అతిగా ఆలోచించి ఆరోగ్యం చెడగొట్టుకున్న కొడాలి నాని

కొడాలి నాని అనారోగ్యానికి గురయ్యారు. పార్టీ నేతలతో మాట్లాడుతూ ఒక్క సారిగా సోఫాలో కుప్పకూలిపోయారు. ఏమయిందోనని పార్టీ నేతలు కంగారు పడ్డారు. వెంటనే వచ్ిచ టెస్టు చేసిన వైద్యులు అతిగా ఆలోచించడంతో ఆరోగ్య సమస్యలు తలెత్తాయని, తగు జాగ్రత్తలు తీసుకోవాలని సలహా ఇచ్చారు.

పోలింగ్ ముగిసిన తర్వాత హైదరాబాద్ వెళ్లిపోయిన కొడాలి నాని గురువారమే గుడివాడ వచ్చారు. తన నివాసంలో పార్టీ నేతలతో సమావేసం అవుతున్నారు. ముందుగా నందివాడ మండల వైసీపీ నాయకులతో పోలింగ్ సరళిపై చర్చిస్తున్నారు. ఈ క్రమంలో ఆయన సోఫాలో కుప్పకూలిపోయారు. వెంటనే అప్రమత్తమై పార్టీ నేతలు సపర్యలు చేసి డాక్టర్లను పిలిపించారు. ప్రధమ చికిత్స చేసిన అనంతరం, కొడాలి నాని బలహీనంగా ఉండటంతో సెలైన్ పెట్టారు.

కొడాలి నాని కుటుంబసభ్యులంతా హైదరాబాద్ లో నే ఉన్నారు. అనుచరులతో కలిసి కొడాలి నాని ఒక్కరే వచ్చారు. విషయం తెలియడంతో హైదరాబాద్ నుండి కొడాలి నాని కుటుంబ సభ్యులు గుడివాడకు చేరుకున్నారు. ఆయనను హైదరాబాద్ తీసుకెళ్లి ఆస్పత్రిలో చేర్పించే అవకాశం ఉంది. ఎన్నికల ఫలితాలపై కొడాలి నాని విపరీతంగా ఆలోచిస్తున్నారని అందుకే ఆయనకు అనారోగ్యం తలెత్తిందని చెబుతున్నారు. అంతకు ముందు కూడా కొన్ని అనారోగ్య సమస్యలు ఉండటంతో కుటుంబసభ్యులు జాగ్రత్తలు తీసుకుంటున్నారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

పబ్లిక్‌కి రుషికొండ ప్యాలెస్ గేట్లు ఓపెన్

రుషికొండ వైపు అడుగు పెడితే అరెస్టు చేసేవారు ఎన్నికలకు ముందు.. ఇప్పుడు .. రుషికొండ ప్యాలెస్ గేట్లు ప్రజలు చూసేందుకు ఓపెన్ చేశారు. గంటా శ్రీనివాసరావు స్థానిక నేతలు, మీడియా ప్రతినిధులతో వెళ్లి...

ఈవీఎంలు అయితే ఇక వైసీపీ ఎన్నికల బహిష్కరణే !

ఈవీఎంలను శకుని పాచికలు అని.. ఎటు కావాలంటే అటు పడుతున్నాయని జగన్ రెడ్డి కొత్త మాట చెబుతున్నారు. ఆయన పార్టీ నేతలు కూడా అదే చెబుతున్నారు. ఇదే జగన్ 2019 ఎన్నికల...

“రీ డిజైన్” క్రెడిట్ కేసీఆర్‌దే !

ప్రాజెక్టులను రీడిజైన్ చేసింది కేసీఆర్. ఈ మాట ఆయన చెప్పుకున్నారు. బీఆర్ఎస్ నేతలు చెప్పుకున్నారు. అయితే ఇప్పుడు మాత్రం ఆయనకు సంబంధం లేదంటున్నారు. ఎందుకంటే... విచారణ నుంచి తప్పించుకోవడానికి. కేసీఆర్ ది కాకపోతే...

అమరావతిలో జగన్ గుర్తులు అలాగే !

అమరావతిలో జగన్ జ్ఞాపకాల్ని అలాగే ఉంచాలని ఏపీ ప్రభుత్వం భావిస్తోంది. జగన్ జ్ఞాపకాలు అంటే ఆయన నిర్మించినవి ఏవీ లేవు. ధ్వంసం చేసివవే. ముఖ్యంగా ప్రజావేదిక. కూర్చున్న కొమ్మనే నరుక్కున్న తెలివి...

HOT NEWS

css.php
[X] Close
[X] Close