ఈ జూన్ లో థియేటర్లు కళకళలాడబోతున్నాయి. పెద్ద సినిమాలు వరుస కట్టబోతున్నాయి. అందులో ‘హరి హర వీరమల్లు’ ఒకటి. చాలా కాలం తరవాత పవన్ కల్యాణ్ సినిమా తెరపైకొస్తోంది. పైగా డిప్యూటీ సీఎం అయిన తరవాత ఆయన్నుంచి వస్తున్న సినిమా ఇది. కాబట్టి ఫ్యాన్స్ కు పండగ. ఈ సినిమా ఐదేళ్ల పాటు షూటింగ్ జరుపుకొంది. ఈ జోనర్ పవన్కు కొత్త. అలా ఎన్ని రకాలుగా చూసినా ‘వీరమల్లు’ స్పెషల్ సినిమానే.
కాకపోతే నిర్మాత ఎ.ఎం.రత్నం ఈ సినిమాకు హై రేట్లు చెప్పి బయ్యర్లని భయపెడుతున్నట్టు ఇండస్ట్రీ వర్గాల టాక్. నైజాంలో ఈ సినిమాకు రూ.60 కోట్లు కోడ్ చేశారు రత్నం. నైజాం ఒక్కటే కాదు అన్ని ఏరియాల్లోనూ ఇదే పరిస్థితి. తూ.గో జిల్లా రైట్స్ అడిగితే రూ.13 కోట్లు కోడ్ చేశారు. వైజాగ్ కూడా ఊహించిన దానికంటే భారీగానే ఉంది. పవన్ కల్యాణ్ సినిమాకు ఉండే క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. పైగా ఇప్పుడు ఆయన ఇమేజ్ వేరే లెవల్. కాకపోతే.. మరీ ఈ స్థాయి రేట్లేంటని బయ్యర్లు భయపడుతున్నారు. నిర్మాత లెక్కలు మాత్రం వేరేగా ఉన్నాయి. ఈ సినిమాపై ఆయన చాలా ఖర్చు పెట్టారు. నిర్మాణం కూడా ఆలస్యమైంది. వడ్డీలు పెరిగిపోయాయి. అవన్నీ తిరిగి రాబట్టాలంటే ఈ రేట్లకు అమ్ముకోవాల్సిందే. పవన్ ఇమేజ్పై నమ్మకం ఉన్న బయ్యర్లు కాస్త ఆసక్తి చూపిస్తున్నా, ఎక్కడో ఏదో ఓ మూల వాళ్లను భయాలు పట్టి పీడిస్తున్నాయి. హిట్ టాక్ వస్తే మాత్రం రూపాయికి రూపాయి మిగులుతుంది. అందులో డౌటు లేదు. కానీ తేడా వస్తే మాత్రం లెక్కలు, పరిణామాలూ దారుణంగా ఉంటాయి. అందుకే బయ్యర్లు తర్జన భర్జనలు పడుతున్నారు.
వీరమల్లు ట్రైలర్ ఇంకా బయటకు రాలేదు. ఫైనల్ కట్ రెడీ అవుతోంది. 5, 6 తేదీల్లో ట్రైలర్ రావొచ్చు. అదొస్తే సినిమాపై నమ్మకం పెరుగుతుంది. ఆ తరవాత డీల్స్ అన్నీ వరుసగా క్లోజ్ అయ్యే అవకాశం ఉంది. తిరుపతిలో ప్రీ రిలీజ్ ఈవెంట్ ప్లాన్ చేస్తున్నారు. వీరమల్లు క్రేజ్ ఎలాంటిదో ఆ వేడుక డిసైడ్ చేసేస్తుంది.