యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నిబంధనల ప్రకారం చాలా కాలం తర్వాత ఓ పూర్తి స్థాయి డీజీపీని ఏపీలో నియమించారు. ప్రస్తుత డీజీపీ హరీష్ కుమార్ గుర్తానే పూర్తి స్థాయి డీజీపీగా నియమించారు. దీంతో ఆయన మరో రెండేళ్ల పాటు డీజీపీగా ఉంటారు. పదవి వివరణ తేదీతో సంబంధం ఉండదు. ఇవాళ్టి నుంచి రెండేళ్ల పాటు ఆయనకు పదవి ఉంటుంది.
డీజీపీ నియామకం విషయంలో స్పష్టమైన రూల్స్ ఉన్నాయి. వాటి ప్రకారం.. సీనియర్ ఆఫీసర్ల జాబితాను యూపీఎస్సీకి పంపితే వారు మూడు పేర్లు ఫైనల్ చేసి రాష్ట్రానికి పంపుతారు. ఆ ముగ్గురిలో ఒకరిని రాష్ట్ర ప్రభుత్వం ఎంపిక చేసుకోవచ్చు. ఇలా ప్రాసెస్ లో హరీష్ గుప్తాను చంద్రబాబు ఖరారు చేశారు. ఆయన బాధ్యతలు తీసుకున్నారు. హరీష్ గుప్తా డీజీపీగా బాధ్యతలు తీసుకోవడం ఇది మూడో సారి
మొదట ఎన్నికల సమయంలో.. అప్పటి డీజీపీ రాజేంద్ర నాథ్ రెడ్డిని ఈసీ బదిలీ చేసింది. ఆయన స్థానంలో హరీష్ గుప్తాను నియమించారు. చంద్రబాబు వచ్చిన తర్వాత ఆయనను కంటిన్యూ చేశారు. అయితే ద్వారకా తిరుమలరావుకు అవకాశం కల్పించేందుకు మధ్యలో ఆయనను మార్చారు. ద్వారకా తిరుమలరావు డీజీపీ అయ్యారు.. అదేహోదాలో రిటైర్ అయ్యారు. మళ్లీ హరీష్ గుప్తాకే చాన్స్ ఇచ్చారు. అత్యధిక కాలం ఆయన డీజీపీగా ఉండనున్నారు.