వైసీపీ శ్రేయోభిలాషులకు బీజేపీలో ప్రాధాన్యత తగ్గినట్లేనా..!?

భారతీయ జనతా పార్టీ జాతీయ కార్యవర్గం కూర్పు జాతీయ స్థాయిలో ఆసక్తి రేకెత్తించింది. రామ్‌మాధవ్, మురళీధర్ రావు లాంటి వాళ్లను పక్కన పెట్టడం… తేజస్వి సూర్య లాంటి వారికి పట్టం కట్టడమే దీనికి కారణం. అయితే.. ప్రాధాన్యం తగ్గిన నాయకులకు ప్రభుత్వంలో పదవులు ఇస్తారని చెబుతున్నారు. అంటే.. పార్టీ వ్యవహారాలతో వారికి ఇక సంబంధం లేనట్లే చెప్పుకోవచ్చు. ఈ విషయంలో ఆంధ్రప్రదేశ్‌ రాజకీయాల్లో ఆసక్తికరమైన చర్చలు జరుగుతున్నాయి. ఎందుకంటే వైసీపీ శ్రేయోభిలాషులుగా పేరు పొందిన వారందర్నీ ఒక్క సారిగా పార్టీ వ్యవహారాల నుంచి పక్కన పెట్టేశారు. వైసీపీకి ఢిల్లీలో స్ట్రాంగ్‌గా ఉండే లీడర్‌గా రామ్‌మాధవ్‌కు పేరు ఉంది. అలాగే జీవీఎల్ తెర ముందే వైసీపీకి మద్దతు ప్రకటిస్తూంటారు.

పాలనలో లోపాలు ఎత్తి చూపకపోగా.. గతంలో టీడీపీ కూడా అలాగే చేసింది కదా అంటూ.. అనధికారిక ప్రతినిధి అన్నట్లుగా వైసీపీకి సపోర్ట్ చేసేవారు. ఢిల్లీలో ఇలాంటి పలుకుబడి గల నేతలు ఇప్పుడు బీజేపీలో ఎలాంటి ప్రభావం చూపకుండా అయిపోవడం మాత్రం వైసీపీ షాక్‌లాంటిదేనంటున్నారు. అదే సమయంలో… వైసీపీ పొడ ఏ మాత్రం గిట్టని పురందేశ్వరికి పదవి ఇచ్చారు. పురందేశ్వరిని కారణంగా చూపి… దగ్గుబాటి వెంకటేశ్వరరావు వైసీపీ నుంచి బయటకు పంపేశారు. వారి కుమారుడికి రాజకీయభవిష్యత్ లేకుండా చేసే ప్రయత్నం చేశారు. అయినప్పటికీ.. పురందేశ్వరి బీజేపీలోనే ఉన్నారు. అలాగని టీడీపీతోనూ ఆమెకు ఎలాంటి సంబంధాలు లేవు. నిఖార్సుగా బీజేపీ కోసం పని చేయగలరు. అలాగే కడప జిల్లాకు చెందిన సత్యకుమార్ వెంకయ్యనాయుడు శిష్యుడు.

ఆయన వైసీపీకి మద్దతుగా మాట్లాడే అవకాశం లేదు. వైసీపీ విధానాలను సమర్థించే అవకాశం లేదు. ప్రస్తుతం రాష్ట్రంలో తీసుకుంటున్న నిర్ణయాలన్నింటికీ ఢిల్లీలో ఏ మార్గం ద్వారా ఆమోద ముద్ర వేయించుకుంటున్నారో.. ఆ మార్గాలు వైసీపీకి మూసుకుపోయాయనే భావన వ్యక్తమవుతోంది. కొద్ది రోజుల కిందట.. సోము వీర్రాజును ఏపీ బీజేపీ అధ్యక్షుడిగా ప్రకటించడం ద్వారా వైసీపీకి హుషారొచ్చినా.. ప్రస్తుత జాతీయ కార్యవర్గంతో మాత్రం.. ఆ పార్టీకి నీరసం వచ్చినట్లయింది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

మేనిఫెస్టో మోసాలు : చేసింది జలయజ్ఞం కాదు జలభగ్నం !

వైఎస్ఆర్ జలయజ్ఞం.. వైఎస్ఆర్ కలలు కన్నారు. ఆ యజ్ఞాన్ని పూర్తి చేస్తాం. పోలవరం, వెలిగొండ యుద్ధప్రాతిపదికన పూర్తి చేస్తాం. రక్షిత మంచినీరు, సాగునీరు కల నిజం చేస్తాం. చెరువులను పునరుద్ధరిస్తాం .. జలకళను...

కాంగ్రెస్ కు అడ్వాంటేజ్ గా హరీష్ రావు సవాళ్ళు..!?

బీఆర్ఎస్ అధికారం కోల్పోయాక అటు కేసీఆర్, ఇటు హరీష్ రావు రాజకీయ వ్యూహాలు తేలిపోతున్నాయి. ప్రత్యర్ధులను కట్టడి చేసేందుకు చేస్తోన్న వ్యాఖ్యలు బీఆర్ఎస్ కు మేలు చేయకపోగా...అధికార కాంగ్రెస్ కు ఫేవర్ చేసేలా...

ఎడిటర్స్ కామెంట్ : ఆన్ లైన్ ఎలక్షన్స్ !

ఇండియాలో కేజీ బియ్యం రూ. వంద పలుకుతుంది కానీ ఒక్క జీబీ డేటా మాత్రం ఐదు రూపాయలకే వస్తుంది. మీరు సమయం అంతా యూట్యూబ్ వీడియోలు.. సోషల్ మీడియా మీదే గడపుతామంటే...

కేసీఆర్, హరీష్ రావులకు నోటిసులు..?

కాళేశ్వరం ప్రాజెక్టు విషయంలో కాంగ్రెస్ సర్కార్ ఏర్పాటు చేసిన జ్యుడిషియల్ కమిషన్ వర్క్ స్టార్ట్ చేసింది. గురువారం మొదటిసారి రాష్ట్రానికి వచ్చిన జస్టిస్ పినాకి చంద్రఘోష్ టీం బీఆర్కేఆర్ భవన్ లో ఇరిగేషన్...

HOT NEWS

css.php
[X] Close
[X] Close