తెరాసకు సవాల్‌గా మారిన గ్రేటర్ ఎన్నికలు

గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో విజయం సాధించాలని ఆశపడుతున్న తెలంగాణ రాష్ట్ర సమితికి అనేక సవాళ్లు ఎదురవుతున్నాయి. ఓ వైపు పార్టీ కేడర్ బలపడలేదు. రాష్ట్రంలో అధికారంలోకి వచ్చి ఏడాది దాటినా నగరంలో మాత్రం కారు కండిషన్లోకి రాలేదు. మరోవైపు, వచ్చే ఎన్నికల్లో ఒంటరిగా పోటీ చేయాలని ఎంఐఎం నిర్ణయించినట్టు తెలుస్తోంది. ఆ పార్టీతో పొత్తు పెట్టుకుంటే మంచి ఫలితాలు సాధించవచ్చని నగర తెరాస నేతలు భావించారు. ఇప్పుడు ఆ అవకాశం కనిపించడం లేదు.

నగరంలో తెరాస మొదటి నుంచీ వలస నేతలమీదే ఎక్కువగా ఆధారపడింది. తలసాని శ్రీనివాస్ యాదవ్ ను ఏరికోరి టీడీపీ నుంచి ఆహ్వానించి మరీ మంత్రి పదవి ఇచ్చారు. ఆయన పార్టీకి ఏమేరకు బలమో తెరాస నాయకులు చెప్పలేక పోతున్నారు. సనత్ నగర్ కు ఉప ఎన్నిక జరిగితే ఖాయంగా గెలుస్తామని ధీమాగా చెప్పే తెరాస నాయకులు కొద్ది మందే. ఇతర పార్టీల నుంచి వచ్చిన ఎమ్మెల్యేలు, ఇతర నాయకుల వల్ల అదనంగా ఎన్ని ఓట్లు వస్తాయనే దానిపై స్పష్టత లేదు. ఎన్నికలు జరిగితేనే ఏ సంగతీ తెలుస్తుంది.

మైనంపల్లి హన్మంత రావు వంటి ఒకరిద్దరు మాత్రమే కేడర్ లో ఉత్సాహం నింపగలరు. పార్టీకి వీలైనన్ని ఓట్లు రాబట్టే సత్తా వారికి ఉంది. కానీ గ్రేటర్ లో పాగా వేయాలంటే గట్టి కేడర్ కావాలి. దూకుడుగా ముందుకు వెళ్లే ద్వితీయ శ్రేణి నాయకత్వం కావాలి. అన్నిటికీ మించి, గెలుస్తామనే ఆత్మవిశ్వాసం ఉండాలి.

టీడీపీ, బీజేపీలకు ఇవన్నీ ఉన్నాయి. బలమైన కేడర్ ఉంది. ద్వితీయ శ్రేణి నాయకత్వం ఉంది. గెలుస్తామనే ధీమా కూడా చాలా మంది కార్యకర్తల్లో తొణికిసలాడుతోంది. ఈ రెండు పార్టీల వారూ గ్రేటర్ ఎన్నికలు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్నారు. ఈసారి సత్తా చాటుగామని కసిగా కనిపిస్తున్నారు. ఇటీవలి పరిణామాలతో కేసీఆర్ ఆశ్చర్యపోయే ఫలితాలను సాధించి చూపిస్తామని తెలుగు తమ్ముళ్లు ధీమాగా చెప్తున్నారు.

గ్రేటర్ హైదరాబాద్ కు 2009లో తొలిసారి జరిగిన ఎన్నికల్లో తెరాస పోటీ చేయలేదు. మొత్తం 150 డివిజన్లలో కాంగ్రెస్ 52 గెల్చకుంది. టీడీపీ 45 సీట్లతో రెండో స్థానంలో నిలిచింది. ఎంఐఎం 43 డివిజన్లు గెల్చుకుంది. బీజేపీ 5 సీట్లకే పరిమితమైంది. ఇతరులు మిగతా 5 డివిజన్లలో గెలిచారు. ఇక, మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో గ్రేటర్ పరిధిలో తెరాస సొంతగా మూడు సీట్లు గెలిచింది. 7 సీట్లు ఎంఐఎం కంటే టీడీపీ ఒక సీటు ఎక్కువే గెలిచింది. అలాగే, టీడీపీ, బీజేపీలు సికింద్రాబాద్, మల్కాజ్ గిరి ఎంపీ సీట్లను గెల్చుకున్నాయి. మైనంపల్లి హన్మంత రావు మల్కాజ్ గిరి లో గట్టి పోటీ ఇచ్చినా గెలవలేక పోయారు.

