టీడీపీపై వ్యతిరేకతను జీవీఎల్ విద్వేషంగా మార్చుకుంటున్నారా..?

భారతీయ జనతా పార్టీకి ఆంధ్రప్రదేశ్ తరపున ఇప్పుడు జీవీఎల్ నరసింహారావు తప్ప ఎవరూ కనిపించడం లేదు. చంద్రబాబు తుమ్మినా.. దగ్గినా… వెంటనే ఢిల్లీ నుంచి ఫ్లైట్ లో వచ్చేసి.. ఏపీలో ప్రెస్ మీట్ పెట్టేస్తున్నారు. దాని వెనుక అర్థాలు విడమర్చి చెప్పి.. దురర్థాలతో హడావుడి చేసే ప్రయత్నం చేస్తున్నారు. చివరికి ఏపీ ప్రభుత్వం ఉద్యోగులకు జీతాలివ్వడం కూడా తప్పేనన్నట్లుగా చెప్పుకు రావడం ప్రారంభించారు. పీడీ అకౌంట్ల దగ్గర్నుంచి చంద్రబాబు ప్రయాణ ఖర్చులు కూడా.. దుబారా చేస్తున్నారన్నట్లుగా.. కడపు మంటతో ఆవేశ పడిపోతున్నారు.

చంద్రబాబుపై వ్యతిరేకతను విద్వేషంగా మార్చుకుంటున్నారా..?

ఉత్తరప్రదేశ్ నుంచి జీవీఎల్ నరసింహారావు అనే వ్యక్తి ఎంపీగా ఎన్నికయ్యారని తెలిసి చాలా మంది ఆశ్చర్యపోయారు. బీజేపీ ఎమ్మెల్యేలు దండిగా ఉండటంతో.. అమిత్ షా పట్టుబట్టి ఆయనకు రాజ్యసభ సీటు ఇప్పించారని చెప్పుకున్నారు. అప్పుడే.. జీవీఎల్ నరసింహారావు అనే వ్యక్తి బీజేపీలో .. ఉన్నారని ఏపీలో తెలిసింది. అప్పటి వరకూ… ఈ జీవీఎల్‌కు… ఏపీ బీజేపీ నేతలతో కూడా పెద్దగా సంబంధాలు లేవు. కానీ యూపీ ఎంపీగా ఎన్నికయిన తర్వాత.. టీడీపీ ఎన్డీఏకు గుడ్ బై చెప్పింది. ఆ తర్వాత ఆయన ఏపీపై పడ్డారు. చంద్రబాబును టార్గెట్ చేసుకుని.. ఏ మాత్రం… ఆధారాలు లేని… అభూతకల్పనలను మీడియా ముందు చెబుతూ.. చెలరేగిపోయారు. మొదట్లో.. మీడియా కూడా.. జీవీఎల్ మాటలను ఇంపార్టెన్స్ ఇచ్చింది. బీజేపీ అధికార ప్రతినిధిగా ఉండి.. ఏదో ఆధారాలు లేకుండా ఎలా మాట్లాడతారన్న కారణంగా కావొచ్చు..! కానీ జీవీఎల్ మంత్రి లోకేష్ నుంచి చంద్రబాబు వ్యక్తిత్వాలను కించ పరిచే విధంగా మాట్లాడుతూనే ఉన్నారు కానీ… ఒక్కటంటే.. ఒక్క ఆధారం కూడా బయపెట్టలేదు. లోకేష్ మనుషులు ఢిల్లీలో లాబీయింగ్ చేస్తున్నారని విమర్శించారు. చంద్రబాబుకు.. ఐరాస నుంచి ఆహ్వానం రాలేదన్నారు. కానీ…అన్నీ తప్పేనని తేలినా అడ్డగోలుగా సమర్థించుకున్నారు కానీ… సిగ్గుపడలేదు.

ఏపీ ప్రజలు అంత అమాయకులనుకుంటున్నారా..?

ఏపీకి లక్షల కోట్లు ఇచ్చామని.. ఆ సొమ్మంతా చంద్రబాబు సొంత ఖాతాలో వేసుకంటున్నట్లు జీవీఎల్ ప్రచారం చేయాడనికి ఏ మాత్రం వెనుకాడటం లేదు. ఏమిచ్చారనే విషయం అడిగితే.. రాష్ట్రం నుంచి వసూలు చేసే పన్నుల వాటాలు తప్ప… కొత్తగా ఏమిచ్చారో .. చెప్పడానికి ఆయన దగ్గర లెక్కల్లేవు. ఎన్ని టీవీ చర్చల్లో కూర్చున్నా.. అదే సమాధానం. మరి ఏపీకి ఏమిచ్చారు..? బీజేపీ… ఏపీని అత్యంత దారుణంగా వంచించిందనడానికి కళ్ల ముందు సాక్ష్యాలు కనిపిస్తున్నాయి. వెనుకబడిన జిల్లాకు ఇచ్చిన నిధులు బ్యాంకులో వేసి వెనక్కి తీసుకున్నారు. ఎందుకలా చేయాల్సి వచ్చిందో కేంద్రం ఇంత వరకూ చెప్పలేదు. యూపీల పేరుతో జీవీఎల్ హడావుడి చేస్తున్నారు. అదే నిజమైతే కేంద్రం ఎందుకు అధికారికంగా ప్రకటించదు..?. ఏపీకి న్యాయబద్ధంగా ఇవ్వాల్సిన ఒక్కటి కూడా ఇవ్వలేదు. ప్రత్యేకహోదా ఇవ్వలేదు.. రైల్వేజోన్ ఇవ్వలేదు.. స్టీల్ ఫ్యాక్టరీ ఇవ్వలేదు… పోర్టు ఇవ్వలేదు… కేంద్ర విద్యాసంస్థలు నిధులు ఇవ్వడం లేదు.. ఇలా చెప్పుకుంటూ పోతే .. చాట భారతం అవుతుంది. ఇవన్నీ కళ్ల ముందు కనిపిస్తున్నాయి. అయినప్పటికీ.. జీవీఎల్.. కేంద్రం ఏదో చేస్తుందని ప్రజలను నమ్మించడానికి ఎందుకు ప్రయత్నిస్తున్నారు. ఏపీ ప్రజలు అమాయకులా..?

