అమరావతికి ఎంత ఖర్చు పెట్టారో కూడా చెప్పలేరా..!?

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రాజధాని అమరావతికి ఎంత మొత్తం ఖర్చు పెట్టారో చెప్పాలని హైకోర్టు చాలా రోజుల కిందట ఆదేశించింది. ముఖ్యమంత్రి సమీక్ష చేస్తే… అణా.. పైసలతో సహా క్షణాల్లో లెక్కలు తీసుకెళ్లే అధికారులు హైకోర్టు అడిగితే మాత్రం.. వాయిదాల మీద వాయిదాలు కోరుతున్నారు. ఈ అంశంపై హైకోర్టు సీరియస్ అయింది. అకౌంటెంట్ జనరల్‌ను హైకోర్టుకు పిలిపిస్తామని హెచ్చరించాల్సి వచ్చింది. రైతులు వేసిన పిటిషన్‌పై విచారణ జరుపుతున్న హైకోర్టు.. రాజధాని నిర్మాణ ఖర్చులపై అకౌంటెంట్ జనరల్ నివేదిక సమర్పించాలని గతంలో ఆదేశించంది. కానీ ఇప్పటి వరకూ సమర్పించలేదు. అధికారులు ఇవ్వడం లేదని అకౌంటెంట్ జనరల్ తరపు న్యాయవాది కోర్టులో వాదించారు.

వచ్చే సోమవారంలోగా తాము అడిగిన నివేదికను సమర్పించాలని, లేనిపక్షంలో అకౌంటెంట్ జనరలే నేరుగా కోర్టుకు రావాల్సి ఉంటుందని ధర్మాసనం హెచ్చరించింది. రాజధాని నిర్మాణాల కోసం నేటివరకు చేసిన వ్యయం, ఇందుకోసం వివిధ సంస్థల నుంచి తీసుకొచ్చిన రుణాలు, మధ్యలోనే రాజధాని నిర్మాణాలను నిలిపివేయడంతో కాంట్రాక్ట్ సంస్థలు దాఖలు చేసిన క్లైయిమ్ ల వివరాలను అందించాలని హైకోర్టు ఆదేశించింది. రాజధానికి చేసిన ఖర్చుపై అధికార, ప్రతిపక్షాలు పరస్పర ఆరోపణలు చేసుకోవడమే కానీ.. ఇంత వరకూ అధికారిక లెక్కలు బయట పెట్టలేదు.

అమరావతికి అసలు గత ప్రభుత్వం ఏమీ ఖర్చు పెట్టలేదని పురపాలక మంత్రి బొత్స సత్యనారాయణ లాంటి వాళ్లు చెబుతూ ఉంటారు. టీడీపీ నేతలు మాత్రం.. పదివేల కోట్లు ఖర్చు పెట్టామని చెబుతూ ఉంటారు. చాలా సంస్థలు పనులు మధ్యలో నిలిపివేశాయి. ఒప్పందం ప్రకారం.. అలా నిలిపివేయమని ప్రభుత్వం చెబితే.. పరిహారం చెల్లించాల్సి ఉంటుంది. ఈ వివరాలన్నీ రహస్యంగా ఉన్నాయి. అవి బయటకు వస్తేనే అమరావతి ఖర్చు గురించి పూర్తి సమాచారం బయటకు వస్తుంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ఆ స్థానాల్లో ఇద్దరేసి అభ్యర్థులకు బీజేపీ బీ ఫాం..!?

పార్లమెంట్ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకున్న బీజేపీ వ్యూహాత్మకంగా ముందుకు సాగుతోంది.పోటీ చేసే అభ్యర్థులకు గెలుపు వ్యూహాలను చేరవేస్తూనే..మరోవైపు పార్టీ పరంగా ఎలాంటి వ్యూహాలను అనుసరించాలో అన్నింటిని పక్కా ప్లాన్ తో అమలు చేస్తోంది....

కేసీఆర్ బస్సులో లిఫ్ట్.. ఎంట్రీ వేరే లెవల్..!!

బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ వినియోగిస్తోన్న బస్సు అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. కేసీఆర్ సౌలభ్యం కోసం బస్సును కొత్త టెక్నాలజీతో అప్డేట్ చేయడంతో బస్సు డిజైన్ ఆకట్టుకుంటోంది. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు ముగిసాక కేసీఆర్...

రియల్లీ గ్రేట్..50 మందిని కాపాడిన బాలుడు

రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ లోని ఫార్మా కంపెనీ అగ్ని ప్రమాద ఘటనలో ఓ బాలుడి సాహసం 50మందిని ప్రాణాపాయం నుంచి కాపాడింది. భారీగా మంటలు ఎగిసిపడటంతో ప్రమాదంలో చిక్కుకొని ఆపన్నహస్తం కోసం...

పిఠాపురంపైకి అసాంఘిక శక్తుల దండయాత్ర !

ఒక్కడిని ఒక్కరంటే ఒక్కర్ని ఓడించడానికి అన్ని రకాల మాఫియాల్ని రంగంలోకి దించుతోంది వైసీపీ. విచ్చలవిడిగా డబ్బులు ఖర్చుపెట్టడమే కాదు.. నకిలీ మద్యంతో ముంచెత్తుతున్నారు. బయట నుంచి ఎర్ర చందనం స్మగ్లర్లు,...

HOT NEWS

css.php
[X] Close
[X] Close