టీడీపీ నేత ధూళిపాళ్ల నరేంద్రకుమార్ తన తండ్రి పేరు మీద ఏర్పాటు చేసిన డీవీసీ ట్రస్ట్ను దేవాదాయ చట్టం రిజిస్టర్ చేస్తూ ఆ శాఖ ఉన్నతాధికారి ఆదేశాలు జారీ చేశారు. అసలు తమ ట్రస్ట్ను రిజిస్టర్ చేయాలని ఆ ట్రస్ట్ సభ్యులు కోరలేదు. కానీ రెండు సార్లు ట్రస్ట్ను రిజిస్టర్ చేసుకోవాలని నోటీసులు ఇచ్చారు. వారు కోర్టుకెళ్లారు. అయినా ప్రభుత్వం.. దేవాదాయశాఖ పట్టించుకోకుండా తమకు తాము రిజిస్టర్ చేస్తూ ఉత్తర్వులు ఇచ్చింది. ఇలా ఎందుకు చేశారో.. ఎందుకు ఇలా ట్రస్ట్ను దేవాదాయ శాఖ పరిధిలోనే రిజిస్టర్ చేయాలని అదే పనిగా ప్రయత్నిస్తున్నారో వాళ్లకు మాత్రమే తెలుసు.
ఇంతకు ముందు సంగం డెయిరీని స్వాధీనం చేసుకోవాలని ప్రభుత్వం చేసిన ప్రయత్నాలు విఫలమయ్యాయి. ఏదో ఒకటి చేయకపోతే ఎలా అనుకున్నారేమో కానీ ఇప్పుడు ధూళిపాళ్ల వీరయ్య చౌదరి ట్రస్ట్ను స్వాధీనం చేసుకునే ప్రయత్నాలు చేస్తున్నారు. సంగం డెయిరీ ప్రాంగణంలోనే డీవీసీ ట్రస్ట్ ఉంది. గతంలో ఎందుకు స్వాధీనం చేసుకోకూడదో చెప్పాలంటూ నోటీసులు ఇచ్చారు. వాటిపై కోర్టుకెళ్లారు. తర్వాత
1994లో ధూళిపాళ్ల నరేంద్ర తన తండ్రి వీరయ్య చౌదరి పేరిట ట్రస్ట్ను ఏర్పాటు చేశారు. ఈ ట్రస్టు ద్వారా పదెకరాల స్థలంలో ధూళిపాళ్ల వీరయ్యచౌదరి ట్రస్టు ఆస్పత్రిని నిర్మించారు. ఇది లాభాపేక్ష లేని ఆస్పత్రి. రైతులకు, సంగం డెయిరీ ఉద్యోగులకు సేవలు అందించేందుకు నిర్మించారు. ఇప్పుడు ట్రస్ట్ నే స్వాధీనం చేసుకునే ప్రయత్నాలు చేసింది. ఓ సారి స్వాధీనం చేసుకుంటామని.. ఇంకో సారి రిజిస్టర్ చేసుకోవాలని ఉత్తర్వులు ఇచ్చారు. ఇప్పుడు ఏకంగా తామే సొంతంగా రిజిస్టర్ చేసేశారు. దీనిపై డీవీసీ ట్రస్ట్ సభ్యులు కోర్టుకెళ్లడం ఖాయమే. ఇలా సొంతంగా ఎవరూ దరఖాస్తు చేయకుండా తమంతట తాము రిజిస్టర్ చేస్తే.. అవి ఎలా చెల్లుతాయో అధికారులకే తెలియాలి.