ఏపీ ప్రభుత్వ వ్యవహారాల్లో జోక్యం ఎందుకు..?

కొత్తగా జీవీఎల్.. ఏపీ ప్రభుత్వం తెగ ఖర్చు పెట్టేస్తోందని.. ఏకంగా గవర్నర్‌కు ఫిర్యాదు చేశారు. ఏం ఖర్చు పెట్టారో కూడా వివరంగా చెప్పాల్సింది. తెలుగుదేశం పార్టీ.. పార్టీ తరుపున ధర్మ పోరాట దీక్షలుచేస్తోంది. ఈ దీక్షల్లో మోడీ బండారం బయట పెడుతున్నారని… జీవీఎల్‌కు కాలిపోతున్నట్లుగా ఉంది. ప్రభుత్వం తరపున ఖర్చు పెడుతున్నట్లు అడ్డగోలు ప్రచారం చేసి రాజకీయ లబ్ది పొందుదామనుకుంటున్నారు. అలాగే చంద్రబాబు… సేవ్ నేషన్ ఫ్రంట్ కోసం… ఇతర రాష్ట్రాలకు వెళ్తున్నదాన్ని కూడా.. దుబారాగా భావిస్తున్నారు. ఈ పరిస్థితి చూస్తూంటే.. బీజేపీకి వ్యతిరేకంగా చంద్రబాబు చేస్తున్న పోరాటానికి జీవీఎల్ భయపడుతున్నట్లుగా ఉంది. అసలు జీవీఎల్ ఉత్తరప్రదేశ్ ఎంపీ. ఆయన మొత్తం ఏపీలోనే గడుపుతున్నారు. యూపీ ఎంపీ జీతాలు, అలవెన్స్‌లు తీసుకుంటూ… ప్రయాణ భత్యాలు అందుకుంటూ.. ఏపీలో రాజకీయం చేయడం.. ప్రజాసొమ్మును దుర్వినియోగం చేయడం కాదా..? మొత్తంగా చూస్తే.. జీవీఎల్.. చంద్రబాబుపై వ్యతిరేకతను… విద్వేషం స్థాయికి పెంచుకుంటున్నారు. ఐటీ, ఈడీలను ఉసిగొల్పి ఏమీ చేయలేకపోయామనే.. దుగ్ధతో మరితంగా అధికార అహంకారంతో ఏదో ఒకటి చేయాలన్న తాపత్రయ పడిపోతున్నారు. రాజకీయాల్లో అది ఎప్పటికీ… మెరుగైన స్థితికాదు. విచక్షణ కోల్పోతే… వెనక్కి తిరిగి చూసుకోవడానికికూడా ఏమీ మిగలదు.

———-సుభాష్

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

షర్మిల రాజకీయానికి జగన్ బెదురుతున్నారా..?

ఏపీ కాంగ్రెస్ చీఫ్ షర్మిలపై జగన్ రెడ్డి సర్కార్ కక్ష సాధింపు చర్యలకు దిగుతోంది. జగన్ తనపై చేసిన వ్యాఖ్యలకు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చిన మరుసటి రోజే షర్మిలకు పోలీసులు అడ్డంకులు సృష్టించారు....

నిస్సహాయుడిగా కేసీఆర్..!?

బీఆర్ఎస్ నేతలపై కేసీఆర్ పట్టు కోల్పోతున్నారా..? క్రమశిక్షణకు మారుపేరుగా చెప్పుకునే ఆ పార్టీలో క్రమశిక్షణ లోపిస్తుందా..? నేతలు హద్దులు దాటుతున్న చర్యలు తీసుకోని నిస్సహాయ స్థితికి కేసీఆర్ చేరుకున్నారా..? అంటే అవుననే...
video

‘ప్ర‌స‌న్న‌వ‌ద‌నం’ ట్రైల‌ర్‌: కొత్త పాయింటే ప‌ట్టారు

https://www.youtube.com/watch?v=uy8tkUFAsnA సుహాస్‌పై ప్రేక్ష‌కుల‌కు ఓ మంచి అభిప్రాయ‌మే ఉంది. త‌ను క‌చ్చితంగా విభిన్న ప్ర‌య‌త్నాలు చేస్తాడ‌నది అంద‌రి న‌మ్మ‌కం. క‌ల‌ర్ ఫొటో నుంచి అంబాజీ పేట మ్యారేజీ బ్యాండు వ‌ర‌కూ త‌న ట్రాక్ రికార్డ్...

హరీష్ రావు ఉత్తుత్తి రాజీనామా – కామెడీ చేసిన కాంగ్రెస్ !

తెలంగాణ ఉద్యమం కోసం ఇప్పటికే ఎన్నో సార్లు రాజీనామా చేశానని.. తనకు పదవులు ఓ లెక్క కాదంటూ చెప్పే హరీష్ రావు.. తాజాగా చేసిన రాజీనామా ఆయనను ట్రోల్ చేసేలా ఉంది....

HOT NEWS

css.php
[X] Close
[X] Close