” మిషన్ భగీరథ ” అవినీతిపై కేంద్రం విచారణ !

కేంద్ర ప్రభుత్వం తెలంగాణ విషయంలో అనూహ్య నిర్ణయం తీసుకుంది. జలజీవన్ కమిషన్ సర్వే ఆధారంగా మిషన్ భగీరథలో జరిగిన కుంభకోణం పై కేంద్ర జలవనరుల మంత్రిత్వశాఖ దర్యాప్తు చేయాలని నిర్ణయించింది. ఈ మేరకు దర్యాప్తు అధికారిని కూడా నియమించింది. బక్కా జడ్సన్ అనే కాంగ్రెస్ నేత మిషన్ భగీరథ మదర్ ఆఫ్ ఆల్ స్కామ్స్ అని ఫిర్యాదు చేస్తూ లేఖ రాశారు. ఆ లేఖను పరిగణనలోకి తీసుకున్న కేంద్ర జలవనరుల మంత్రిత్వ శాఖ విచారణకు ఓ అధికారిని కూడా నియమించింది.

మిష‌న్ భ‌గీర‌థ ప‌థ‌కానికి ఏడేళ్లలో రూ. 36 వేల కోట్ల ఖర్చు చేశారు. ఇంటింటికీ నల్లా నీళ్లు ఇచ్చినట్లు ప్రభుత్వం చెబుతోంది. జ‌ల జీవ‌న్ క‌మిష‌న్ ఇటీవ‌లే ఈ ప‌థ‌కం అమ‌లు తీరుపై స‌ర్వే నిర్వ‌హించింది. ఈ క‌మిష‌న్ స‌ర్వే రిపోర్టు ఇటీవ‌లే కేంద్రానికి అంద‌గా… ఆ నివేదిక ఆధారంగా కేంద్రానికి ఫిర్యాదు చేసినట్లుగా తెలుస్తోంది. సగానికిపైగా పాత స్కీమ్ పైపులు, పాత ట్యాంకులు, పాత నల్లాలు, పాత ఇన్ఫ్రాస్ట్రక్చర్నే మిషన్ భగీరథ స్కీమ్లో వాడుకుని కొత్తవి వేసినట్లుగా బిల్లులు పెట్టుకున్నారన్న ఆరోపణలు ఉన్నాయి.

ఈ స్కీమ్కు హడ్కో, కమర్షియల్‌‌ బ్యాంకుల నుంచి 80 శాతం నిధులు అప్పుగా.. మిగతా 20 శాతం రాష్ట్ర ప్రభుత్వం బడ్జెట్‌‌ నుంచి నిధులు కేటాయించింది. ఈ నిధుల్లో గోల్ మాల్‌పై విచారణ జరపాలని కేంద్రం నిర్ణయించడం అనూహ్య పరిణామం. మిషన్ భగీరథ పైపుల కంపెనీల కోసం పెట్టారని.. ఆ పైపుల కంపెనీలు కేసీఆర్ కుటుంబసభ్యులవని చాలా కాలంగా విపక్ష నేతలు ఆరోపిస్తున్నారు. కేంద్రం సీరియస్‌గా విచారణ జరిపితే కీలకమైన విషయాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉందని విపక్షాలు భావిస్తున్నాయి. అయితే ఇది సీరియస్ విచారణ లేకపోతే.. ధాన్యం తరహా విచారణేనా అన్నది తేలాల్సి ఉంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

video

‘గ్యాంగ్స్‌ ఆఫ్‌ గోదావరి’ టీజర్ : అమ్మోరు పూనేసింది

https://youtu.be/CAR8XtEpwhE?si=ZNMm4KXPixfwjlDL విశ్వక్ సేన్ ప్రయాణం వైవిధ్యంగా సాగుతుతోంది. అన్నీ తరహ జోనర్స్ లో సినిమాలు చేస్తున్నారు. ఇప్పటివరకూ డెక్కన్ బేస్డ్ సినిమాలతో అలరించిన ఆయన ఇప్పుడు తొలిసారి కోనసీమ నేపధ్యంలో ఓ యాక్షన్ కథ...

టూ లేట్ -కేసీఆర్ సోషల్ మీడియా ఎంట్రీ !

కేసీఆర్ వ్యక్తిగత సోషల్ మీడియా ఖాతాలను ప్రారంభించారు. ఆయన ఆపరేట్ చేయరు కానీ అందులో పోస్ట్ చేసే ప్రతి అంశం ఆయన అభిప్రాయమే అనుకోవచ్చు. ఎక్స్ తో పాటు ఫేస్ ...

కమ్యూనిస్టులను దారికి తెచ్చుకున్న రేవంత్ రెడ్డి

రెండు కమ్యూనిస్టు పార్టీలను బేషరతుగా మద్దతు ప్రకటించుకునేలా చేసుకున్నారు రేవంత్ రెడ్డి. సీపీఐ అసెంబ్లీ ఎన్నికల్లో పొత్తులు పెట్టుకుంది. లోక్ సభ ఎన్నికల కసరత్తు ప్రారంభమైన తర్వాత ఒక్క పార్లమెంట్ సీటు...

43వేల కోట్లతో రోడ్లేశాం కానీ వర్షాలకు కొట్టుకుపోయాయి : జగన్

జగన్మోహన్ రెడ్డి నోటికొచ్చింది చెప్పరు.. రాసుకొచ్చిందే చెబుతారు. రాసిచ్చే వారు ఏమి రాసిచ్చారో.. ఆయన ఏమి చదివారో కానీ.. మేనిఫెస్టోను రిలీజ్ చేసేటప్పుడు రోడ్ల ప్రస్తావన తెచ్చారు. టీడీపీ హయాం కన్నా...

HOT NEWS

css.php
[X] Close
[X] Close