మోడీ రాకుండా రోడ్లకు అడ్డంగా ట్రక్కులు.. పంజాబ్ టూర్ క్యాన్సిల్ !

ఇది అనూహ్యమన ఘటన. దేశంలో అత్యంత కట్టుదిట్టమైన భద్రత ఉండే ప్రధానమంత్రి మోడీ పంజాబ్‌లో ఎన్నికల ప్రచార ర్యాలీలో పాల్గొనలేకపోయారు. రైతులు ఆయన కాన్వాయ్‌కు అడ్డం పడి నిరసన వ్యక్తం చేయడంతో ఏం చేయాలో తెలియక.. ఇరవై నిమిషాల సేపు ఆయన కాన్వాయ్ రోడ్ పైనే ఉంది. తర్వాత అతి కష్టం మీద ఆయనను భద్రతా అధికారులు భటిండా ఎయిర్‌పోర్టుకు తరలించగలిగారు. అక్కడ్నుంచి మోడీ ఢిల్లీకి వెళ్లిపోయారు. ఈ ఘటన దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది.

ఎన్నికల సందర్బంగా ప్రదాని మోడీ ఫిరోజ్‌పూర్‌ లో ర్యాలీలో పాల్గొనాల్సి ఉంది. ఇందు కోసం మొదటగా ఆయన ఢిల్లీ నుంచి భటిండా ఎయిర్‌పోర్టుకు చేరుకుని అక్కడ్నుంచి హెలికాప్టర్‌లో ఫిరోజ్‌పూర్‌కు వెళ్లాల్సి ఉంది. కానీ వాతావరణ పరిస్థితులు అనుకూలంగా లేకపోవడంతో హెలికాఫ్టర్ ఎగరడానికి పర్మిషన్ లభించలేదు. దీంతో మోడీ రోడ్ మార్గం ద్వారా వెళ్లాలనుకున్నారు. మోడీ రోడ్ మార్గం ద్వారా వస్తున్నారని తెలిసిన వెంటనే రైతులు పెద్ద ఎత్తున రోడ్లపైకి వచ్చారు. దారిలో ఉన్న ఫ్లై ఓవర్‌లన్నింటిపై వద్ద నిరసనకారులు ట్రక్కులు అడ్డుపెట్టి రోడ్డును బ్లాక్‌ చేశారు.

ముందుకు వెళ్లే పరిస్థితి లేకపోవడంతో ఇరవై నిమిషాలు చూసి మోడీ వెనక్కి తిరిగి భటిండా ఎయిర్‌పోర్టుకు వెళ్లిపోయారు. సెక్యూరిటీ లోపాల కారణంగా మోడీ పర్యటన రద్దయిందని కేంద్ర హోంశాఖ ప్రకటన జారీ చేసింది.భద్రతా లోపాలపై వెంటనే నివేదిక సమర్పించాలని కేంద్ర హోంశాఖ పంజాబ్‌ ప్రభుత్వాన్ని ఆదేశించింది. అయితే ఎలాంటి భద్రతా వైఫల్యం లేదని.. 10వేలమంది పోలీసులతో పటిష్ట సెక్యూరిటీ ఏర్పాటు చేశామని సీఎం చరణ్‌జిత్ సింగ్ చన్నీ తెలిపారు. హెలికాఫ్టర్ ద్వారా రావాల్సిన ప్రధాని మోదీ.. ముందస్తు సమాచారం లేకుండా రోడ్డుమార్గంలో వచ్చేశారని .. అదే సమస్యకు కారణమైందని పేర్కొన్నారు.

ఈ అంశం రాజకీయంగా దుమారం రేపుతోంది. ఎయిర్‌పోర్టులో తాను ప్రాణాలతో బయటపడ్డానని.. ఈ విషయంలో సీఎం చన్నీకి కృతజ్ఞతలంటూ మోడీ చేసిన వ్యాఖ్యలు కూడా వైరల్ అవుతున్నాయి. ప్రధాని రోడ్డు మార్గంలో వెళ్తే నిరసనలు ఇలాగే ఉంటాయని విపక్షాలు విమర్శలు గుప్పిస్తున్నాయి.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

కేకేను తిట్టి పంపించిన కేసీఆర్

రాజ్యసభ ఎంపీ కేకే, ఆయన కుమార్తె హైదరాబాద్ మేయర్ విజయలక్ష్మి శనివారం కాంగ్రెస్ పార్టీలో చేరాలని నిర్ణయించుకున్నారు. తనను పార్టీలో చేర్చుకుని రెండు సార్లు రాజ్యసభ సీటు ఇచ్చిన కేసీఆర్ కు ఓ...

అవినాష్ రెడ్డికి ఎన్నికల ముందే బెయిల్ రద్దు గండం ?

అవినాష్ రెడ్డి బెయిల్ రద్దు చేయాలని అప్రూవర్ గా మారిన దస్తగిరికి పిటిషన్ వేసే హక్కు ఉందని హైకోర్టు స్పష్టం చేసింది. దీంతో ఆయన వేసిన పిటిషన్‌పై విచారణ జరగనుంది. ఏప్రిల్...

‘ఆడు జీవితం’ రివ్యూ: ఎడారి పాలైన బ్రతుకుల వ్యధ

ఫారిన్ చిత్రాలతో పోల్చుకుంటే భారతీయ చిత్రాలలో సర్వైవల్ థ్రిల్లర్స్ తక్కువే. అయితే ఈ మధ్య కాలంలో మలయాళ పరిశ్రమ ఈ జోనర్ పై ప్రత్యేక దృష్టి పెట్టింది. '2018' చిత్రం ఆస్కార్ నామినేషన్స్...

అనపర్తిలో ఆందోళన… నల్లమిల్లి దారెటు..?

అవును ప్రచారమే నిజమైంది. అనపర్తి సీటు టీడీపీ నుంచి బీజేపీ ఖాతాలోకి వెళ్ళిపోయింది. పొత్తులో భాగంగా బీజేపీ నేత ములగపాటి శివ కృష్ణంరాజుకి కేటాయించారు. దీంతో టీడీపీ టికెట్ ఆశించిన మాజీ...

HOT NEWS

css.php
[X] Close
[X] Close