రమేష్, సుజనా ల మీద చర్యలు తీసుకోవాలని లేఖ రాసిన జివిఎల్ ఇప్పుడేమంటారో?

తెలుగుదేశం పార్టీ రాజ్యసభ ఎంపీలు సీఎం రమేష్, సుజనా చౌదరిలు మరో ఇద్దరు ఎంపీలతో పాటు కలిసి బిజెపిలో చేరి పోయారు. మొన్నటిదాకా విలువలు మాట్లాడిన బిజెపి నాయకులు దగ్గరుండి ఈ తంతు పూర్తి చేశారు. అయితే ఒక ఆరు నెలల కిందట బిజెపికి చెందిన రాజ్యసభ సభ్యుడు జివిఎల్ నరసింహారావు ఎథిక్స్ కమిటీకి రాసిన లేఖ ఇప్పుడు సోషల్ మీడియాలో మళ్ళీ వైరల్ అయింది. ఆ లేఖను చూపిస్తూ జివిఎల్ నరసింహారావు గారు ఇప్పుడేమంటారు మరి అంటూ ప్రశ్నిస్తున్నారు నెటిజన్లు. వివరాల్లోకి వెళితే..

బిజెపి రాజ్యసభ సభ్యుడు జివిఎల్ నరసింహారావు 2018 డిసెంబర్ లో ఎథిక్స్ కమిటీకి ఒక లేఖ రాశారు. ఆ కమిటీ చైర్మన్ నారాయణ లాల్ పంచారియా ని సంబోధిస్తూ రాసిన ఆ లేఖలో తెలుగుదేశం పార్టీ ఎంపీ ఐనటువంటి సిఎం రమేష్, సుజనా చౌదరిలు పలు ఆర్థిక నేరాలకు పాల్పడ్డారని ఆరోపణలు వస్తున్నాయని, సుజనా చౌదరి అయితే 5700 కోట్ల రూపాయలకు బ్యాంకు రుణాలు తీసుకొని బ్యాంకులని మోసం చేశారని ఆయన రాసుకొచ్చారు. వీరిద్దరు చేస్తున్న ఆర్థిక నేరాల కారణంగా రాజ్యసభ ప్రతిష్ట మసకబారుతోంది అని, వీరి మీద తక్షణం చర్యలు తీసుకోవాలని, తద్వారా రాజ్యసభ ప్రతిష్టను తిరిగి పునరుద్ధరించాలని జీవీఎల్ నరసింహారావు లేఖలో పేర్కొన్నారు.

కట్ చేస్తే, ఇప్పుడు అదే ఎంపీలు బిజెపిలో చేరి పోయారు. మరి ఇప్పుడు వీరిద్దరి కారణంగా, వీరు చేసిన ఆర్థిక నేరాల కారణంగా రాజ్యసభ ప్రతిష్ట మసకబారిన అంటూ నెటిజన్లు జివిఎల్ నరసింహారావు ప్రశ్నిస్తున్నారు. గత కొంతకాలంగా సుజనా చౌదరి మీద సీఎం రమేష్ ల మీద కేంద్ర ప్రభుత్వ సంస్థలు దాడి చేయడం, చేసిన ప్రతిసారి కొన్ని కీలకమైన డాక్యుమెంటు దొరికాయని ప్రకటనలు చేయడం తెలిసిందే. మరి వీరిద్దరూ బిజెపిలో చేరిన దరిమిలా ఇప్పుడు ఆ కీలక డాక్యుమెంట్లు కూడా చెత్తబుట్టలోకి వెళ్తాయేమో అంటూ మరికొందరు సందేహాలు వ్యక్తం చేస్తున్నారు.

ఏది ఏమైనా ఎథిక్స్ కమిటీకి, అంత పెద్ద లేఖ రాసి, ఇప్పుడు అదే ఎంపీలను తమ పార్టీలోకి చేర్చుకుని తమ ఎథిక్స్ ఏపాటివో బీజేపీ పెద్దలు చెప్పకనే చెప్పారని, మరి ఇప్పుడు ఈ సంఘటనపై జివిఎల్ ఎలా స్పందిస్తారో చూడాలని నెటిజన్లు, ప్రజలు కుతూహలంతో ఉన్నారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ఇంటలిజెన్స్ చీఫ్, విజయవాడ సీపీ బదిలీ !

ఏపీ ఇంటలిజెన్స్ చీఫ్ సీతారామాంజనేయులు, విజయవాడ పోలీస్ కమిషనర్ కాంతిరాణా టాటాను ఈసీ బదిలీ చేసింది. వెంటనే వీరిని రిలీవ్ చేయాలని ఆదేశించింది. వీరిద్దర్నీ ఎన్నికలకు సంబంధం లేని విధుల్లో నియమించాలని స్పష్టం...

ప్రతినిధి.. ఇప్పుడు కాక ఇంకెప్పుడు?

నారా రోహిత్ రీ ఎంట్రీ ఇచ్చిన సినిమా... 'ప్ర‌తినిధి 2'. జ‌ర్న‌లిస్ట్ మూర్తి ఈ సినిమాతో ద‌ర్శ‌కుడి మార‌డం, ఎన్నిక‌ల సీజన్‌లో విడుద‌ల అవుతుండడం వ‌ల్ల ఈ సినిమాపై ఫోక‌స్ పెరిగింది....

అమితాబ్ బ‌చ్చన్ ‘హైటు’ పెంచిన నాగ అశ్విన్‌

స్టార్ డ‌మ్ లోనే కాదు, హైట్ లోనూ అమితాబ్ బ‌చ్చ‌న్‌ని కొట్టేవాళ్లే లేరు. బాలీవుడ్ స్టార్స్‌ల‌లో ఆయ‌న అత్యంత పొడ‌గ‌రి. ఆయ‌న ఎత్తు.. ఆర‌డుగుల రెండు అంగుళాల పైమాటే. అయితే... 'క‌ల్కి' కోసం...

సెంచరీకి చేరువలో చింతమనేనిపై కేసులు..!!

చింతమనేని ప్రభాకర్...మాస్ లీడర్. ఆయన ఆహార్యం కూడా అలాగే ఉంటుంది. ఎన్నికల్లో టీడీపీ తరఫున దెందులూరు నుంచి పోటీ చేస్తోన్న చింతమనేని ప్రభాకర్ మంగళవారం నామినేషన్ దాఖలు చేశారు. రిటర్నింగ్ ఆఫీసర్ కు...

HOT NEWS

css.php
[X] Close
[X] Close