చట్టం కాకుండా రాజధాని ఆఫీసులు తరలించొద్దు : హైకోర్టు

అధికార వికేంద్రీకరణ బిల్లు చట్టంగా మారకుండా.. కార్యాలయాలను తరలించవద్దని హైకోర్టు స్పష్టం చేసింది. ఈ మేరకు తరలించినట్లుగా నిరూపణ అయితే.. ప్రభుత్వాన్ని, అధికారులను బాధ్యుల్ని చేస్తామని హెచ్చరించింది. రాజధాని తరలింపు, సీఆర్డీఏ బిల్లు రద్దు అంశాలపై.. హైకోర్టులోదాఖలైన అనేక పిటిషన్లపై విచారణలో న్యాయమూర్తి కీలక వ్యాఖ్యలు చేశారు. పెద్ద సంఖ్యలో రాజధాని తరలింపు, సీఆర్డీఏ రద్దు అంశాలపై పిటిషన్లు దాఖలు కావడంతో.. చీఫ్ జస్టిస్ నేతృత్వంలో త్రిసభ్య బెంచ్‌ను ఏర్పాటు చేశారు. ఈ బెంచ్.. పిటిషన్లపై విచారణ జరిపింది. విచారణ ప్రారంభమైన వెంటనే.. బిల్లుల గురించి న్యాయమూర్తి ఆరా తీశారు. ఏ స్థాయిలో ఉన్నాయని ప్రశ్నించారు. శాసనసభలో బిల్లు ఆమోదం పొందిందని.. శాసన మండలి సెలక్ట్ కమిటీకి పంపిందని.. అడ్వకేట్ జనరల్.. ధర్మాసనం దృష్టికి తీసుకెళ్లారు. దీంతో.. బిల్లు చట్టంగా మారడానికి సమయం ఉంది కాబట్టి… విచారణను ఫిబ్రవరి ఇరవై ఆరో తేదీకి వాయిదా వేస్తూ నిర్ణయం తీసుకున్నారు.

అయితే.. ఈ సమయంలో రైతుల తరపు న్యాయవాది అశోక్ భాన్.. బిల్లు చట్టంగా మారకపోయినప్పటికీ.. ప్రభుత్వ ఆఫీసుల్ని తరలించాలని.. మౌఖిక ఆదేశాలు ఇస్తున్నరారని… అందుకే కార్యాలయాలు తరలించుకుండా ఆదేశాలివ్వాలని కోరారు. దీనిపై స్పందిచిన న్యాయమూర్తి.. బిల్లుచట్టంగా మారకుండా.. కార్యాలయాలను తరలించకూడదన్నారు. అలా చేసినట్లు నిరూపణ అయితే. . ప్రభుత్వం, సంబంధిత అధికారుల్ని బాధ్యుల్ని చేస్తామని హెచ్చరించారు. ఆ ఖర్చును బాధ్యుల వ్యక్తిగత ఖాతా నుంచి జమ చేయాల్సి ఉంటుందన్నారు. రైతులు తమ అభిప్రాయాలు తెలిపే సమయం ముగియకుండానే.. రైతుల అభిప్రాయాలు పరిశీలించకుండానే.. ప్రభుత్వం బిల్లు పెట్టిన విషయాన్ని రైతుల తరపున న్యాయవాది ధర్మాసనం దృష్టికి తీసుకెళ్లారు.

హైకోర్టు స్వయంగా సమయం ఇచ్చినా.. ఆ సమయం గడవక ముందే.. ఎందుకు బిల్లు పెట్టాల్సి వచ్చిందని.. అడ్వకేట్ జనరల్‌ను ధర్మానసం ప్రశ్నించింది. ఓ దశలో.. ప్రభుత్వం చేపట్టిన బిల్లులు మనీ బిల్లులని.. అశోక్ భాన్ వాదించారు. దాంతో ఉలిక్కిపడిన ఏజీ.. అవి మామూలు బిల్లులేనని..ద్రవ్య బిల్లులు కాదని.. న్యాయమూర్తి దృష్టికి తీసుకెళ్లారు. మొత్తనికి బిల్లు చట్టంగా మారకపోయినా.. తరలింపు ప్రక్రియ ప్రారంభించాలనుకున్న ప్రభుత్వానికి ఓ రకంగా ఇబ్బందికర పరిణామమే. నెల రోజుల వరకూ.. తరలింపునకు అవకాశం లేకుండా పోయింది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

వివేకా హత్య కేసులోకి జగన్‌నూ లాక్కొస్తున్న దస్తగిరి !

మావాళ్లు చెప్పినట్లు చేయి.. ఏం జరిగినా అండగా ఉంటానని దస్తగిరికి సీఎం జగన్ స్వయంగా హామీ ఇచ్చారట. ఈ విషయాన్ని స్వయంగా దస్తగిరినే చెబుతున్నారు. వివేకాను చంపే ముందు జగన్ ఆయనతో ఫోన్...

ఖమ్మం సీటు రిస్క్ లో పడేసుకున్న కాంగ్రెస్

కాంగ్రెస్ పార్టీ అత్యంత సులువుగా గెలిచే సీటు ఖమ్మం అనుకున్నారు. మిత్రపక్షంతో కలిసి ఆ లోక్ సభ పరిధిలో ఉన్న అన్ని చోట్లా గెలిచారు. అదీ కూడా భారీ మెజార్టీలతో. ...

ఇప్పటికీ ఎన్డీఏ వెంట పడుతున్న జగన్ !

రాజకీయం అంటే విదిలించుకున్నా వదిలి పెట్టను అని కాళ్లు పట్టేసుకోవడం కాదు. కానీ వైసీపీ అధినేతకు మాత్రం అదే రాజకీయం. ఎందుకంటే వదిలిస్తే కేసులకు కొట్టుకుపోతారు. అందుకే బీజేపీ వాళ్లు విదిలించుకున్నా ...

ఆన్న ఆస్తి ఇవ్వకపోతే షర్మిల కోర్టుకెళ్లవచ్చుగా !?

సోదరుడు జగన్మోహన్ రెడ్డి ఆస్తి పంచివ్వలేదని.. ఒక్కకొసరు ఆస్తి రాసిచ్చి దాన్ని కూడా అప్పు కింద జమ చేసుకున్నారని షర్మిల వేదనకు గురయ్యారు. తన పిల్లలకు తాను ఏమీ ఇవ్వలేకపోతున్నానని ఆమె ఆవేదన...

HOT NEWS

css.php
[X] Close
[X] Close