ఈవీఎం ధ్వంసం… వీడియో ఎలా బయటకొచ్చిందంటే..?

మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఈవీఎంను ధ్వంసం చేసిన వీడియోపై తీవ్ర దుమారం రేగుతోంది. పోలింగ్ ముగిసిన వారం రోజుల తర్వాత ఈ వీడియో బయటకు రావడంపై వైసీపీ అనుమానం వ్యక్తం చేస్తోంది. ఎవరో కావాలనే పిన్నెల్లిపై కడుపుమంటతో ఫేక్ వీడియోను క్రియేట్ చేశారనే తరహలో సందేహాలు వ్యక్తం చేస్తోంది. తాజాగా ట్విట్టర్ లో సజ్జల కూడా అసలు ఈ వీడియో ఎలా బయటకు వచ్చిందని ప్రశ్నించారు.

పిన్నెల్లి ఈవీఎంను ధ్వంసం చేసిన వీడియోను సిట్ అధికారులు గుర్తించినట్లుగా తెలుస్తోంది. పోలింగ్ రోజు నుంచి రాష్ట్రంలో పలుచోట్ల ఉద్రిక్త పరిస్థితులు నెలకొనడటంతో ఈ అల్లర్లకు కారణం ఏంటో తేల్చాలని ఈసీ సిట్ ను ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే పోలింగ్ అనంతరం చోటు చేసుకున్న పరిస్థితులపై సిట్ విచారణ చేపట్టింది. ఇందులో భాగంగా పోలింగ్ బూత్ లో ఏర్పాటు చేసిన వీడియోలను సిట్ అధికారులు పరిశీలిస్తోన్న సమయంలో పాల్వాయి గేట్ పోలింగ్ కేంద్రంలో పిన్నెల్లి ఈవీఎం ధ్వంసం చేసిన పుటేజ్ ను గుర్తించినట్లుగా టాక్ వినిపిస్తోంది.

అయితే, పిన్నెల్లి అధికార పార్టీ ఎమ్మెల్యే కావడంతోనే ఆ ప్రాంగణంలో ఉన్న పోలీసులు, ఏజెంట్లు ఎవరికీ ఫిర్యాదులు చేయలేదనే వాదనలు వినిపిస్తున్నాయి. సిట్ దర్యాప్తుతోనే ఈ అంశం వెలుగులోకి వచ్చిందని లేదంటే ఈ అంశం తెరమరుగు అయి ఉండేదని రాజకీయ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

“రీ డిజైన్” క్రెడిట్ కేసీఆర్‌దే !

ప్రాజెక్టులను రీడిజైన్ చేసింది కేసీఆర్. ఈ మాట ఆయన చెప్పుకున్నారు. బీఆర్ఎస్ నేతలు చెప్పుకున్నారు. అయితే ఇప్పుడు మాత్రం ఆయనకు సంబంధం లేదంటున్నారు. ఎందుకంటే... విచారణ నుంచి తప్పించుకోవడానికి. కేసీఆర్ ది కాకపోతే...

అమరావతిలో జగన్ గుర్తులు అలాగే !

అమరావతిలో జగన్ జ్ఞాపకాల్ని అలాగే ఉంచాలని ఏపీ ప్రభుత్వం భావిస్తోంది. జగన్ జ్ఞాపకాలు అంటే ఆయన నిర్మించినవి ఏవీ లేవు. ధ్వంసం చేసివవే. ముఖ్యంగా ప్రజావేదిక. కూర్చున్న కొమ్మనే నరుక్కున్న తెలివి...

ఎంవీవీ ఫ్యామిలీ కిడ్నాప్‌లో అసలు కథ త్వరలో !

విశాఖ ఎంపీగా ఉన్నప్పుడు ఎంవీవీ సత్యనారాయణ ఇంట్లోనే ఆయన భార్య, కుమారుడ్ని నిర్బంధించి ఆస్తులు రాయించుకున్న ముఠా వ్యవహారంలో అసలు నిజాలు ఎప్పుడూ బయటకు రాలేదు. నిందితులపై ఎలాంటి కేసులు పెట్టారో కూడా...

మోదీకి చెక్ పెట్టేలా ఆరెస్సెస్ వ్యూహం !

ఆరెస్సెస్‌కు మోదీకి మధ్య దూరం అంతకంతకూ పెరుగుతోంది. రాముడే మోదీకి బుద్ధి చెప్పాడనే ఆర్ఎస్ఎస్ నేత ఇంద్రేజ్ కుమార్ వ్యాఖ్యలు వైరల్అవుతున్నాయి . ఆయన ఒక్కడే ఈ లతరహాలో వ్యవహరిస్తే...

HOT NEWS

css.php
[X] Close
[X] Close