అరెస్ట్ చేస్తే అంతేనా..? రేవతికి పోలీసులే శిక్ష అమలు చేస్తున్నారా..? 

మోజో టీవీ మాజీ సీఈవో రేవతిని పోలీసులు అరెస్ట్ చేసి వారం రోజులు దాటిపోయింది. ఆమెను వారం రోజులు.. పోలీస్ స్టేషన్‌లోని లాకప్‌లోనే ఉంటారు. కానీ కేస్ డైరీని మాత్రం ఇంత వరకూ కోర్టులో ప్రొడ్యూస్ చేయలేదు. దీనిపై.. రేవతి భర్త, ప్రముఖ దర్శకుడు చైతన్య దంతులూరి ఫేస్‌బుక్‌లో ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. ఓ మహిళా జర్నలిస్టులు పోలీసులు ఇంటి నుంచి బలవంతంగా అరెస్ట్ చేసి తీసుకెళ్లి వారం అవుతోందని.. ఇంత వరకూ..కోర్టులో కనీసం .., కేసు డైరీని ప్రొడ్యూస్ చేయలేదన్నారు. ప్రముఖ జాతీయ జర్నలిస్ట్ రాజ్‌దీప్ సర్దేశాయ్ కూడా.. పోలీసుల తీరును తప్పు పడుతూ.. సోషల్ మీడియాలో ట్వీట్ చేశారు. దీంతో విషయం.. జాతీయ స్థాయికి వెళ్లింది. 

రేవతిని లాకప్‌లో పెట్టడమే పోలీసుల లక్ష్యమా..?

నిజానికి రేవతి అరెస్ట్ వ్యవహారమే కలకలం రేపింది. ఆమెను కేసులో ఏ -2గా చేర్చారు. కానీ ఏ -1గా ఉన్న నిందితుడ్ని కనీసం పట్టించుకోలేదు. ఆయన కూడా.. ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేస్తూ..  సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. అయినప్పటికీ.. ఏ-1 తమ టార్గెట్ కాదనుకున్నారేమో కానీ.. ఏ-2 రేవతిని మాత్రం.. అరెస్ట్ చేసి లాకప్‌లో వేశారు. ఇప్పటికి కచ్చితంగా వారం రోజులు అయింది. ఎలాంటి కేసులో అయినా… వారం రోజుల్లో కేసు డైరీని.. కోర్టులో ప్రొడ్యూస్ చేయడం.. పోలీసుల విధి. కానీ.. రేవతి విషయంలో మాత్రం.. పోలీసులు భిన్నంగా వ్యవహరిస్తున్నారు. తమ లక్ష్యం  వేరే అన్నట్లుగా ఉన్నారు. 


వారం రోజులైనా కేస్ డైరీ కోర్టులో ప్రొడ్యూస్ చేయరా..?

అసలు రేవతిపై.. ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు పెట్టదగిన ఫిర్యాదు కాదని.. న్యాయ నిపుణులు చెబుతున్నారు. చానల్‌లో చర్చ కోసం వచ్చిన ఓ వ్యక్తి.. స్టూడియో నుంచి వెళ్లిపొమ్మన్నారన్న కోపంతో…. బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్‌లో అట్రాసిటీ ఫిర్యాదు చేశారు. ఇది జరిగింది.. గత జనవరిలో. అప్పటి నుంచి పోలీసులు ఆ ఫిర్యాదున పక్కన పెట్టారు. ఎందుకంటే… రేవతి.. ఆ చర్చా కార్యక్రమం జరిగిన టీవీ చానల్‌కు సీఈవోగా ఉన్నారు కానీ.. ఆ చర్చలో కానీ.. ఇతర విషయాల్లో కానీ నేరుగా.. జోక్యం చే్సుకోలేదు.  చర్చకు యాంకర్‌గా వ్యవహరించిన రఘు అనే జర్నలిస్ట్‌ను ఏ -1 గా చేర్చి.. ఏ -2గా రేవతికిని చేర్చారు. ఇంత కాలం సైలెంట్‌గా ఉండి.. మోజో టీవీని బలవంతంగా చేజిక్కించుకున్న తర్వాత ఆమెను బయటకు పంపేసిన తర్వాత… ఆ కేసును బయటకు తీశారు. అరెస్ట్ చేశారు. కానీ నిబంధనల ప్రకారం.. పోలీసులు వ్యవహరించడం లేదు.

తాము తల్చుకుంటే ఏమైనా చేయగలమని నిరూపించాలనుకుంటున్నారా..? 