తెరాస గెల్చుకున్న మల్కాజ్ గిరి నియోజకవర్గంలోనూ మెజారిటీ డివిజన్లను గెలుస్తుందని చెప్పే పరిస్థితి. ఆఖరి రౌండ్ ఓట్ల లెక్కింపు వరకూ తెరాస వెనకబడి ఉంది. అల్వాల్ డివిజన్ లెక్కింపుతో స్వల్ప తేడాతో విజయం సాధించింది. మిగతా డివిజన్లలో బీజేపీ అభ్యర్థి స్పష్టమైన ఆధిక్యం సాధించారు. అదే ఫలితం పునరవావృతమైతే, తెరాసకు అల్వాల్ మినహా మిగతా డివిజన్లు దక్కడం కష్టమే. కనీసం మిగిలిన ఐదు నెలల్లో అయినా కేడర్ ను బలోపేతం చేసుకుంటే పరిస్థితిని మెరుగు పరుచుకునే అవకాశం ఉంటుంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

సూప‌ర్ హిట్ ల‌వ్ స్టోరీకి సీక్వెల్ కూడా!

ఈమ‌ధ్య సీక్వెల్ క‌థ‌ల జోరు ఎక్కువ‌గా క‌నిపిస్తోంది. అయితే యాక్ష‌న్‌, క్రైమ్‌, థ్రిల్ల‌ర్‌, హార‌ర్ చిత్రాల‌కు సీక్వెల్ చూశాం. ఇప్పుడు ల‌వ్ స్టోరీల్లోనూ ఆ ట్రెండ్ మొద‌లైపోయింది. ఇటీవ‌ల మ‌ల‌యాళంలో సూప‌ర్ హిట్...

చంద్రబాబు వస్తే : జగన్

చంద్రబాబు రాబోతున్నాడని.. టీడీపీ కూటమి గెలవబోతోందని జగన్ కు కూడా అర్థమైపోయింది. ఆయన ప్రసంగాలు పూర్తిగా చంద్రబాబు వస్తే ఏదో జరిగిపోతుందని భయపెట్టడానికే పరిమితవుతున్నాయి . కాకినాడలో జరిగిన సభలో .. తోలుకొచ్చిన...

ఏపీలో పోస్టల్ బ్యాలెట్‌పై కుట్రలు – ఈసీ పట్టించుకోదా ?

ఏపీలో ఉద్యోగులు ప్రభుత్వంపై మండిపోతున్నారు. ముఖ్యంగా ఉపాధ్యాయులు రగిలిపోతున్నారు. అందుకే వారు ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉంటారు. ఈ విషయంలో జగన్మోహన్ రెడ్డి సర్కార్ కు.. ఆయన జీ హూజూర్ బ్యాచ్‌కు బాగా...
video

సంక్షేమ ప‌థ‌కాల బిస్కెట్లు అయిపోయాయ్‌!

https://www.youtube.com/watch?v=C4ZKy1Gi1nQ&t=2s వెండి తెర‌పై మ‌రో పొలిటిక‌ల్ డ్రామా వ‌స్తోంది. అదే 'ప్ర‌తినిధి 2'. మీడియాలో పాపుల‌ర్ అయిన‌ టీవీ 5 మూర్తి ద‌ర్శ‌కుడు కావ‌డం, నారా రోహిత్ హీరోగా న‌టించ‌డం, అన్నింటికంటే 'ప్ర‌తినిధి' ఫ్రాంచైజీ...

HOT NEWS

css.php
[X] Close
[X] Close