“ధూళిపాళ్ల ట్రస్ట్‌”ను లాగేసుకున్న ప్రభుత్వం !

టీడీపీ నేత ధూళిపాళ్ల నరేంద్రకుమార్ తన తండ్రి పేరు మీద ఏర్పాటు చేసిన డీవీసీ ట్రస్ట్‌ను దేవాదాయ చట్టం రిజిస్టర్ చేస్తూ ఆ శాఖ ఉన్నతాధికారి ఆదేశాలు జారీ చేశారు. అసలు తమ ట్రస్ట్‌ను రిజిస్టర్ చేయాలని ఆ ట్రస్ట్ సభ్యులు కోరలేదు. కానీ రెండు సార్లు ట్రస్ట్‌ను రిజిస్టర్ చేసుకోవాలని నోటీసులు ఇచ్చారు. వారు కోర్టుకెళ్లారు. అయినా ప్రభుత్వం.. దేవాదాయశాఖ పట్టించుకోకుండా తమకు తాము రిజిస్టర్ చేస్తూ ఉత్తర్వులు ఇచ్చింది. ఇలా ఎందుకు చేశారో.. ఎందుకు ఇలా ట్రస్ట్‌ను దేవాదాయ శాఖ పరిధిలోనే రిజిస్టర్ చేయాలని అదే పనిగా ప్రయత్నిస్తున్నారో వాళ్లకు మాత్రమే తెలుసు.

ఇంతకు ముందు సంగం డెయిరీని స్వాధీనం చేసుకోవాలని ప్రభుత్వం చేసిన ప్రయత్నాలు విఫలమయ్యాయి. ఏదో ఒకటి చేయకపోతే ఎలా అనుకున్నారేమో కానీ ఇప్పుడు ధూళిపాళ్ల వీరయ్య చౌదరి ట్రస్ట్‌ను స్వాధీనం చేసుకునే ప్రయత్నాలు చేస్తున్నారు. సంగం డెయిరీ ప్రాంగణంలోనే డీవీసీ ట్రస్ట్ ఉంది. గతంలో ఎందుకు స్వాధీనం చేసుకోకూడదో చెప్పాలంటూ నోటీసులు ఇచ్చారు. వాటిపై కోర్టుకెళ్లారు. తర్వాత

1994లో ధూళిపాళ్ల నరేంద్ర తన తండ్రి వీరయ్య చౌదరి పేరిట ట్రస్ట్‌ను ఏర్పాటు చేశారు. ఈ ట్రస్టు ద్వారా పదెకరాల స్థలంలో ధూళిపాళ్ల వీరయ్యచౌదరి ట్రస్టు ఆస్పత్రిని నిర్మించారు. ఇది లాభాపేక్ష లేని ఆస్పత్రి. రైతులకు, సంగం డెయిరీ ఉద్యోగులకు సేవలు అందించేందుకు నిర్మించారు. ఇప్పుడు ట్రస్ట్ నే స్వాధీనం చేసుకునే ప్రయత్నాలు చేసింది. ఓ సారి స్వాధీనం చేసుకుంటామని.. ఇంకో సారి రిజిస్టర్ చేసుకోవాలని ఉత్తర్వులు ఇచ్చారు. ఇప్పుడు ఏకంగా తామే సొంతంగా రిజిస్టర్ చేసేశారు. దీనిపై డీవీసీ ట్రస్ట్ సభ్యులు కోర్టుకెళ్లడం ఖాయమే. ఇలా సొంతంగా ఎవరూ దరఖాస్తు చేయకుండా తమంతట తాము రిజిస్టర్ చేస్తే.. అవి ఎలా చెల్లుతాయో అధికారులకే తెలియాలి.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

video

సంక్షేమ ప‌థ‌కాల బిస్కెట్లు అయిపోయాయ్‌!

https://www.youtube.com/watch?v=C4ZKy1Gi1nQ&t=2s వెండి తెర‌పై మ‌రో పొలిటిక‌ల్ డ్రామా వ‌స్తోంది. అదే 'ప్ర‌తినిధి 2'. మీడియాలో పాపుల‌ర్ అయిన‌ టీవీ 5 మూర్తి ద‌ర్శ‌కుడు కావ‌డం, నారా రోహిత్ హీరోగా న‌టించ‌డం, అన్నింటికంటే 'ప్ర‌తినిధి' ఫ్రాంచైజీ...

రేవంత్ రెడ్డి యార్క‌ర్… ప్ర‌తిప‌క్షాలు క్లీన్ బౌల్డ్ అయిన‌ట్లేనా?

గ‌త కొంత‌కాలంగా బీఆర్ఎస్ రైతుల చుట్టూ రాజకీయం మొద‌లుపెట్టింది. పంట ఎండిపోతుంద‌ని, సాగుకు విద్యుత్ అంద‌టం లేద‌ని, ధాన్యం కొనుగోలు ఏమైంద‌ని, రుణమాఫీపై మౌనం ఎందుకు అంటూ నేత‌లంతా మూకుమ్మ‌డిగా రేవంత్ స‌ర్కారుపై...

‘మై డియర్ దొంగ’ రివ్యూ: స‌హ‌నం దొంగిలించేశాడు

అభినవ్ గోమఠం అంటే నవ్విస్తాడనే నమ్మకం ఏర్పడింది. ఒకవైపు క్యారెక్టర్ రోల్స్ చేస్తూనే మెయిన్ లీడ్ గా కూడా ప్రయత్నాలు చేస్తున్నాడు. ఇప్పుడాయన టైటిల్ రోల్ లో 'మై డియర్ దొంగ' సినిమా...

4 చోట్ల టీడీపీ అభ్యర్థుల మార్పు ?

తెలుగుదేశం పార్టీ నలుగురు అభ్యర్థులను మార్చాలని నిర్ణయించుకుంది. నరసాపురం సిట్టింగ్ ఎంపీ అయిన కనుమూరు రఘురామకృష్ణరాజు ఉండి అసెంబ్లీ నుంచి టీడీపీ అభ్యర్థిగా బరిలోకి దింపడం దాదాపు ఖాయమే. మంతెన రామరాజుకు...

HOT NEWS

css.php
[X] Close
[X] Close