హైదరాబాద్ ప్రజాప్రతినిధుల కోర్టు జడ్జిని సస్పెండ్ చేసిన సుప్రీంకోర్టు

హైదరాబాద్‌లోని ప్రజాప్రతినిధుల కోర్టు న్యాయమూర్తిని సుప్రీంకోర్టు సస్పెండ్ చేసింది. మంత్రి శ్రీనివాస్ గౌడ్ తో పాటు కేంద్ర, రాష్ట్ర ఎన్నికల సంఘం అధికారులపై కేసులు నమోదు చేయాలని తీర్పు ఇవ్వడంపై ఆగ్రహం వ్యక్తం చేసింది. శ్రీనివాస్ గౌడ్ పై కేసు వరకూ ఓకే కానీ.. ఇందులో ఎన్నికల సంఘంపైనా కేసులు నమోదు చేయించడం … పోలీసులకు డెడ్ లైన్ పెట్టి మరీ కేసులు పెట్టించంతో ఈసీ సుప్రీంకోర్టుకు ఫిర్యాదు చేసింది. దీంతో సుప్రీంకోర్టు హైదరాబాద్ ప్రజాప్రతినిధుల కోర్టు న్యాయమూర్తిని సస్పెండ్ చేసింది. 2018 ఎన్నికల సమయంలో శ్రీనివాస్‌ గౌడ్ అఫిడవిట్ ను ట్యాంపర్ చేశారు.

గడువు ముగిసిన తర్వాత ఈసీ అధికారుల సాయంతో పాతది డిలీట్ చేసి కొత్తది అప్ లోడ్ చేశారని రాఘవేంద్ర రాజు అనే వ్యక్తి హైదరాబాద్‌ నాంపల్లి ప్రజా ప్రతినిధుల కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. విచారణ జరిపిన కోర్టు కేసులు నమోదు చేయాలని ఆదేశించింది. కానీ ఈసీ సహా రాజ్యాంగ సంస్థ అధిపతులపైకేసులు నమోదుచేయాలని ఉండటంతో పోలీసులు తటపటాయించారు. కేసు నమోదు చేయకపోతే కోర్టు ధిక్కరణ కేసు ఎదుర్కోవాల్సి వస్తుందని మహబూబ్ నగర్ పోలీసులకు జడ్జి హెచ్చరించారు.

కోర్టు హెచ్చరికలతో..ధిక్కరణ కేసు ఎదుర్కోవాల్సి వస్తుందని కోర్టు హెచ్చరించడంతో మహబూబ్ నగర్ టూ టౌన్ పోలీసులు స్పందించారు . శ్రీనివాస్ గౌడ్ పై కేసు వరకూ ఓకేకానీ.. రాజ్యాంగబద్ధంగా ఏర్పడిన సంస్థలపై ఇలా కేసుల నమోదుకు ప్రజాప్రతినిధుల కోర్టు న్యాయమూర్తి ఆదేశించడం నిబంధనలకు విరుద్ధమని భావించిన సుప్రీంకోర్టు జడ్జిని సస్పెండ్ చేసింది. ఈ వ్యవహారం న్యాయవర్గాల్లో సంచలనం సృష్టించింది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

మ‌రో జాతిర‌త్నాలు అవుతుందా?

ఈమ‌ధ్యకాలంలో చిన్న సినిమాలు మ్యాజిక్ చేస్తున్నాయి. ఏమాత్రం అంచ‌నాలు లేకుండా వ‌చ్చి, వ‌సూళ్లు కొల్ల‌గొట్టి వెళ్తున్నాయి. `మ్యాడ్‌` టీజ‌ర్‌, ట్రైల‌ర్‌, పాట‌లూ చూస్తుంటే.. ఇందులోనూ ఏదో విష‌యం ఉంద‌న్న భ‌రోసా క‌లుగుతోంది. సంగీత్‌...

చైతన్య : నిజమే మాస్టారూ – వై ఏపీ నీడ్స్ బటన్ రెడ్డి ?

వై ఏపీ నీడ్స్ జగన్ అనే కార్యక్రమాన్ని జగన్ రెడ్డి ప్రారంభించబోతున్నారు. ఆంధ్రాకు ఆయన అవసరం ఏంటి అనే చర్చ ప్రజల్లో పెట్టబోతున్నారు. ఇది నెగెటివ్ టోన్ లో ఉంది. అయినా...

ఈ సారి కూడా మోదీకి కేసీఆర్ స్వాగతం చెప్పలేరు !

తెలంగాణ సీఎం కేసీఆర్ కు ఐదుగురు వైద్యుల బృందంతో చికిత్స అందిస్తున్నట్లుగా మంత్రి కేటీఆర్ తెలిపారు. వారం రోజులుగా జ్వరం, దగ్గుతో కేసీఆర్ బాధపడుతున్నారు. ఒకటి, రెండు రోజులకు తగ్గిపోయే...

టీఆర్ఎస్ కాదు బీఆర్ఎస్ అని మర్చిపోతున్న కేటీఆర్ !

కేటీఆర్ ఇంకా తెలంగాణ రాష్ట్ర సమితిలోనే ఉన్నారు. భారత రాష్ట్ర సమితి వరకూ వెళ్లలేదు. అందరితో పాటు తాను కూడా భారత రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్ అయినప్పటికీ... అలా అనుకోవడం లేదు....

HOT NEWS

css.php
[X] Close
[X] Close