అమరావతి రైతుల్లాగే స్టీల్ ప్లాంట్ కార్మికులు..!

అమరావతి ఉద్యమకారులు ఐదు వందల రోజులుగా ఉద్యమాలు చేస్తున్నారు. ఎప్పటికప్పుడు… వార్షికోత్సవాలు జరుపుకోవడమే కానీ.. ఇంత వరకూ.. వారికి పిసరంతగుడ్ న్యూస్ లభించలేదు. పోరాడుతూనే ఉన్నారు. ఇప్పుడు స్టీల్ ప్లాంట్ కార్మికులు కూడా అదే పరిస్థితి ఎదుర్కొంటున్నారు. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణచేయవద్దంటూ వారు ఉద్యమం ప్రారంభించి వంద రోజులు అయింది. శతదిన ఉద్యమసభలు జరుపుకుంటున్నారు కానీ.. వారికి కూడా ఇంత కూడా… శుభవార్త అందడం లేదు. ఎట్టి పరిస్థితుల్లోనూ స్టీల్ ప్లాంట్ అమ్మి తీరుతామనే … ప్రకటనలే ఎదురు వస్తున్నాయి.

స్టీల్ ప్లాంట్‌ను వంద శాతం ప్రైవేటీకరించాలని అంటే అమ్మేయాలని కేబినెట్‌ భేటీలో నిర్ణయం తీసుకున్న విషయం… వంద రోజుల కిందట బయటపడింది. అంతకు ముందే నిర్ణయాలు తీసుకుని ప్రక్రియ కూడా ప్రారంభించారని ఆ తర్వాత బయటపడింది. కొన్ని సంస్థలు ఆసక్తి చూపించాయని.. వారు వచ్చి ప్లాంట్‌ను పరిశీలించి వెళ్లడం కూడా జరిగిందని .. అన్ని విషయాలు రాష్ట్ర ప్రభుత్వానికి తెలుసని.. పార్లమెంట్‌లో ప్రశ్నలు సంధించిన వైసీపీ ఎంపీలు… వెలుగులోకి తెచ్చారు. ఈ పరిణామాలన్నింటితో ఉద్యమం మరింత తీవ్రమయింది. అంతలోనే కరోనా సెకండ్ వేవ్ రావడంతో పరిస్థితి కాస్త సద్దుమణిగింది.

స్టీల్ ప్లాంట్ కార్మికులు పెద్ద ఎత్తున ఉద్యమిస్తున్నారు. ఢిల్లీ నుంచి రైతు సంఘాల నేతల్ని పిలిపించి సభలు పెడుతున్నారు. వారికి మొదట్లో ప్రజల మద్దతు కూడా లభించింది. ఇప్పుడు… కరోనా కారణంగా ఉద్యమాలు చేయలేని పరిస్థితి. అయితే విశాఖ స్టీల్ ప్లాంట్ నుంచి పెద్ద ఎత్తున ఆక్సిజన్ ఉత్పత్తి కావడంతో మరోసారి .. ప్రాణం అందిస్తున్న స్టీల్ ప్లాంట్‌ను ప్రైవేటీకరణ చేయవద్దన్న నినాదాన్ని వినిపించగలిగారు. కానీ.. అది కూడా.. ఇప్పుడు సైలెంటయ్యే పరిస్థితి. అమరావతి రైతులకు లేని స్టీల్ ప్లాంట్ ఉద్యమకారులకు ఉన్న అడ్వాంటేజ్ ఒక్కటే. అంతర్గతంగా కాకపోయినా.. బహిరంగంగా స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు రాష్ట్ర ప్రభుత్వం వ్యతిరేకంగా ఉంది. అసెంబ్లీలో తీర్మానం కూడా చేసింది.

కానీ అవేమీ పని చేయవని.. రాజకీయంగా లబ్దిపొందడానికి ప్రజల్ని మభ్యపెట్టడానికి చేస్తున్నారన్న విమర్శలు కూడా ఉన్నాయి. ఎలా చూసినా… అమరావతి రైతులు.. స్టీల్ ప్లాంట్ ఉద్యమకారులు… అలా ఉద్యమాలు చేస్తూనే ఉండాలి. భగవద్గీతలో చెప్పినట్లు..కష్టపడు ఫలితం ఆశించకు అన్నదాన్ని.. ఉద్యమాలు చేయి.. ఫలితాలు ఆశించకు.. అన్నట్లుగా వారు పోరాడాల్సిన పరిస్థితి. ఫలితం ఉంటుందో లేదో కూడా అంచనా వేయలేని దుస్థితి.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ఛోటా కె.నాయుడు Vs హ‌రీష్ శంక‌ర్‌… ఏం జ‌రిగింది?

'మ‌ళ్లీ నా జోలికొచ్చారో... చూసుకొందాం' అంటూ సినిమా ఫ‌క్కీలో కెమెరామెన్‌ ఛోటా కె.నాయుడుకు వార్నింగ్ ఇచ్చాడు హ‌రీష్ శంక‌ర్‌. వీరిద్ద‌రూ క‌లిసి 'రామ‌య్యా వ‌స్తావ‌య్యా' సినిమా చేశారు. అప్ప‌టి నుంచీ ఇద్ద‌రి మ‌ధ్యా...

సమయం లేదు…ఆ నియోజకవర్గాలకు అభ్యర్థులను ఎప్పుడు ప్రకటిస్తారు..?

తెలంగాణలో 15 లోక్ సభ సీట్లు గెలుపొందుతామని ధీమా వ్యక్తం చేస్తోన్న అధికార కాంగ్రెస్ ఇంకా పూర్తిస్థాయిలో అభ్యర్థులను ప్రకటించకపోవడం విస్మయానికి గురి చేస్తోంది. నామినేషన్ల పర్వం మొదలై రెండు రోజులు అవుతున్నా...

షర్మిలకు రూ. 82 కోట్ల అప్పు ఇచ్చిన జగన్ !

నామినేషన్ దాఖలు చేసే ముందు వైఎస్ జగన్‌కు షర్మిల పెద్ద చిక్కు తెచ్చి పెట్టింది. తాను జగన్మోహన్ రెడ్డికి రూ. 82 కోట్లకుపైగా బాకీ ఉన్నట్లుగా అఫిడవిట్‌లో తెలిపారు. వదిన భారతి...

మోత్కుపల్లికి అస్వస్థత.. కారణం అదేనా..?

మాజీ మంత్రి , కాంగ్రెస్ అసంతృప్త నేత మోత్కుప‌ల్లి న‌ర్సింహులు(69) తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. శనివారం ఒక్కసారిగా ఆయన బీపీ డౌన్ కావడం , షుగర్ లెవల్స్ పడిపోవడంతో అస్వస్థతకు గురైనట్లుగా...

HOT NEWS

css.php
[X] Close
[X] Close