సేవలను వాడుకొని వదిలేస్తున్నారనే భావనతో ప్రచారాలకు దూరం పాటిస్తున్నారు....

ఎవరీ రామసహాయం రఘురామ్ రెడ్డి..?

ఖమ్మం కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థిగా రామసహాయం రఘురాం రెడ్డిని హైకమాండ్ ప్రకటించింది.అనేకపేర్లు తెరమీదకు వచ్చినా అనూహ్యంగా అధిష్టానం రామసహాయం పేరును అభ్యర్థిగా ఖరారు చేయడంతో ఈయన ఎవరు అనే చర్చ జోరుగా జరుగుతోంది....

“సివిల్ సర్వీస్” ఇమేజ్ జగన్ పాలనలో డ్యామేజ్ !

సివిల్ సర్వీస్ అధికారి అంటే ఓ గౌరవం.. ఓ మర్యాద. కానీ ఏపీలో సివిల్ సర్వీస్ అధికారులు చేస్తున్న పనులు చూసి.. కోర్టులు కూడా అసలు మీకెవరు ఉద్యోగం ఇచ్చారయ్యా అని అసహనపడాల్సి...

HOT NEWS

css.php
[X] Close
[X] Close