ఆఫర్ సరే.. మద్దాలి గిరిది ఏ పార్టీ.. ఏ పార్టీకి ఓటేశారు !?

ఏపీ రాజకీయాలు చిత్ర విచిత్రంగా సాగుతున్నాయి. ఎమ్మెల్సీ ఎన్నికల్లో పరాజయం పాలై…. ధిక్కరించిన ఎమ్మెల్యేలంటూ కొంతమంది పై వేటేసిన తర్వాత ఇతర పార్టీల నుంచి ఫిరాయించిన ఎమ్మెల్యేలకు తమకు కూడా ఆఫర్లు వచ్చాయంటూ తెర మీదకు వస్తున్నారు. వైసీపీలోకి ఫిరాయించిన జనసేన ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్ అలా చేసిన తర్వాత తాజాగా గుంటూరు పశ్చిమ ఎమ్మెల్యే కూడా అలాంటి ఆరోపణలు చేస్తున్నారు. ఏవో నాలుగు ఫోన్ నెంబర్లు చూపించి తనకు ఆ ఫోన్ నెంబర్ల నుంచి ఆఫర్లు వచ్చాయని చెప్పుకొస్తున్నారు.

నిజానికి సాంకేతికంగా మద్దాల గిరి టీడీపీ బీఫాం మీద గెలిచిన వ్యక్తి. అసెంబ్లీ రికార్డుల్లో ఆయన టీడీపీ సభ్యుడిగానే ఉన్నారు. ఆయనను టీడీపీ సస్పెండ్ చేయలేదు. వైసీపీలో అధికారికంగా చేరలేదు. అయినా తనకు డబ్బులు ఆఫర్ చేశారని ఆయన ఎలా చెబుతున్నారో కానీ.. అది ఆయనకే మచ్చ అనే విషయం గుర్తించలేకపోతున్నారు. పైగా పోలింగ్ కు వారం ముందే తనకు ఆఫర్ వచ్చిందని చెప్పుకొచ్చి.. పోలింగ్ అయిపోయిన ఐదు రోజుల తర్వాత ఎందుకు స్పందిస్తున్నారో కానీ.. అసలు టీడీపీ ఎమ్మెల్యే అయి ఉండి.. వైసీపీకి ఎందుకు ఓటేశారనే ప్రశ్న ఇప్పుడు ఆయనకు ఎదురవుతోంది.

టీడీపీ నుంచి గెలిచిన వైసీపీలోకి ఫిరాయించిన మద్దాలి గిరి ప్రభుత్వం నుంచి తన మిల్లులకు రావాల్సిన సబ్సిడీలను రాబట్టుకున్నారు. తర్వాత నియోజకవర్గానికి ఏమైనా పనులు చేశారా అంటే అదీ లేదు. నివాసం ఉన్న సొంత వార్డులో కార్పొరేటర్‌ను గెలిపించుకోలేకపోయారు. వచ్చే ఎన్నికల్లో గుంటూరు పశ్చిమ నుంచి అప్పిరెడ్డి పోటీ చేయడానికి రెడీ అవుతున్నారు. ఇలాంటి ఆరోపణలు చేస్తే గుంటూరు టిక్కెట్ ఖరారు చేస్తారన్న ఉద్దేశంతో ఆయనీ పనులు చేస్తున్నారని గుసగుసలు వినిపిస్తున్నాయి.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

అల్లు అర్జున్ చేతుల మీదుగా ‘తెలుగు ఇండియన్ ఐడల్ 2’ విన్న‌ర్ కిరీటాన్ని అందుకున్న సౌజ‌న్య

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ చేతుల మీదుగా ‘తెలుగు ఇండియన్ ఐడల్ 2’ విన్న‌ర్ కిరీటాన్ని అందుకున్న సౌజ‌న్య భాగ‌వ‌తుల‌ తెలుగు వారి హృద‌యాల్లో ప్ర‌త్యేక స్థానాన్ని ద‌క్షించుకున్న తిరుగులేని ఎంట‌ర్‌టైన్మెంట్‌ను అందిస్తూ దూసుకెళ్తోన్న...

బీజేపీ, మోదీ మాటెత్తకుండానే కేసీఆర్ బహిరంగసభ ప్రసంగం !

కేసీఆర్ బహిరంగసభా వేదికపై గత రెండు, మూడేళ్లలో ఎక్కడ మాట్లాడినా ఆయన ప్రసంగంలో సగం బీజేపీ, మోదీని విమర్శించడానికే ఉండేది. తాను జాతీయ రాజకీయాల్లోకి వెళ్తున్నానని బీజేపీ సంగతి చూస్తానని చెప్పేవారు ....

కాంగ్రెస్ పిలిస్తే కోదండరాం కూడా రెడీ !

తెలంగాణలో కాంగ్రెస్ పార్టీతో పని చేయడానికి చాలా మంది రెడీగా ఉన్నారు. తాజాగా కోదండరాం కూడా రెడీ అయ్యారు. తెలంగాణ పరిరక్షణకు.. ప్రజాస్వామ్య తెలంగాణకు టీజేఎస్ కృషి చేస్తోందని..తెలంగాణ ఆకాంక్ష నెరవేర్చడంకోసం తెలంగాణ...

నెల్లూరులో ఆనం వెంకటరమణారెడ్డిపై దాడి!

ప్రభుత్వంపై ఘాటుగా విమర్శలు చేసే టీడీపీ నేతల ఇళ్లపైకి రౌడీముకల్ని పంపి దాడులు చేయించడం ... పోలీసులు చూస్తూ ఉండటం కామన్ గా మారిపోయింది. గతంలో పట్టాభి ...

HOT NEWS

css.php
[X] Close
[X] Close