టిక్కెట్ రేట్లపై నాగార్జునకు నో ఇష్యూస్ !

ఏపీలో టిక్కెట్ రేట్ల తగ్గింపు అంశంపై అటు ఎగ్జిబిటర్లు.. ఇటు నిర్మాతలు కిందా మీదా పడుతున్నారు. ఏపీ ప్రభుత్వంతో తలపడేందుకు సిద్ధమవుతున్నారు. మోహన్ బాబు సహా అందరూ టిక్కెట్ల రేట్లు తక్కువగా ఉన్నాయని.. అలా నిర్ణయించడం సరి కాదని అన్నారు. అయితే ఒక్క నాగార్జునకు మాత్రం ఏపీలో టిక్కెట్ రేట్ల అంశంలో ఎలాంటి ఇష్యూస్ లేవని చెబుతున్నారు. పెద్ద సినిమాలు రిలీజ్ వాయిదా పడటంతో… బంగార్రాజుకు స్పేస్ దొరకడంతో ఆయన సంక్రాంతికి రిలీజ్ చేసేందుకు సిద్ధమవతున్నారు.

ఈ సందర్భంగా ప్రెస్‌మీట్ పెట్టారు. అందులో టిక్కెట్ల అంశంపై మాట్లాడలేనంటూనే కొన్ని సమాధానాలు ఇచ్చారు. ‘సినిమా స్టేజ్ మీద పొలిటికల్ ఇష్యూస్ గురించి మాట్లాడకూడదు.. నేను మాట్లాడను’ అని తేల్చి చెప్పారు . ఏపీలో మీ సినిమాపై కమర్షియల్ గా ఎఫెక్ట్ పడుతుందేమోనని జర్నలిస్టులు ప్రశ్నిస్తే .. ‘నాకు ఎలాంటి ఇబ్బంది లేదు.. టికెట్ రేట్స్ పెరిగితే కొంచెం ఎక్కువ డబ్బులు వస్తాయి అంతే..’ అని బదులిచ్చారు . దీంతో సినీ పరిశ్రమకు కూడా షాక్ తగిలినట్లయింది. ఎవో కాసిని డబ్బులు వస్తాయి.. లేకపోతే లేదన్నట్లుగా ఆయన తీరు ఉంది.

తన గురించి మాత్రమే నాగార్జున ఆలోచించారని.. మిగతా ఇండస్ట్రీ గురించి ఆయన డోంట్ కేర్ అన్నట్లుగా ఉన్నారని అంచనా వేస్తున్నారు. ఏపీ సీఎం జగన్‌కు నాగార్జున అత్యంత సన్నిహితుడు. వ్యాపార లావాదేవీలు కూడా ఉన్నాయని చెబుతూంటారు. ఈ సందర్భంలో ఏపీలో టిక్కెట్ రేట్ల వల్ల వచ్చే నష్టం పెద్దగా ఉండదని.. ఏదో విధంగా కవర్ అవుతుందని నాగార్జున భావిస్తున్నారన్న అభిప్రాయం వినిపిస్తోంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

బీఆర్ఎస్ఎల్పీ విలీనం లేనట్లే – రేవంత్ ఆకర్ష్ ఫెయిల్ !

బీఆర్ఎస్ఎల్పీని విలీనం చేసుకుంటామని ఇరవై ఐదు మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ లో చేరుతారని చేస్తున్న ప్రచారం అంతా డొల్గా తేలుతోంది. ముందుకు వచ్చిన ఒక్కో ఎమ్మెల్యేకు కండువా కప్పుతున్నారు...

రోజా దాచిన మద్యం డంప్ పట్టించిన సొంత పార్టీ నేతలు

ఏపీలో మద్యం దుకాణాలను గుప్పిట్లో పెట్టుకుని వైసీపీ నేతలు చాలా మందుగానే అన్ని నియోజకవర్గాలకు మద్యాన్ని సరఫరా చేసి పెట్టుకున్నారు. అది అధికారిక మధ్యమా.. పన్ను కట్టని మద్యమా అన్నదానిపై ఇంకా క్లారిటీ...
video

‘మ‌న‌మే’ టీజ‌ర్‌: క్యారెక్ట‌ర్ల మ‌ధ్య క్లాషు!

https://www.youtube.com/watch?v=_4Ff1zVtKkw శర్వానంద్ - శ్రీ‌రామ్ ఆదిత్య కాంబినేష‌న్‌లో 'మ‌న‌మే' రూపుదిద్దుకొంటున్న సంగ‌తి తెలిసిందే. కృతి శెట్టి క‌థానాయిక‌గా న‌టిస్తున్న ఈ చిత్రాన్ని పీపుల్ మీడియా ఫ్యాక్ట‌రీ రూపొందిస్తోంది. శ్రీ‌రామ్ ఆదిత్య త‌న‌యుడు ఈ చిత్రంలో...

‘కాంతార 2’లో మోహ‌న్ లాల్‌?

దేశాన్ని కుదిపేసిన క‌న్న‌డ చిత్రం 'కాంతార‌'. ఏమాత్రం అంచ‌నాలు లేకుండా, ఏమాత్రం ప్ర‌మోష‌న్లు చేయ‌కుండానే పాన్ ఇండియా స్థాయిలో విజ‌య ఢంకా మోగించింది. క‌న్న‌డ చిత్ర‌సీమ స్థాయిని ప్ర‌పంచానికి ప‌రిచ‌యం చేసింది. ఇప్పుడు...

HOT NEWS

css.php
[X] Close
[X] Close