అవును.. మంత్రి నారా లోకేష్ కు వైసీపీ అధినేత జగన్ మరింత మైలేజ్ తెచ్చిపెడుతున్నారు. లోకేష్ పరిచయం చేసిన ఈ రెడ్ బుక్ కు ఫ్రీ ప్రమోషన్ తీసుకొచ్చి పెడుతున్నారన్న వాదన వైసీపీలోనూ వినిపిస్తోంది. జగన్ ఎక్కడికి వెళ్లినా రెడ్ బుక్ ను ప్రస్తావించడం కామన్ గా మారింది. అదంతా ఒక ఎత్తు అయితే..ఇప్పుడు తెనాలి పర్యటనలో రెడ్ బుక్ ను ప్రస్తావించడం పట్ల రెడ్ బుక్ పై ఇప్పటివరకూ వైసీపీ లేవనెత్తుతోన్న అపవాదును జగనే తొలగించినట్టుగా ఉందన్న అభిప్రాయం వ్యక్తం అవుతోంది.
రెడ్ బుక్ పేరుతో ప్రతిపక్ష నాయకులపై కూటమి సర్కార్ కక్ష సాధింపు చర్యలకు దిగుతోందని వైసీపీ ఆరోపణలు చేస్తోంది. అంబేడ్కర్ రాజ్యాంగాన్ని పక్కనపెట్టి రెడ్ బుక్ రాజ్యాంగం అమలు చేస్తున్నారంటూ ఆరోపణలు చేస్తోన్న వేళ మంత్రి లోకేష్ గతంలోనే స్పష్టత ఇచ్చారు. చట్టాన్ని ఉల్లంఘించిన వారిని శిక్షించేదే రెడ్ బుక్ అని స్పష్టం చేశారు. తన పాదయాత్రలో రెడ్ బుక్ పట్టుకొని రాష్ట్రమంతా తిరిగానని, ప్రజలకు రెడ్ బుక్ గురించి వివరించానన్నారు. అది నచ్చే కూటమికి ప్రజలు అవకాశం ఇచ్చారన్నారు. చట్టాన్ని ఉల్లంఘించిన వారి పేర్లన్నీ రెడ్ బుక్ లో ఉన్నాయని, వారికి శిక్ష పడేలా చేస్తామన్నారు.
తాజాగా తెనాలి పర్యటనలోనూ జగన్ రెడ్ బుక్ ఆధారంగానే ముగ్గురు యువకులను పోలీసులు కొట్టారని చెప్పడంపై ప్రజల్లోనూ ఆ ఎర్రబుక్ పై ఉన్న అనుమానాలు పటాపంచలు అయ్యాయి. ఎందుకంటే ఆ గంజాయి బ్యాచ్ కు పోలీసులు ఇచ్చిన కోటింగ్ ను ప్రజలు హర్షించారు. మత్తులో కానిస్టేబుల్ పైనే దాడి చేసి హత్యాయత్నం చేశారు.. ఆ స్థానంలో ఓ మహిళా ఉండి ఉంటే ఏం జరిగిందోనని మహిళా సంఘాలు పోలీసులు చేపట్టిన చర్యను సమర్థించారు. నిందితులకు పోలీసులు ఇచ్చిన ట్రీట్మెంట్ ను రెడ్ బుక్ లో భాగంగా అమలు చేసుంటే.. అది మంచిదే కదా.. దీన్ని ఎందుకు రాద్దాంతం చేస్తున్నారని వాదనలు వినిపిస్తున్నాయి. దీంతో..రెడ్ బుక్ పై సాధారణ జనంలో ఇప్పటివరకు ఉన్న అనుమానాలను జగన్ పటాపంచలు చేస్తూ ఫ్రీ ప్రమోషన్ చేశారని అంటున్నారు.