రోజా సస్పెన్షన్ కేసుపై నేడు హైకోర్టు తీర్పు

వైకాపా ఎమ్మెల్యే రోజాపై శాసనసభ విధించిన సస్పెన్షన్ ఎత్తివేస్తూ హైకోర్టు సింగిల్ జడ్జి ఇచ్చిన ఆదేశాలను ఆంధ్రప్రదేశ్ శాసనసభ వ్యవహారాల శాఖ ప్రధాన కార్యదర్శి హైకోర్టు బెంచ్ లో సవాలు చేసిన సంగతి అందరికీ తెలిసిందే. దానిపై నిన్న కోర్టులో ఇరు పక్షాల వాదనలు విన్న తరువాత హైకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ దిలీప్ బి. బోస్లే, జస్టిస్ పి. నవీన్ రావుతో కూడిన ధర్మాసనం ఆ కేసుని మంగళవారానికి వాయిదా వేసింది. ఈరోజు దానిపై తమ తీర్పు వెలువరిస్తామని తెలిపారు.

రోజాని సస్పెండ్ చేయమని సిఫార్సు చేస్తూ శాసనసభ హక్కుల కమిటీ ఇచ్చిన నివేదికపై నిన్న శాసనసభలో చర్చ జరిగింది కానీ ఇంకా దానిపై తుది నిర్ణయం తీసుకోలేదు. రోజాపై ఏడాదిపాటు వేటు వేయడం ఖాయమని మాత్రం స్పష్టమయింది. బహుశః ఇవ్వాళ్ళే శాసనసభ కూడా రోజా సస్పెన్షన్ పై తన నిర్ణయం ప్రకటించే అవకాశం ఉంది.

న్యాయస్థానం తీర్పును తెదేపా ప్రభుత్వం గౌరవించనందుకు నిరసనగా నిన్న శాసనసభను బహిష్కరించిన వైకాపా శాసనసభ్యులు ఈరోజు నల్ల బ్యాడ్జీలు ధరించి సభకు హాజరు కాబోతున్నారు. ఈరోజు కూడా రోజాను మార్షల్స్ అడ్డుకొన్నప్పుడు అందుకు నిరసనగా మళ్ళీ అందరూ కలిసి గాంధీ విగ్రహం వద్ద కూర్చొని ధర్నా చేస్తారా లేకపోతే తెదేపాతో యుద్ధం చేయడానికని ఆమెను బయట విడిచిపెట్టి అందరూ శాసనసభలోకి వెళతారా చూడాలి. కానీ వాళ్ళు ఏమి చేసినా రోజా క్షమాపణ చెప్పుకోనప్పుడు ఆమె సస్పెన్షన్ న్ని అడ్డుకోలేరని చెప్పవచ్చును.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

మీడియా వాచ్ : యూటర్న్‌లో కల్ట్ చూపిస్తున్న ఎన్టీవీ

ఎన్టీవీలోని అపరిచితుడు బయటకు వచ్చేశాడు. బీఆర్ఎస్ అధికారంలో ఉన్నంత కాలం కాంగ్రెస్ పై.. రేవంత్ రెడ్డిపై.. బీఆర్ఎస్ కు ఇష్టం లేని నేతలపై.. వాళ్ల టార్గెట్ ను రీచ్ ...

బీఆర్ఎస్‌లో ఉండను : మల్లారెడ్డి

బీఆర్ఎస్‌లో ఉండేది లేదని మల్లారెడ్డి ప్రకటించారు. తాను పూర్తి స్థాయి రాజకీయ నాయకుడ్ని కాదని.. పార్ట్ టైమ్ రాజకీయ నేతను.. పూర్తి స్థాయి వ్యాపారవేత్తనని చెప్పుకొచ్చారు. తన వ్యాపారాలకు రక్షణ కోసమైనా...

లేటుగా వ‌చ్చినా ప్ర‌తాపం చూపిస్తున్న‌ ‘హ‌నుమాన్’

ఈ యేడాది సంక్రాంతికి విడుద‌లైన `హ‌నుమాన్` బాక్సాఫీసు ద‌గ్గ‌ర కొత్త రికార్డులు సృష్టించింది. చిన్న సినిమాగా వ‌చ్చి ఏకంగా రూ.300 కోట్ల మైలు రాయిని అందుకొంది. ఇప్పుడు ఓటీటీలో ప్ర‌త్య‌క్ష‌మైంది. ఇక్క‌డా.. 'హ‌నుమాన్‌'...

స‌మంత భ‌య‌పెట్టేస్తోంది

క‌థానాయిక‌ల పారితోషికంపై ఎప్పుడూ ఎడ‌తెగ‌ని చ‌ర్చ జ‌రుగుతూనే ఉంటుంది. స్టార్ హోదా వ‌చ్చిన క‌థానాయిక‌లు ఎప్ప‌టి క‌ప్పుడు త‌మ రేట్ల‌ని పెంచుకొంటూ పోతుంటారు. డిమాండ్ - అండ్ స‌ప్లై సూత్రం ప్ర‌కారం నిర్మాత‌లూ...

HOT NEWS

css.php
[X] Close
[X] Close