పోలవరం ఎత్తు లోక్‌సభకు..రాజ్యసభకు వేర్వేరు !

ఏపీ జీవనాడి పోలవరం ప్రాజెక్టుతో కేంద్రం ఆటలు ఆడుతోంది. క్లారిటీ లేకుండా విరుద్ధమైన సమాధానాలు చెబుతోంది. పోలవరం ప్రాజెక్టు పనులు గత నాలుగేళ్లుగా పూర్తిగా ఆగిపోయాయి. డబ్బులు రీఎంబర్స్ చేయాల్సిన పని లేకపోవడంతో పట్టించుకోవడం లేదు. ఇప్పుడు పోలవరం ఎత్తుపైనా దాగుడుమూతల సమాధానాలు చెబుతున్నారు.

నాలుగు రోజుల కిందట వైసీపీ ఎంపీ సత్యవతి పోల‌వ‌రం ఎత్తుపై అడిగిన ఓ ప్రశ్నకు కేంద్ర జల్‌శక్తి శాఖ సహాయ మంత్రి ప్రహ్లాద్‌సింగ్‌ పటేల్‌ లిఖితపూర్వక సమాధానం ఇస్తూ పోలవరం ప్రాజెక్టు ఎత్తు 41.15 మీటర్లకే పరిమితమని తేల్చి చెప్పారు.. ప్ర‌క‌ట‌న వ‌చ్చి నాలుగు రోజులు గ‌డ‌వ‌క ముందే పోలవరం పై కేంద్ర ప్రభుత్వం మళ్లీ మాట మార్చింది. తాజాగా నేడు రాజ్యసభలో ప్రాజెక్టు ఎత్తుపై కేంద్రం కీలక ప్రకటన చేసింది. పోలవరం ప్రాజెక్టులో నీటి నిల్వ 45.72 మీటర్లని కేంద్రం స్పష్టం చేసింది. పోలవరం పురోగతిపై రాజ్యసభలో ప్రశ్నోత్తరాల సమయంలో టిడిపి రాజ్య‌స‌భ స‌భ్యుడు ఎంపీ కనకమేడల రవీంద్ర పోల‌వ‌రం ఎత్తుపై ప్ర‌శ్న వేశారు..

దీనికి కేంద్రమంత్రి బిశ్వేశ్వర్ తుడు లిఖిత పూర్వకంగా సమాధానమిస్తూ, 1980 నాటి గోదావరి ట్రిబ్యునల్ అవార్డు ప్రకారం పూర్తి నీటి నిల్వ సామర్థ్యం ఎత్తు 45.72 మీటర్లు అని ఆ మేర‌కే నిర్మాణ ప‌నులు కొన‌సాగిస్తున్నామ‌ని పేర్కొన్నారు.. నీటి నిల్వ సామర్ధ్యం 41.15 కి తగ్గించాలంటూ ఏపీ ప్రతిపాదించినట్టు తమకు సమాచారం లేదని తెలిపారు. అసెంబ్లీలో సీఎం జగన్ కూడా మొదటి దశలో 41.15 మీటర్ల కాంటూర్ దగ్గరే నీటి నిల్వ చేస్తామని ప్రకటించారు. అయితే అటువంటి ప్ర‌తిపాద‌న ఏదీ ఎపి ప్ర‌భుత్వ నుంచి త‌మ‌కు అంద‌లేద‌ని మంత్రి తుడు తేల్చి చెప్పారు..

ఈ మొత్తం వ్యవహారంలో ఇటు రాష్ట్రం అటు కేంద్రం బాధ్యతారాహిత్యంగా వ్యవహరిస్తున్నాయి. గత ప్రభుత్వ హయాంలో పరుగులు పెట్టిన పనులు ఇప్పుడు పడకేశాయి. ఎంత ఆలస్యం అయితే.. అంత ఖర్చు పెరుగుతుందని తెలిసినా ప్రభుత్వాలు నిర్లక్ష్యం చేస్తూనే ఉన్నాయి. అది ఏపీకి శాపంగా మారుతోంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

అగ్రదేశాలు పక్కనపెడుతుంటే ఇండియాలోనే ఎందుకు? ఈవీఎంలే బీజేపీ బలమా..?

లోక్ సభ ఎన్నికల వేళ మరోసారి ఈవీఎంల పనితీరుపై దేశవ్యాప్తంగా చర్చ జరుగుతోంది. సాంకేతికతకు పెద్దపీట వేసే అగ్రదేశాలు సైతం ఈవీఎంలను పక్కనపెడుతుంటే ఇండియాలో మాత్రం ఎందుకు ఈవీఎంలతోనే ఎన్నికలను నిర్వహిస్తున్నారనే ప్రశ్నలు...

రాజారెడ్డి రాజ్యాంగంలో అది హత్యాయత్నమే!

సాక్షి పేపర్ రాతల్ని పోలీసులు యథావిథిగా రిమాండ్ రిపోర్టుగా రాసి.. ఓ బీసీ మైనల్ బాలుడ్ని మరో కోడికత్తి కేసు శీనులా బలి చేయడానికి రెడీ అయిపోయారు. రాయితో దాడి చేశారో లేదో...

క‌విత అరెస్ట్… కేసీఆర్ చెప్పిన స్టోరీ బానే ఉందా?

త‌న కూతురు, ఎమ్మెల్సీ క‌విత అరెస్ట్ పై ఇంత‌వ‌ర‌కు కేసీఆర్ ఎక్క‌డా స్పందించ‌లేదు. ఈడీ కేసులో అరెస్ట్ అయి తీహార్ జైల్లో ఉన్న క‌విత‌ను చూసేందుకూ వెళ్లలేదు. ఫైన‌ల్ గా బీఆర్ఎస్ నేత‌ల...

రానాతోనే ‘లీడ‌ర్ 2’: శేఖ‌ర్ క‌మ్ముల‌

శేఖ‌ర్ క‌మ్ముల సినిమాలో హిట్లూ, సూప‌ర్ హిట్లూ ఉన్నాయి. అయితే సీక్వెల్ చేయ‌ద‌గిన స‌బ్జెక్ట్ మాత్రం 'లీడ‌ర్‌' మాత్ర‌మే. ఈ సినిమాని కొన‌సాగిస్తే బాగుంటుంద‌ని రానా చాలాసార్లు చెప్పాడు. ఇప్పుడు శేఖ‌ర్ క‌మ్ముల...

HOT NEWS

css.php
[X] Close
[X] Close