ఆయ‌న స‌మ‌ర్థ‌త ఇప్పుడు క‌నిపించ‌లేదా బాబూ!!

కృష్ణా జిల్లా క‌లెక్ట‌ర్ బాబును బ‌దిలీ చేశారు. కాదు..కాదు.. ప‌ద‌వినుంచి త‌ప్పించారు. పోస్టింగు ఇవ్వ‌కుండా నిలిపేశారు. కార‌ణ‌మేంటి. అంద‌రి మ‌దిలోనూ ఇంకా చెరిగిపోని దివాక‌ర్ ట్రావెల్స్ బ‌స్సు ప్ర‌మాద‌మేన‌నేది అంద‌రూ భావిస్తున్న కార‌ణం. ఆ స‌మ‌యంలో ప్ర‌తిప‌క్ష నేత వైయ‌స్ జ‌గ‌న్మోహ‌న్ రెడ్డిని స‌మ‌ర్థంగా అడ్డుకోలేక‌పోయార‌ని ముఖ్యమంత్రి భావించ‌డ‌మే దీనికి బాట‌లు వేసిందంటున్నారు. ఆ స‌మయంలో చంద్ర‌బాబు కృష్ణా జిల్లా క‌లెక్ట‌రు స‌మ‌ర్థ‌త‌నూ, అనుభ‌వాన్నీ ఆకాశానికెత్తేస్తూ మాట్లాడారు. ఒక జిల్లా మేజిస్ట్రేట్ మీద చేయి వేసి మాట్లాడ‌తావా.. ఆయ‌న్ను జైలుకు పంపిస్తానంటావా.. ఆయ‌నెవ‌రో అయ‌న అధికారులెవ‌రో నీకు తెలుసా.. ఆయ‌న త‌ల‌చుకుంటే నిన్నే జైల్లో కూర్చోబెడ‌తాడ‌ని చంద్ర‌బాబు విలేక‌రుల స‌మావేశంలో వైయ‌స్ జ‌గ‌న్నుద్దేశించి మండిప‌డ్డారు. అంత స‌మ‌ర్థుడైతే క‌లెక్ట‌ర్ బాబుకు పోస్టింగు ఇవ్వ‌కుండా ఎందుకు కూర్చోబెట్టారు. ఆయ‌న స‌మ‌ర్థ‌త‌కు త‌గిన పోస్టు క‌నిపించ‌లేదా. స‌మ‌ర్థుడైన అధికారిని ఇలా ఖాళీగా ఉంచ‌డం ఆయ‌న్ను అవ‌మానించ‌డం కాదా. అదే స‌మ‌యంలో రెవెన్యూ అధికారులంతా స‌మావేశ‌మై క‌లెక్ట‌ర్ బాబుతో జ‌గ‌న్ వ్య‌వ‌హార‌శైలిని త‌ప్పుబ‌ట్టారు. తీవ్రంగా ఖండించారు. ఆయ‌న‌కు క్ష‌మాప‌ణ చెప్పాల‌ని డిమాండూ చేశారు. ఇప్పుడా అధికారుల నోరు పెగ‌ల‌దేం. స‌మ‌ర్థుడైన అధికారిని ఖాళీగా కూర్చోబెట్టార‌ని అడ‌గ‌రేం. నిజాయితీగ‌ల అధికారి వెంట ఉంటే ప్ర‌జ‌లూ స‌మ‌ర్థిస్తారు. లోక్ స‌త్తా జాతీయాధ్య‌క్షుడు జ‌య‌ప్ర‌కాశ్ నారాయ‌ణ్ క‌లెక్టర్‌గా ఉన్న స‌మ‌యంలో ఆయ‌న్ను బ‌దిలీ చేస్తే ప్ర‌జ‌ల నుంచి నిర‌స‌న వెల్లువ‌లా వ‌చ్చింది. ప్ర‌కాశం, తూర్పుగోదావ‌రి జిల్లాల్లో ప్ర‌జ‌లు ఇదే మాదిరిగా ప్ర‌తిస్పందించారు. విధిలేని ప‌రిస్థితుల్లో ప్ర‌భుత్వ‌మే దిగొచ్చి, ఆయ‌న్ను కొన‌సాగించింది. ఆయ‌న ప్ర‌జ‌ల‌కోసం ప‌నిచేసిన క‌లెక్ట‌ర్‌. కానీ బాబు..పై ఆరోప‌ణ ఏమిటి. జ‌గ‌న్‌ను నిరోధించ‌లేక‌పోయార‌ని. ఆయ‌న్ను ఎవ‌రు నిరోధించాలి. పోలీసులు ఆ ప‌నిచేయాలి. అనుమ‌తి లేద‌ని చెప్పి ప్ర‌తిప‌క్ష నేత‌ను వెన‌క్కి పంపేసుండాలి. ఆ వైఫ‌ల్యం క‌లెక్ట‌ర్‌పై ప‌డింది. అప్పటిక‌ప్పుడు బ‌దిలీ చేసేస్తే.. మ‌రో వివాదం త‌లెత్తుతుంద‌ని భావించి చంద్ర‌బాబు గమ్మునున్నార‌నీ, ఇప్పుడు ఐఏఎస్‌ల బ‌దిలీల్లో ఆయ‌న‌పై వేటు వేశారంటున్నారు. అదే నిజ‌మైతే, ఆరెంజ్ బ‌స్ ట్రావెల్స్ వివాదంలో ర‌వాణా శాఖ క‌మిష‌న‌ర్ బాల సుబ్ర‌హ్మ‌ణ్యాన్నీ ఎందుకు త‌ప్పించ‌లేదు. అధికార పార్టీ ఎంపీ, ఎమ్మెల్యేల‌తో ఆయ‌న‌కు క్ష‌మాప‌ణ చెప్పించిన‌ప్ప‌టికీ, వివాదం తాలూకు గాయం ఇంకా ప‌చ్చిగానే ఉంది. కేశినేని నాని త‌న ట్రావెల్స్‌ను మూసేయ‌డం, త‌దుప‌రి త‌మ‌కు కొన్ని నెల‌లుగా జీతాలు చెల్లించ‌డం లేద‌ని ఆ సంస్థ ఉద్యోగులు ఆందోళ‌న‌కు దిగ‌డం, త‌దిత‌ర కార‌ణాల వ‌ల్ల వివాదం స‌ద్దుమ‌ణ‌గ‌లేదు. అది ఓ కొలిక్కి వ‌చ్చిన త‌ర‌వాత ర‌వాణా క‌మిష‌న‌రుకు కూడా బ‌దిలీ త‌ప్ప‌దు. కొంచెం స‌మ‌యం అంతే. ఆంధ్ర ప్ర‌దేశ్ ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు పాల‌న అనుభ‌వానికి ఐఏఎస్‌ల తాజా బ‌దిలీలు తార్కాణంగా నిలుస్తున్నాయి.న‌లుగురితో పాటు నారాయ‌ణ అన్న‌ట్లు త‌మ దుగ్ధ‌ను తీర్చేసుకోవ‌డం ఈ ప్ర‌భుత్వ‌మే కాదు ఏ ప్ర‌భుత్వ‌మైనా చేసేది. అంద‌రూ…..!!!

