కేసీఆర్ పిలుపు : యాదాద్రికి కేజీల కొద్దీ బంగారం విరాళాలు ..!

వచ్చే ఏడాది మార్చి 28న యాదాద్రి ఆలయాన్ని వైభవంగా పునం ప్రారంభించాలని నిర్ణయించుకున్న తెలంగాణ సీఎం కేసీఆర్.. యాదాద్రి ఆలయ విమాన గోపురానికి స్వర్ణతాపడం చేయించాలని సంకల్పించారు. దీనికి 125కిలోల బంగారం అవసరం అవుతుంది. ప్రభుత్వం మొత్తం ఖర్చు పెట్టగలిగినప్పటికీ భక్తులకూ చాన్స్ ఇవ్వాలన్న ఉద్దేశంతో విరాళాలు సేకరించాలని నిర్ణయించారు.  మొట్ట మొదటి విరాళంగా కేసీఆక్ తన కుటుంబ తరపన 116 తులాల బంగారాన్ని ప్రకటించారు.

కేసీఆర్ ఇలా ప్రకటించిన వెంటనే.. ఇతర నేతల ప్రకటనలు హోరెత్తాయి. ఇటీవ ఐటీ దాడుల్లో వందల కోట్ల బ్లాక్ మనీ బయటపడిన హెటెరో అధినేత పార్థసారధి రెడ్డి రూ. ఐదు కేజీల బంగారాన్ని విరాళంగా ప్రకటించారు. మంత్రి మల్లారెడ్డి కుటుంబం తరపున ఒక కిలో బంగారం, మేడ్చల్ నియోజకవర్గం నుంచి ఒక కిలో బంగారం, నాగర్ కర్నూల్ ఎమ్మెల్యే జనార్ధన్ రెడ్డి రెండు కిలోల బంగారం, కావేరీ సీడ్స్ అధినేత కావేరీ భాస్కర్ రావు 1 కిలో, నమస్తే తెలంగాణ దామోదర్ రావు కుటుంబం నుంచి 1 కిలో, చినజీయర్ పీఠం నుంచి 1 కిలో బంగారాన్ని విరాళంగా ప్రకటించారు.

చేవెళ్ల ఎంపీ రంజిత్ రెడ్డి కేజీ ,  మేడ్చల్, రంగారెడ్డి జిల్లాలకు చెందిన ఆరుగురు టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు కె నవీన్ కుమార్, శంభిపూర్ రాజు, ఎ   ఎ గాంధీ, ఎం హన్మంతరావు, ఎం కృష్ణా రావు, కేపీ వివేక్ ఆనంద్  వ్యక్తిగతంగా ఒక్కొక్కరు  వారి కుటుంబ సభ్యులు కలసి కేజీ బంగారాన్ని అందిస్తామని ప్రకటించారు. ఇక ఏపీ నుంచి  కేసీఆర్ పిలుపనకు స్పందన వస్తోంది.  వైసీపీ నేత… కడప జిల్లా చిన్న మండెం జెడ్పీటీసీ మోడెం జయమ్మ కేజీ బంగారాన్ని విరాళంగా ప్రకటించారు.

కేసీఆర్ రాష్ట్రంలోని గ్రామ పంచాయతీలు, మున్సిపాలిటీలు, గ్రేటర్ మున్సిపాలిటీల నుంచి విరాళాలు ఇవ్వాలని పిలుపునిచ్చారు. ఒక్కో గ్రామం నుంచి రూ.11 ఇచ్చినా సరిపోతుందని, తెలంగాణ ప్రజలందరి నుంచి ఈ భావన రావాలని ముఖ్యమంత్రి కోరారు. స్వయంగా ముఖ్యమంత్రే కోరారు కాబట్టి 125 కేజీల కన్నా ఎక్కువే బంగారం యాదాద్రి ఆలయానికి సమకూరే అవకాశం కనిపిస్తోంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

బీఆర్ఎస్ కు బిగ్ షాక్…కాంగ్రెస్ లోకి ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు..?

పోలింగ్ కు ముందే బీఆర్ఎస్ కు షాక్ ఇవ్వాలని , తమతో టచ్ లోనున్న ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలను పార్టీలో చేర్చుకుకోవాలని కాంగ్రెస్ భావిస్తోందన్న చర్చ హాట్ టాపిక్ అవుతోంది. చేరికలకు సంబంధించి రాష్ట్ర...

కంచుకోటల్లోనే జగన్ ప్రచారం – ఇంత భయమా ?

వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి ఎన్నికల ప్రచార సభలు గట్టిగా ముఫ్పై నియోజకవర్గాల్లో జరిగాయి. మొత్తంగా ఏపీ వ్యాప్తంగా 175 నియోజకవర్గాలు ఉంటే.. ఎన్నికల షెడ్యూల్ వచ్చిన తర్వాత కనీసం యాభై నియోజకవర్గాల్లో...

ఎలక్షన్ ట్రెండ్ సెట్ చేసేసిన ఏపీ ఉద్యోగులు !

ఆంధ్రప్రదేశ్‌లో పోస్టల్ బ్యాలెట్లు ఎవరూ ఎవరూ ఊహించని స్థాయిలో పెరిగాయి. గత ఎన్నికల కంటే రెట్టింపు అయ్యాయి. ఏపీలో మొత్తం దాదాపు 13 లక్షల మంది ఉద్యోగులు ఉన్నారు....

నేటితో ప్రచారానికి తెర…నేతల ప్రచార షెడ్యూల్ ఇలా

మరికొద్ది గంటల్లో తెలుగు రాష్ట్రాల్లో లోక్ సభ ఎన్నికల ప్రచారం ముగియనుంది. సాయంత్రం 5గంటలలోపే ప్రచారం ముగించాల్సి ఉండటంతో ఆయా పార్టీల అధినేతలు,అభ్యర్థులు మిగిలిన సమయాన్ని సద్వినియోగం చేసుకునేలా షెడ్యూల్ రూపొందించుకున్నారు....

HOT NEWS

css.php
[X] Close
[X] Close