బోయ‌పాటి పారితోషికంలో భారీ కోత‌?

ఒక ద‌శ‌లో రూ.15 కోట్ల పారితోషికంతో… హ‌డ‌లెత్తించాడు బోయ‌పాటి శ్రీ‌ను. త్రివిక్ర‌మ్‌, కొర‌టాల శివ‌ల‌తో స‌మానంగా పారితోషికం డిమాండ్ చేశారు. విన‌య‌ విధేయ‌ రామాకి బోయ‌పాటి అందుకున్న పారితోషికం రూ.15 కోట్ల‌కు అటూ ఇటూగా ఉంది. అయితే స‌డ‌న్‌గా బోయ‌పాటి పారితోషికం స‌గానికి ప‌డిపోయింది. అది కూడా వియ‌న విధేయ‌ రామా ఎఫెక్ట్‌తోనే.

నంద‌మూరి బాల‌కృష్ణ – బోయ‌పాటి శ్రీ‌ను కాంబినేష‌న్‌లో ఓ సినిమా త‌యార‌వుతోంది. ఈ సినిమాకి గానూ బోయ‌పాటి శ్రీ‌ను పారితోషికం రూ.8 కోట్లేన‌ని తేలింది. విన‌య విధేయ రామా ఎఫెక్ట్ తో పారితోషికం త‌గ్గింది. దాంతో పాటు మ‌రో కార‌ణం కూడా ఉంది. బాల‌కృష్ణ సినిమాకి భారీ బ‌డ్జెట్ అవ‌స‌రం అవుతోంద‌ట‌. బాల‌య్య మార్కెట్ రేంజ్ దాటి మరీ ఖ‌ర్చు చేయాల్సివ‌స్తోంద‌ట‌. క్వాలిటీ కోసం త‌న పారితోషికం త‌గ్గించుకోవ‌డానికి బోయ‌పాటి సిద్ధ‌మ‌య్యాడ‌ని ఇన్‌సైడ్ వ‌ర్గాల టాక్‌. త‌న సినిమాల్లో స్టార్ కాస్టింగ్ విష‌యంలో బోయ‌పాటి ఏమాత్రం రాజీ ప‌డ‌డు. ఇప్ప‌టికే సంజ‌య్‌ద‌త్ లాంటి వాళ్ల‌ని రంగంలోకి దింపాల‌ని చూస్తున్నాడు. స్టార్లు పెరిగే కొద్దీ – సినిమాకి ఖ‌ర్చు పెరుగుతుంది. అందుకే.. త‌న పారితోషికంలో కొంత మిన‌హాయిస్తున్నాడు. ఈ సినిమా హిట్ట‌యి, మ‌ళ్లీ ఫామ్ లోకి వ‌స్తే…. మళ్లీ రూ.15 కోట్ల మార్క్‌ని చేరుకోవ‌డం తేలిక‌వుతుంది. అందుకే ఇప్పుడు త‌న దృష్టంతా మేకింగ్‌పైనే పెడుతున్నాడు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ఏబీపీ సీఓటర్ సర్వే : బీఆర్ఎస్‌కు ఒక్కటే !

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించి మంచి జోరు మీద ఉన్న కాంగ్రెస్ పార్టీకి లోక్ సభ ఎన్నికల్లో గట్టి పోటీ ఎదురయినప్పటికీ పది వరకూ లోక్ సభ సీట్లను గెల్చుకునే అవకాశం...

ఏబీపీ సీఓటర్ సర్వే : టీడీపీ కూటమికి 20, వైసీపీకి 5 లోక్‌సభ సీట్లు

ఎన్డీఏ కూటమి బలం రోజు రోజుకు పెరుగుతోంది. వైసీపీపై వ్యతిరేకత అంతకంతకూ పెరుగుతోందని సర్వేల వెల్లడిస్తున్నయి. అత్యంత ఖచ్చితంగా సర్వేలు, ఒపీనియన్ పోల్స్ వెల్లడిస్తుందని పేరున్న ఏబీపీ- సీఓటర్ ఎన్నికలకు ముందు నిర్వహించిన...

సునీత సాక్ష్యాలకు పాత ఆరోపణలే అవినాష్ రెడ్డి కౌంటర్ !

వివేకా హత్య కేసులో సునీత జస్టిస్ ఫర్ వివేకా పేరుతో పెడుతున్న ప్రెస్ మీట్లు వెల్లడిస్తున్న సంచనల విషయాలతో అవినాష్ రెడ్డికి మైండ్ బ్లాంక్ అవుతోంది. స్పందించకపోతే నిజం అని...

రాయి కేసు : లీకులిచ్చి జగన్ పరువు తీసిన పోలీసులు !

అనవసర డ్రామాలతో భద్రతా వైఫల్యమని పోలీసుల్ని చేతకాని వాళ్లుగా చేస్తున్నారని కోపం వచ్చిందేమో కానీ విజయవాడ పోలీసులు వైసీపీతో పాటు జగన్ పరువు తీసే లీకులు మీడియాకు ఇచ్చారు. జగన్ పై...

HOT NEWS

css.php
[X] Close
[X] Close