కియాను పంపిస్తాన‌న్న జ‌గ‌న్… టెస్లా తెస్తానంటే జ‌నం న‌మ్ముతారా?

ఏపీలో కొత్త పెట్టుబడుల సంగతి దేవుడెరుగు…ఉన్న పరిశ్రమలను కూడా రాష్ట్రం నుంచి వెళ్లగొట్టేలా జగన్ సర్కార్ పాలన కొనసాగుతుందన్న ఆరోపణలు వస్తున్నాయి. తెలుగు వారి అమర్ రాజా బ్యాటరీస్ వంటి పరిశ్రమలు కూడా ఏపీ నుంచి తరలిపోయి…తెలంగాణలో పెట్టుబడులు పెట్టారు. కియా వంటి కంపెనీని చంద్రబాబు ఏపీలో ఏర్పాటు చేసినా.. జగన్ విధానాల ఫలితంగా కొన్నాళ్ళకు తాము రాష్ట్రం నుంచి వెళ్లిపోతామని బహిరంగ ప్రకటన చేశారు.

జగన్ అధికారంలోకి వచ్చాక కొత్తగా వచ్చిన పెట్టుబడులు అంతంత మాత్రమే.ఎన్నికల వేళ రాష్ట్రంలో అమెరికాకు చెందిన ఎలక్ట్రిక్ వాహనాల తయారీ సంస్థ టెస్లా ఏపీలో యూనిట్ ఏర్పాటు చేయాలనుకుంటున్నట్లు వార్తలు వస్తున్నాయి. రాష్ట్రంలో అనువైన స్థలాన్ని ఎంపిక చేసేందుకు స్థల పరిశీలన కోసం ఓ టీంను పంపాలని ఏపీ సర్కార్ కోరినట్లుగా కథనాలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే వీటిని నమ్మతరమా..? అని సోషల్ మీడియాలో ఓ చర్చ వైరల్ అవుతోంది.

అనంతపురం జిల్లాలో కియా సంస్థను చంద్రబాబు ఏర్పాటు చేయగా…2019ఎన్నికల ప్రచారంలో భాగంగా జగన్ వ్యతిరేకించారు.స్థానికులకు నష్టం చేసే కియా పరిశ్రమను ఎట్టి పరిస్థితుల్లో అంగీకరించబోమని..అధికారంలోకి వచ్చాక దానిని రివర్స్ పంపుతామని హెచ్చరించారు. అందుకు సంబంధించిన వీడియోను టీడీపీ శ్రేణులు వైరల్ చేస్తున్నాయి.

తెలుగు వారి కంపెనీలను ఏపీ వదిలి వెళ్ళేలా చేసిన జగన్… నేడు అంతర్జాతీయ కంపెనీని ఏపీకి ఆహ్వానిస్తున్నారంటే ఎలా నమ్ముతామంటూ సోషల్ మీడియాలో నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. అమర్ రాజా బ్యాటరీస్ వంటి తెలుగు వారి కంపెనీలకు భద్రత కల్పించకుండా చేశారు. ఈ క్రమంలోనే రేపు టెస్లానైనా కొనసాగనిస్తారా..? అంటూ ప్రశ్నిస్తున్నారు. అదే సమయంలో ఇదంతా ఎన్నికల జిమ్మిక్ అంటూ కొట్టిపారేస్తున్నారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ఏపీలో వాలంటీర్ వ్యవస్థను కొనసాగిస్తారా?

ఏపీలో వాలంటీర్ వ్యవస్థను కొనసాగిస్తామని సర్కార్ ప్రకటించినా... వాలంటీర్లలో అనుమానాలు ఇంకా అలాగే ఉన్నాయి. జులై మొదటి తేదీన సచివాలయం సిబ్బందితో ఫించన్ లు పంపిణీ చేసిన కూటమి ప్రభుత్వం.. వాలంటీర్ల అవసరం...

జ‌గ‌న్ కు ష‌ర్మిల సూటి ప్ర‌శ్న‌లు… జ‌వాబు చెప్పే ద‌మ్ముందా?

ఏపీ మాజీ సీఎం జ‌గ‌న్మోహ‌న్ రెడ్డిపై ఆయ‌న చెల్లి, ఏపీ పీసీసీ చీఫ్ వైఎస్ ష‌ర్మిల మ‌రోసారి కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. ఢిల్లీలో వైసీపీ చేసిన ధ‌ర్నా, అక్క‌డ జ‌గ‌న్ చేసిన...

ట్రంప్‌కు అంత ఈజీ కాదు !

అమెరికా అధ్యక్ష రేసులో ముందున్నానని ఆశల్లో తేలిపోతున్న డొనాల్డ్ ట్రంప్‌కు గడ్డు పరిస్థితి ఎదురొస్తున్న సూచనలు కనిపిస్తున్నాయి. డెమెక్రాట్ల అభ్యర్థిగా ఉపాధ్యక్షురాలు కమలా హ్యారిస్ ఖరారు కావడంతో...

హైదరాబాద్ టు బెంగళూరు ఆరు లైన్ల హైవే !

హైదరాబాద్ - విజయవాడ మార్గం తర్వాత అత్యంత బిజీగా ఉండే మార్గం హైదరాబాద్ - బెంగళూరు. ఈ మార్గాన్ని ఆరు లైన్లుగా మార్చాలని కేంద్రం నిర్ణయం తీసుకుంది. హైదరాబాద్‌ -...

HOT NEWS

css.php
[X] Close
[X] Close