ఎన్నోకొన్ని రోజులు జైల్లోనో… లాకప్‌లోనో ఉంచడమే లక్ష్యంగా పోలీసులు కక్ష సాధిస్తున్నారనే ఆరోపణలు.. మీడియా వర్గాల నుంచి వస్తున్నాయి. అసలు రేవతిపై పెట్టిన కేసుకు .. కనీస సాక్ష్యాధారాలు కూడాలేవని.. రేవతితో పాటు పని చేసిన మోజో టీవీ వర్గాలు చెబుతున్నాయి. కనీసం .. ఆ చర్చా కార్యక్రమంలో ఫిర్యాదు చేసిన వ్యక్తిని కించ పరిచిన దృశ్యాలు కూడా లేవంటున్నారు. అయినప్పటికీ.. ఓ ఫిర్యాదు ఆధారంగా రేవతిని అరెస్ట్ చేసిన పోలీసులు… వీలైనంత ఎక్కువ కాలం జైల్లో ఉంచితే చాలు.. తమ లక్ష్యం నెరవేరుతుందన్నట్లుగా వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. తర్వాత కేసు నిలబడినా.. నిలబడకపోయినా.. తాము విధించిన శిక్షతో ఆమెను  భయపెట్టగలిగేలా చేయాలని అనుకుంటున్నట్లు చెబుతున్నారు. 

జర్నలిస్టు సంఘాలకు నోరెత్తాలంటే భయమా..? 

తెలంగాణలో పోలీసు రాజ్యం నడుస్తోందన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. స్వయంగా జర్నలిస్టులే వేధింపులకు గురవుతున్నా.. సాటి జర్నలిస్టులు కూడా… నోరు మెదపలేని స్థితి ఉంది. ఎక్కడ ప్రభుత్వ ఆగ్రహానికి గురి కావాల్సి వస్తుందోనని.. సమాజంలోని అన్ని వ్యవస్థలు భయడిపోతున్న సూచనలు కనిపిస్తున్నాయి. అందుకే చట్ట విరుద్ధంగా ఓ మహిళా జర్నలిస్టును అరెస్ట్ చేసి… వారం రోజులు గడిచినా.. చట్టప్రకారం చేయాల్సిన ప్రక్రియ చేయకుండా… ఆమెను జైల్లో ఉంచితే చాలన్నట్లుగా వ్యవహరిస్తున్నా…  ఆమెకు మద్దతుగా ఎవరూ నోరెత్తలేని పరిస్థితి కనిపిస్తోంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

రేపే చ‌ర‌ణ్ సినిమాకు కొబ్బ‌రికాయ్‌!

ఎట్ట‌కేల‌కు రామ్ చ‌ర‌ణ్ - బుచ్చిబాబు సినిమా పట్టాలెక్క‌బోతోంది. రేపు అంటే.. బుధ‌వారం హైద‌రాబాద్ లో ఈ చిత్రాన్ని లాంఛ‌నంగా ప్రారంభించ‌నున్నారు. ఈ ముహూర్తం వేడుక‌కు చిత్ర‌బృందంతో పాటు కొంత‌మంది ప్ర‌త్యేక అతిథులు...

అనుప‌మ్ ద‌ర్శ‌క‌త్వంలో కీర‌వాణి!

బాలీవుడ్ స్టార్ అనుప‌మ్ లో ఓ న‌టుడే కాదు, ద‌ర్శ‌కుడూ ఉన్నాడు. 2002లో ఓం జై జ‌గ‌దీష్ అనే చిత్రానికి ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు. ఆ త‌ర‌వాత ఇప్పుడు 22 ఏళ్ల త‌ర‌వాత మ‌ళ్లీ...

బెల్లంకొండ పాంచ్ ప‌టాకా!

బెల్లంకొండ సాయి శ్రీ‌నివాస్ య‌మ స్పీడుగా ఉన్నాడు. వ‌రుస‌గా సినిమాల్ని ప‌ట్టాలెక్కిస్తున్నాడు. 'టైస‌న్ నాయుడు' చిత్రీక‌ర‌ణ ద‌శ‌లో ఉంది. '30 రోజుల్లో ప్రేమించ‌డం ఎలా' ఫేమ్ మున్నాతోనూ ఓ సినిమా చేస్తున్నాడు. ఇప్పుడు...

చివరి క్షణం టిక్కెట్‌తో గుడివాడ అమర్నాథ్‌కు మరిన్ని కష్టాలు !

రాష్ట్ర ఐటీ మంత్రి గుడివాడ అమర్నాథ్‌కు అనూహ్య పరిణామాల మధ్య గాజువాక అసెంబ్లీ టికెట్ ఖాయమైంది. నియోజకవర్గంలో అడుగు పెట్టీ పెట్టగానే ఆయనకు స్థానిక నేతల నుంచి అసంతృప్తి సెగ తగిలింది. నియోజకవర్గంలో...

HOT NEWS

css.php
[X] Close
[X] Close