-సుబ్ర‌హ్మ‌ణ్యం విఎస్ కూచిమంచి

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

మా రాష్ట్రానికి రండి… రేవంత్ కోసం 7 రాష్ట్రాల రిక్వెస్ట్!

గెల‌వ‌టం అసాధ్య‌మ‌నుకున్న తెలంగాణ‌లో పార్టీని గెలిపించిన సీఎం రేవంత్ రెడ్డికి... ఇత‌ర రాష్ట్రాల నుండి మా రాష్ట్రానికి రండి అంటూ ఇన్విటేష‌న్లు వ‌స్తున్నాయి. మా రాష్ట్రంలో తెలుగు వారున్నారు మీరు రండి అంటూ...

నేల దిగిన విక్ర‌మ్‌… ఈసారి కొట్టేస్తాడేమో..?!

విక్ర‌మ్ న‌టుడిగా ఎప్పుడూ ఫెయిల్ కాలేదు. ప్ర‌తీసారీ ఏదో ఓ రూపంలో కొత్త‌ద‌నం ఇవ్వాల‌నే ప్ర‌య‌త్నం చేస్తూనే ఉంటాడు. అదే త‌న ప్ల‌స్సు, అదే మైన‌స్సు కూడా. మితిమీరిన ప్ర‌యోగాల‌తో చేతులు కాల్చుకోవ‌డం...

మోత్కుపల్లి ఏ పార్టీలో ఉన్నా అంతే !

మోత్కుపల్లి నరసింహులు కాంగ్రెస్ పార్టీపై అసంతృప్తి వ్యక్తం చేశారు. కాంగ్రెస్‌లో మాదిగలకు అన్యాయం జరుగుతోందని.. మఖ్యమంత్రి రేవంత్ తప్పు చేస్తున్నారని తెరపైకి వచ్చారు. ఒక రోజు దీక్ష చేస్తానని ప్రకటించారు. నిజానికి మోత్కుపల్లి...

తగ్గేదేలే – తోట త్రిమూర్తులే అభ్యర్థి !

దళితుల శిరోముండనం కేసులో దోషిగా తేలి జైలు శిక్షకు గురైన మండపేట వైసీపీ అభ్యర్థి తోట త్రిముర్తులకు జగన్ అభయం ఇచ్చారు. జైలు శిక్ష పడినా అభ్యర్థి ఆయనేనని స్పష్టం చేయడంతో ...

HOT NEWS

css.php
[X] Close
[X] Close