టీడీపీ- జనసేన పొత్తు పక్కా ! బీజేపీని కలుపుకుంటారా ?

కలసి రావాలని చంద్రబాబు పిలుపు ఇస్తే.. తాము సిద్ధమని జనసేన సంకేతాలు ఇచ్చింది. దీంతో వీరి పొత్తులు ఖాయమని.. కలసి పోటీ చేయడం ఖాయమని తేలిపోయింది. అయితే చాలా మంది 2014 రిపీట్ అవుతుందా లేదా అన్న సందేహంలో ఉన్నారు. అంటే.. బీజేపీ కూడా వీరి కూటమిలో కలుస్తుందా లేదా అన్నది సందేహం. ప్రస్తుతం జనసేన బీజేపీతో పొత్తులో ఉంది. ఆ పొత్తు వల్ల ఒక్క ఓటు కలసి రాకపోగా ముస్లిం మైనార్టీ ఓట్లన్నీ దూరమైపోయాయని జనసేన నేతలు బహిరంగంగానే చెబుతూంటారు. దీంతో బీజేపీతో మాత్రమే పొత్తు కొనసాగించే అవకాశాలే లేవు. ఉంటే టీడీపీ, బీజేపీ లేకపోతే టీడీపీ అన్నట్లుగా జనసేన పరిస్థితి ఉంది.

బీజేపీ నేతలు ఇప్పటికే అతి ప్రకటనలు చేస్తున్నారు. జనసేన పేరు కూడా పెద్దగా ప్రస్తావించకుండా తాము వచ్చే ఎన్నికల్లో అధికారంలోకి వచ్చేస్తున్నామని ఎవరి పొత్తులు.. త్యాగాలు అవసరం లేదని సోము వీర్రాజు లాంటి నేతలు పెద్ద పెద్ద ప్రకటనలు చేస్తున్నారు. జనసేన ఒంటరిగా పోటీ చేయాలని.. ఓట్లు చీలిపోవాలని కోరుకుంటున్న వైసీపీ నేతల ప్రకటనలకు తగ్గట్లుగానే ఆయనవి ఉంటున్నారు. ఆయన ఏపీ బీజేపీ అధ్యక్షుడుకాబట్టి ఆయన మాటలకు విలువ ఉంటోంది. లేకపోతే ఎవరూ పట్టించుకోరు. కానీ పొత్తులను డిసైడ్ చేసేది కేంద్రంలోని నేతలే.

ఎంపీలతో కేంద్రంలో సపోర్ట్ చేస్తామని ..ఏపీలో మాత్రం పొత్తులు సీట్ల సర్దుబాటు మాత్రం వద్దని వైసీపీ తరహాలో బీజేపీ కేంద్ర నాయకత్వాన్ని ఒప్పించేందుకు జనసేన ప్రయత్నించే అవకాశం ఉంటుందని అంటున్నారు. బీజేపీకి ఒక్క శాతం కూడా ఓటు బ్యాంక్ లేదు. ఆ పార్టీ వల్ల ఆయా పార్టీలకు కలసి వచ్చేదేమీ ఉండదు. కానీ కేంద్రంలో అధికారంలో ఉన్నపార్టీ కాబట్టి ఎన్నికల సమయంలో చాలా అంశాలు కలసి రావడానికి కొన్ని పనులు ఆటంకం లేకుండా చేయడానికి చాన్స్ ఉంటుంది. ఆ కారణాల వల్ల మాత్రమే బీజేపీని కన్సిడర్ చేస్తారు.

బీజేపీని కలుపుకుంటారో లేదో కానీ జనసేన కూడా రాష్ట్ర భవిష్యత్ కోసం తాము కీలక నిర్ణయాలు తీసుకోక తప్పదని చెబుతున్నారు. విపక్షాలన్నీ కలసిపోయి .. ప్రభుత్వ వ్యతిరేకత పెరిగి.. ఆ ఓట్లన్నీ కేంద్రీకృతం అయితే.. వైసీపీకి ఘోరపరాజయం తప్పదని ఇప్పటికే రాజకీయ నిపుణులు తేల్చేశారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

జగన్ తండ్రిని కూడా వదల్లేదా..? షర్మిల సంచలన వ్యాఖ్యలు

ఏపీ కాంగ్రెస్ చీఫ్ వైఎస్ షర్మిల అసలు రాజకీయం ఇప్పుడు స్టార్ట్ చేశారు.వైఎస్సార్ కు వారసురాలు జగన్ రెడ్డి కాదని బలంగా చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. వైఎస్ రాజకీయ వారసత్వాన్ని కొనసాగిస్తున్నది తను...

భయపెడుతోన్న ఎండలు…వాతావరణ శాఖ బిగ్ అలర్ట్

ఎండలతో తెలుగు రాష్ట్రాలు కుతకుత ఉడుకుతున్నాయి. బయటకు వెళ్లేందుకు జనం జంకుతున్నారు. పగలూ, సాయంత్రం అనే తేడా లేకుండా ఉక్కపోత సెగలు పుట్టిస్తోంది.ఈ క్రమంలోనే వాతావరణ శాఖ బిగ్ అలర్ట్ ఇచ్చింది. రానున్న...

ఈవీఎం, వీవీ ప్యాట్ పిటిషన్లపై సుప్రీం కీలక తీర్పు

లోక్ సభ ఎన్నికల వేళ ఈవీఎం-వీవీప్యాట్‌కు సంబంధించి దాఖలైన పిటిషన్లపై సుప్రీంకోర్టు తీర్పు వెలువరించింది. వీవీప్యాట్‌ స్లిప్పులతో ఈవీఎం ద్వారా పోలైన ఓట్లను వందశాతం సరిపోల్చాలనే పిటిషన్లను సర్వోన్నత న్యాయస్థానం తిరస్కరించింది. జస్టిస్...

పోలింగ్ ముగిసిన తర్వాత ట్యాపింగ్ కేసులో అసలైనఅరెస్టులు !

ఎన్నికల హడావుడి తగ్గిన తర్వాత ట్యాపింగ్ కేసులో ఎన్నో బ్రేక్ డాన్సులు చోటు చేసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. స్పెషల్‌ ఇంటెలిజెన్స్ బ్యూరో చీఫ్‌గా పనిచేసిన ప్రభాకర్ రావుపై రెడ్ కార్నర్ నోటీసులు...

HOT NEWS

css.php
[X] Close
[X] Close