ఇండియా టుడే సర్వే : ఇప్పుడు ఎన్నికలు జరిగితే వైసీపీకి 18.. టీడీపీకి ఏడు సీట్లు !

ఇండియా టుడే మూడ్ ఆఫ్ ది నేషన్ పేరుతో ఫోన్ల నుంచి తీసుకుని చేసే అభిప్రాయసేకరణలో ఏపీలో బీజేపీకి ఒక్క సీటు కూడా రాదని తేలిసింది. ఉన్న ఇరవై ఐదు సీట్లు యూపీఏ, ఎన్డీఏలకు రావని తేల్చింది. వైసీపీకి పద్దెనిమిది.. టీడీపీకి ఏడు సీట్లు వస్తాయని ఇండియా టుడే అంచనా వేసింది. గత నెలలో చేసిన సర్వేలో టీడీపీకి ఆరు సీట్లు వేశారు. ఈ సారి మాత్రం ఒక సీటు పెంచారు. జనసేన సంగతేమిటో చెప్పలేదు. ఏపీ రాజకీయాల్లో జనసేన డిసైడింగ్ ఫ్యాక్టర్. ఆ విషయాన్ని ఇండియా టుడే పరిగణనలోకి తీసుకోలేకపోయింది.

అయితే మూడేళ్ల కాలంలో ప్రభుత్వంపై వ్యతిరేకత సహజంగా కనిపించదు. కానీ భారీగా సీట్లు కోల్పోతున్న పరిస్థితిని సర్వేలు వెల్లడిస్తున్నాయి. ఇండియా టుడేతో ఏపీ ప్రభుత్వ పెద్దలకు మంచి సంబంధాలు ఉన్నాయి. ఈ సర్వేను ప్రజెంట్ చేసిన రాహుల్ కన్వల్ కు జగన్. బీజేపీ అంటే అభిమానం ఉంటుంది. పలుమార్లు ఆ విషయాన్ని స్పష్టం చేశారు. అయితే దేశం మొత్తం మీద .. రెండున్నరలక్షల మంది శాంపిల్స్ మాత్రమే తీసుకున్నారు. అందులో లక్ష లోపు మందినే ఇంటర్యూ చేశారు. ఆ ఫలితాలను ప్రకటించారు.

ఈ సర్వేలో బీజేపీకి హిందీ పాలిత రాష్ట్రాల్లో వందకు వంద శాతం సీట్లు వేశారు. గుజరాత్, కాంగ్రెస్ అధికారంలో ఉన్న రాజస్థాన్ , మధ్యప్రదేశ్ ఇలా అన్నింటిలోనూ ఒక్క సీటు కోల్పోకుండా బీజేపీ సాధిస్తుందని సర్వే చేశారు. బీజేపీ ఒంటరిగా 286 సీట్లు సాధిస్తుందని చెప్పుకొచ్చారు. గత నెలలో ఇండియా టీవీ నిర్వహించిన సర్వేలోనూ దాదాపుగా ఇదే ఫలితాలు వచ్చాయి. ఆ సర్వే టీడీపీకి ఆరు సీట్లు ఇవ్వగా.. ఇండియా టుడే మూడ్ ఆఫ్ ది నేషన్ సర్వే ఏడు సీట్లు వస్తాయని విశ్లేషించింది.

మొత్తంగా మూడ్ ఆఫ్ ది నేషన్ .. క్షేత్ర స్థాయిలో చేసే సర్వే కాదు. ఫోన్ల ద్వారా చేసే సర్వే. దీనిఖచ్చితత్వానికి ఇండియా టుడే కూడా గ్యారంటీ ఇవ్వడం లేదు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

హరీష్ రావు ఉత్తుత్తి రాజీనామా – కామెడీ చేసిన కాంగ్రెస్ !

తెలంగాణ ఉద్యమం కోసం ఇప్పటికే ఎన్నో సార్లు రాజీనామా చేశానని.. తనకు పదవులు ఓ లెక్క కాదంటూ చెప్పే హరీష్ రావు.. తాజాగా చేసిన రాజీనామా ఆయనను ట్రోల్ చేసేలా ఉంది....

చేసింది పొన్నవోలే కానీ చేయించింది జగన్ కాదట !

సీబీఐ చార్జిషీట్‌లో వైఎస్ఆర్ పేరును సోనియా గాంధీ పెట్టించారంటూ ఇంత కాలం జగన్ చేస్తున్న ప్రచారానికి షర్మిల ఒకే ఒక్క డైలాగ్ తో చెక్ పెట్టారు. పొన్నవోలు ద్వారా...

నారా భువనేశ్వరి డీప్ ఫేక్ ఆడియోతో వైసీపీ అరాచకం !

ఇంట్లో సొంత కుటుంబసభ్యుల్ని అత్యంత హీనంగా దూషిస్తున్న జగన్మోహన్ రెడ్డి పార్టీ.. ఆ పార్టీ సోషల్ మీడియా విభాగం పూర్తిగా కంట్రోల్ తప్పిపోయింది. ఏకంగా నారా భువనేశ్వరి ఆడియో పేరుతో డీప్ ఫేక్...

బిగ్ బ్రేకింగ్ – షాద్ నగర్ లో ఘోర అగ్ని ప్రమాదం

షాద్ నగర్ లో ఘోర అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. నందిగామ శివార్ సమీపంలోని అలెన్ హోమియో , హెర్బల్ కంపెనీలో ఈ అగ్ని ప్రమాదం జరిగింది. దీంతో పెద్ద ఎత్తున మంటలు ఎగిసిపడుతున్నాయి....

HOT NEWS

css.php
[X] Close
[X] Close