హైకోర్టుపై నిందలు… కొమ్మినేనికీ నోటీసులు..!

ఉన్నత న్యాయస్థానంపై అనుచిత వ్యాఖ్యలు చేసిన సాక్షి టీవీ ప్రధాన జర్నలిస్టు కొమ్మినేని శ్రీనివాసరావు సహా 44 మందికి హైకోర్టు తాజాగా నోటీసులు జారీ చేసింది. న్యాయమూర్తులు, న్యాయస్థానాలపై… అసభ్య పోస్టులను వీరందరూ పెట్టినట్లు… ఆధారాలతో సహా న్యాయస్థానం రిజిస్ట్రార్‌కు ఫిర్యాదులు అందాయి. నోటీసులు అందుకున్న వారిలో కొమ్మినేనితో పాటు అనకాపల్లి ఎమ్మెల్యే గుడివాడ అమర్నాథ్ కూడా ఉన్నారు. ప్రసాద్ రెడ్డి అనే మరో జర్నలిస్టుకి.. పంచ్ ప్రభాకర్ అనే అమెరికా లో ఉండే వైసీపీ అభిమానికి కూడా నోటీసులు వెళ్లాయి. ఇప్పటికే 49 మందికి నోటీసులు జారీ చేసింది హైకోర్టు. హైకోర్టు రిజిస్ట్రార్ ఫిర్యాదు మేరకు పలువురిపై సీఐడి కేసులు నమోదు చేసి విచారణ కూడా ప్రారంభించింది.

కొమ్మినేని శ్రీనివాసరావు సుమన్ టీవీ అనే యూ ట్యూబ్ చానల్‌కు ప్రత్యేకంగా ఇంటర్యూ ఇచ్చి..న్యాయస్థానాలపై అనుచిత వ్యాఖ్యలు చేశారు. నిజానికి కొమ్మినేని సాక్షి టీవీలోనే చర్చా కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉంటారు. ఆయన ఎన్నో సార్లు.. వైసీపీకి మద్దతుగా.. ఆ చర్చా కార్యక్రమాల్లో ఆవేశపడ్డారు. వైసీపీ మద్దతుదారుని తరహాలో ప్యానెల్‌లో కూర్చున్నవారితో వాదులాటకు దిగారు. అయితే.. న్యాయస్థానాలపై అనుచిత వ్యాఖ్యలు చేసే విషయంలో మాత్రం ఆయన సాక్షిలో నిర్వహిస్తున్న చర్చా కార్యక్రమంలో కాకుండా.. సుమన్ టీవీ చానల్ కు ఇంటర్యూ ఇచ్చి మరీ…అలాంటి ప్రకటనలు చేశారు. ఆ వీడియో క్లిప్‌లతో హైకోర్టు రిజిస్ట్రార్‌కు ఫిర్యాదులు వెళ్లినట్లుగా తెలుస్తోంది.

అలాగే పంచ్ ప్రభాకర్ అనే అమెరికాలో ఉండే వ్యక్తికి నోటీసులు వెళ్లాయి. ఈయన అమెరికాలో ఉన్నప్పటికీ.. వైసీపీ లాంగ్వేజ్ కి బ్రాండ్ అంబాసిడర్‌గా వ్యవహరిస్తూ ఉంటారు. అసభ్యమైన మాటలు.. బూతులతో తన పరిజ్ఞానాన్ని ప్రదర్శిస్తూ ఉంటారు. ఇప్పటి వరకూ వర్కవుట్ అయిందని అనుకున్నారేమో కానీ అదే ఫ్లోలో కోర్టును కూడా అసభ్యంగా దూషించారు. ఆ క్లిప్ లుకూడా వైరల్ అవడంతో.. హైకోర్టు నోటీసులకు దారి తీసింది. ప్రసాదర్ రెడ్డి అనే మరో జర్నలిస్టు కూడా నోటీసులు అందుకున్నారు. హైకోర్టు రిజిస్ట్రార్ మెయిల్‌కు పెద్ద ఎత్తున న్యాయమూర్తులపై నిందలు వేసినవాళ్లు..తప్పుడు ప్రచారం చేసిన పోస్టుల వివరాలతో ఫిర్యాదులు వెళ్తున్నాయి.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

బస్సు యాత్ర : వైసీపీ రాంగ్ స్ట్రాటజీ

ఎన్నికల షెడ్యూల్ వచ్చినా నోటిఫికేషన్ రావడానికి సమయం ఉండటంతో...జగన్మోహన్ రెడ్డి బస్సు యాత్రను ప్లాన్ చేసుకున్నారు. ఇరవై ఒక్క రోజుల పాటు ఇరవై ఒక్క పార్లమెంట్ నియోజకవర్గాల నుంచి బస్సు యాత్ర...

చ‌ర‌ణ్ సినిమాలో.. సుకుమార్ హ్యాండ్ ఎంత‌?

సుకుమార్ రైటింగ్స్ బ్యాన‌ర్‌పై ద‌ర్శ‌కుడు సుకుమార్ ఓ సినిమా తీశాడంటే అందులో త‌న క్రియేటీవ్ ఇన్వాల్వ్‌మెంట్ కూడా త‌ప్ప‌కుండా ఉంటుంది. 'విరూపాక్ష‌' సినిమా స్క్రీన్ ప్లేలో సుకుమార్ ఇచ్చిన ఇన్ పుట్స్ బాగా...
video

‘మ‌న‌మే’ ఫ‌స్ట్ సింగిల్: సోలో లైఫే సోబెట‌రంటున్న శ‌ర్వా!

https://www.youtube.com/watch?v=XGJtiqVzZiA ఈమ‌ధ్య టాలీవుడ్ లో గ‌ట్టిగా వినిపిస్తున్న పేరు... హేష‌మ్‌ అబ్దుల్ వాహ‌బ్‌. 'ఖుషి', 'హాయ్ నాన్న‌' సినిమాల్లో సూప‌ర్ హిట్ పాట‌లు ఇచ్చారు. ఇప్పుడు శ‌ర్వానంద్ 'మ‌న‌మే' చిత్రానికీ ఆయ‌నే స్వ‌రాలు అందిస్తున్నారు....

ఇంకా “బలమైన” భ్రమల్లోనే కేటీఆర్ !

కేటీఆర్ నియోజకవర్గాల వారీ సమీక్ష సమావేశాల్లో రేవంత్ రెడ్డిని తిట్టి... ఎన్నికల్లో దున్నిపారేస్తామని ప్రసంగించి వెళ్లిపోతున్నారు. గ్రౌండ్ లెవల్లో పరిస్థితిని అర్థం చేసుకునేందుకు ప్రయత్నించడం లేదు. కనీసం ...

HOT NEWS

css.php
[X] Close
[X] Close