జగన్ రెడ్డి బర్త్ డే – సాక్షికి రూ. 100 కోట్లు సమర్పయామి

ప్రజలు అధికారం ఇచ్చి వాళ్లను అడ్డగోలుగా దోచుకోవడానికి.. వారు కట్టిన పన్నుల్ని సొంత ఖజానాకు తరలించుకోవడానికి అని ఏపీ సీఎం జగన్ రెడ్డికి గట్టి నమ్మకం అనుకోవాల్సిందే. ఈ రోజు ఆయన పుట్టిన రోజు. ప్రభుత్వం సాక్షి పత్రికకు పండగ చేసింది. అన్ని డిపార్టుమెంట్లు, కార్పొరేషన్లు ప్రకటనతో హోరెత్తించారు. కనీసం రూ. వంద కోట్లు జగన్ పుట్టిన రోజు పేరుతో సాక్షి ఖాతాకు తరలించి ఉంటారని మీడియా వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఎవరైనా ఓ సీఎం తన కుటుంబానికి చెందిన వ్యక్తికో.. సంస్థకో ఓ రూపాయి పని ఇవ్వాలంటే.. సిగ్గుపడతారు. అది నైతికత కాదని అనుకుంటారు.

ప్రజాధనం ముట్టుకోకూడదనుకుంటారు. కానీ జగన్ రెడ్డికి అలాంటి నైతికత ఏమీ ఉండదు. సొంత పత్రికకు వందల కోట్లు ధారదత్తం చేస్తూంటారు. ఐదేళ్లలో ఎన్ని వందల కోట్లు అలా సాక్షి పత్రికకు చేరి ఉంటాయో అంచనా వేయడం కష్టం. సీఎంగా చివరి పుట్టిన రోజున విశ్వరూపం చూపించారు. ఇక ఆయన వల్ల లబ్దిపొందిన కంపెనీలు.. యథా ప్రకారం క్విడ్ ప్రో కో ను ప్రకటనల రూపంలో సమర్పించుకున్నాయి. ఓ వైపు అంగన్ వాడి మహిళలు ఎన్నికల్లో హామీ ఇచ్చిన విధంగా జీతం పెంచాలని అడుగుతూంటే.. వాళ్లపై ప్రతాపం చూపిస్తున్నారు.

అన్ని వర్గాల ప్రజలు రోడ్డెక్కే పరిస్థితి ఉంటే..తాను మాత్రం గొప్పగా వేడుకలు చేసుకుంటన్నారు. అచ్చమైన రాచరిక పోకడలకు పోతున్నారు. ప్రజాధనాన్ని ఇంత ఘోరంగా సొంత ఖాతాలకు మళ్లించుకునే రాజకీయ నాయకుడు.. ఇంతకు ముందు ఉండరు.. భవిష్యత్‌లో రారన్న విమర్శలు సహజంగానే వస్తున్నాయి.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

హైద‌రాబాద్ లో భూమి కొన్న మైక్రోసాఫ్ట్…

ప్ర‌ముఖ సాఫ్ట్ వేర్ కంపెనీ మైక్రోసాఫ్ట్ త‌న కార్య‌క‌లాపాల‌ను మ‌రింత విస్తృతం చేయ‌నుంది. ఇప్ప‌టికే హైద‌రాబాద్ స‌హా దేశంలోని ప్ర‌ముఖ న‌గ‌రాల నుండి మైక్రోసాఫ్ట్ ఆఫీసులు ప‌నిచేస్తుండ‌గా, అతిపెద్ద డేటా సెంట‌ర్ ను...

‘స్వ‌యంభూ’ యాక్ష‌న్‌: 12 రోజులు… రూ.8 కోట్లు

'కార్తికేయ 2'తో నిఖిల్ ఇమేజ్ మొత్తం మారిపోయింది. ఆ సినిమాతో పాన్ ఇండియా స్టార్ అయిపోయాడు. ఇది వ‌ర‌కు రూ.8 కోట్లుంటే నిఖిల్ తో సినిమా చేసేయొచ్చు. ఇప్పుడు ఓ యాక్ష‌న్ సీన్...

నాని సైతం.. ప‌వ‌న్ కోసం

ప‌వ‌న్ క‌ల్యాణ్ జ‌న‌సేన పార్టీ స్థాపించి ప‌దేళ్ల‌య్యింది. మెగా ఫ్యామిలీ, కొంత‌మంది క‌మెడియ‌న్లు, ఒక‌రిద్ద‌రు ప‌వ‌న్ డై హార్డ్ ఫ్యాన్స్ త‌ప్ప‌, ప‌వ‌న్‌కు నేరుగా పొలిటిక‌ల్ గా స‌పోర్ట్ ఎవ‌రూ చేయ‌లేదు. దానికి...

కేసీఆర్‌కు ధరణి – జగన్‌కు టైటిలింగ్ యాక్ట్ !

తెలంగాణలో కేసీఆర్ ఎందుకు ఓడిపోయారు.. అంటే ప్రధాన కారణాల్లో ధరణి అని ఒకటి వినిపిస్తుంది. ఈ చట్టం వల్ల కేసీఆర్ , బీఆర్ఎస్ నేతలు భూములు దోచుకున్నారన్న ఓ ప్రచారం...

HOT NEWS

css.php
[X] Close
[X] Close