సుప్రీంలో ఊరట దక్కకపోతే రాహుల్ జైలుకే !

రాహుల్ గాంధీకి గుజరాత్ హైకోర్టులోనూ ఎదురుదెబ్బ తప్పలేదు. రాజకీయ విమర్శలకు … పరువు నష్టం కేసులో కింది కోర్టు విధించిన రెండేళ్ల జైల శిక్షను గుజరాత్ హైకోర్టు కూడా సమర్థించింది. ఇందుకు రాహుల్ గాంధీ వెనుక ఉన్న కేసుల రికార్డును కారణంగా చూపించింది. “రాహుల్​ గాంధీపై 10కిపైగా క్రిమినల్​ కేసులు ఉన్నాయి. ప్రస్తుతం దోషిగా తేలిన కేసు తర్వాత కూడా పలు కేసులు దాఖలయ్యాయి. వీర్​ సావర్కర్​ మనవడు కూడా కేసు వేశారు. ఏదిఏమైనా.. మోదీ ఇంటి పేరు వివాదంలో పడిన శిక్షతో రాహుల్​ గాంధీకి అన్యాయం జరిగింది అనడానికి ఏం లేదు! ఈ తీర్పు సరైనదే. సూరత్​ కోర్టు ఆదేశాలపై జోక్యం చేసుకోవాల్సిన అవసరం లేదు ” అని గుజరాత్​ హైకోర్టు తీర్పునిచ్చింది.

దీంతో రాహుల్ గాంధీపై పడిన అనర్హతా వేటు కొనసాగుతుంది. అంతే కాదు.. మరో ఎనిమిదేళ్ల పాటు ఎన్నికల్లో పోటీ చేయలేరు. ఆయనకు ఇప్పుడు సుప్రీంకోర్టులో పిటిషన్ వేసే ఒకే ఒక్క అవకాశం ఉంది. అక్కడ కూడా రాహుల్ గాంధీ ఈ శిక్షకు అర్హుడే.. ఆయన చేసినంతటి నేరం దేశంలో ఇంకెవరూ చేయలేదని నమ్మితే.. శిక్షను ఖరారు చేస్తారు. ఈ లోపు ఆయన జైలుకు వెళ్లాల్సి వచ్చినా ఆశ్చర్యం లేదు. సుప్రీంకోర్టులో ఊరట లభించకపోతే.. జైలుకు పోయి రెండేళ్లలు గడపాల్సి ఉంటుంది.

పరువు నష్టం కేసులో జైలుకు వెళ్లిన ప్రధాని పదవికి పోటీ పడే నేతగా చరిత్రకెక్కుతారు. రెండేళ్ల పాటు జైల్లో ఉండి. విడుదలైన తర్వాత ఆరేళ్ల పాటు ఎన్నికల్లో పోటీ చేయాడనికి అనర్హులు అవుతారు. దేశం కోసం గాంధీల కుటుంబం ఎన్నో త్యాగాలు చేసిందని చెప్పుకుంటారు కానీ..ఇప్పుడు ఆ గాంధీల కుటుంబం నుంచి ఒకరు పరువు నష్టం కేసులో జైలుకె్ళ్లడం మాత్రం.. విచిత్రమే.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ప్రజల ట్రోలింగ్ దెబ్బకు బ్యాండేజ్ మాయం..!!

ఏపీ సీఎం జగన్ రెడ్డి ఎట్టకేలకు బ్యాండేజ్ వదిలేశారు. జగన్ కనుబొమ్మపై రాయి దాడి జరిగి రెండు వారాలైనా బ్యాండేజ్ విప్పకపోవడంతో ఇదంతా సానుభూతి డ్రామా అనే చర్చ జరిగింది. జగన్ కు...

ఐపీఎల్ ఎఫెక్ట్: బౌల‌ర్లే బ‌లి ప‌శువులు అవుతున్నారా?!

262 ప‌రుగుల ల‌క్ష్యం.. ఒక‌ప్పుడు వ‌న్డేల్లో ఈ టార్గెట్ రీచ్ అవ్వ‌డానికి ఛేజింగ్ టీమ్ ఆప‌సోపాలు ప‌డేది. ఇప్పుడు టీ 20ల్లోనే ఊదిప‌డేశారు. శుక్ర‌వారం కొల‌కొత్తా నైట్ రైడ‌ర్స్‌ - కింగ్స్ లెవెన్ పంజాబ్...

ఫ్లాష్ బ్యాక్‌: క్రెడిట్ తీసుకోవడానికి భయపడ్డ త్రివిక్రమ్

ఇప్పుడు పరిస్థితి మారింది కానీ ఒకప్పుడు రచయిత అనే ముద్ర పడిన తర్వాత ఇక దర్శకుడయ్యే అవకాశాలు పూర్తిగా తగ్గిపోతాయి. రైటర్ గానే కెరీర్ ముగిసిపోతుంది. అందుకే అప్పట్లో దర్శకుడు కావాలని వచ్చిన...

టెట్ నిర్వహణపై సస్పెన్స్

తెలంగాణలో టీచర్ ఎలిజిబులిటీ టెస్ట్ (టెట్) పై సస్పెన్స్ నెలకొంది. గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో టెట్ పరీక్షను వాయిదా వేస్తారా..?షెడ్యూల్ ప్రకారమే నిర్వహిస్తారా..?అని అభ్యర్థులు స్పష్టత కోసం ఎదురుచూస్తున్నారు. టెట్ పరీక్షల...

HOT NEWS

css.php
[X] Close
[X] Close