ఏపీ సింగిల్ డోస్ వ్యాక్సిన్‌కు కూడా ఆర్డర్ పెట్టలేదా..!?

ప్రమాదకరమైన వైరస్ దేశాన్ని వణికిస్తూంటే… వ్యాక్సినే సంజీవని అంటున్న ప్రభుత్వాలు.. తీవ్ర నిర్లక్ష్యాన్ని .. నిర్లిప్తతను ప్రదర్శిస్తున్న ఉదంతాలు తరచూ బయట పడుతున్నాయి. ప్రజలకు పంపిణీ చేయడానికి అటు కేంద్ర ప్రభుత్వం కానీ.. ఇటు ఏపీ సర్కార్ కానీ.. వ్యాక్సిన్ కోసం కంపెనీలకు ఆర్డర్ పెట్టలేదన్న విషయం బయటపడింది. దేశంలో నూట ముఫ్పై కోట్ల మంది జనాభా ఉంటే.. కేంద్రం ఇప్పటి వరకూ పన్నెండు కోట్ల డోసులను మాత్రమే కొనుగోలు చేసింది. దీనికి సంబంధించిన సంచలనాత్మక నివేదికను కొన్ని ఇంగ్లిష్ పత్రికలు ప్రకటించాయి. అయితే.. ఈ రిపోర్టులను కేంద్రం వెంటనే… ఖండించింది. జూలై వరకూ అసరమైన వ్యాక్సిన్‌ డోసులకు ఆర్డర్ పెట్టామని చెప్పుకొచ్చింది.

అయితే ఎంత పెట్టారు.. ఎంత మేర ప్రజలకు ఇస్తారన్న విషయంపై మాత్రం స్పష్టత ఇవ్వలేదు. ఇదే తరహాలో ఏపీలోనూ రాజకీయం నడుస్తోంది. ప్రజలందరికీ ఉచిత వ్యాక్సిన్ ఇచ్చేస్తున్నామని ప్రకటించిన ఏపీ సర్కార్.. ఇప్పటి వరకూ సొంతంగా సింగిల్ డోస్‌కు కూడా అడ్వాన్స్ కట్టలేదు.. ఆర్డర్ ఇవ్వలేదు. సీరం ఇనిస్టిట్యూట్… రష్యా వ్యాక్సిన్ తయారు చేస్తున్న రెడ్డిస్ ల్యాబ్స్‌తో పాటు కోవాగ్జిన్ ఉత్పత్తిదారు అయిన భారత్ బయోటెక్‌తోనూ..సీఎం జగన్ మాట్లాడినట్లుగా ఏపీ సర్కార్ వారి మీడియా విభాగం ప్రచారం చేసింది. కానీ అసలు విషయం ఏమిటంటే.. ఇప్పటి వరకూ ఒక్క డోస్‌కు కూడా.. ఆర్డర్ పెట్టలేదు. వ్యాక్సిన్ కంపెనీలేవీ.. ముందస్తుగా చెల్లింపులు లేకుండా డోసులు సరఫరా చేసే పరిస్థితి లేదు.

ఇప్పుడు అడ్వాన్స్ కడితే ఎప్పటికో డోసులు పంపిణీ చేస్తారు. అడ్వాన్సులు కట్టకపోతే… కట్టే అవకాశం కూడా లేదు. ఏపీ సర్కార్.. నిధుల కొరతతో ఉండటంతో.. కట్టే ఉద్దేశంలో కూడా లేనట్లుగా ఉంది. అందుకే సీఎం జగన్.. వ్యాక్సినేషన్‌కు ఫిబ్రవరి వరకూ పట్టొచ్చని చెబుతున్నట్లుగా తెలుస్తోంది. అయితే.. ఇప్పటికే వ్యాక్సిన్ పథకం పేరుతో ప్రభుత్వం విరాళాల సేకరణ ప్రారంభించింది. ఉద్యోగుల జీతాల్లోనుంచి ఒక్కో రోజు జీతం తీసుకునేందుకు సిద్ధమైంది. ఉద్యోగుల జీతాల్లో నుంచి ఇలా తీసుకునేందుకు సర్క్యూలర్ జారీ చేయడం వివాదాస్పదమయింది. ఎన్ని విరాళాలు సేకరించినా… అప్పటికి కేంద్రం ఇచ్చే డోసులు మాత్రమే వేస్తారని చెబుతున్నారు. మొత్తానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజలకు వ్యాక్సిన్ ఇచ్చి.. కరోనా నుంచి రక్షించే విషయంలో… బయట చెబుతున్నదానికి.. అసలు చర్యలకు .. చాలా తేడా ఉందని.. స్పష్టమవుతోంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

రేవంత్‌కు ఢిల్లీ పోలీసుల నోటీసులు – తెలంగాణపై దాడే !

ఓ సోషల్ మీడియా పోస్టు షేర్ చేసినందుకు ఢిల్లీ నుంచి వచ్చి పోలీసులు నోటీసులు ఇవ్వడాన్ని సీఎం రేవంత్ రెడ్డి.. తెలంగాణపై దాడిగా పేర్కొన్నారు. బీజేపీ విధానాలను ప్రశ్నించినందుకు తెలంగాణ ముఖ్యమంత్రికి,...

దేవగౌడ మనవడి రాసలీలలు – బీజేపీకి తలనొప్పి !

కర్ణాటకలో రాజకీయ నేతల రాసలీలల ఎపిసోడ్ లేకుండా ఎన్నికలు జరగవు. గతంలో అసెంబ్లీలోనే ఎమ్మెల్యేలు బ్లూ ఫిల్మ్‌ చూస్తూ దొరికిపోయారు. తర్వాత మంత్రిగా ఉండి రమేష్ జార్కిహోళి అనే నేత చేసిన...

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్‌పై ఏపీ వ్యాప్తంగా విస్తృత చర్చ

వైఎస్ జగన్ సర్కార్ ఇంప్లిమెంట్ చేసిన ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై ఏపీ వ్యాప్తంగా విస్తృత చర్చ జరుగుతోంది. ఏ గ్రామంలో చూసినా దీనిపైనే చర్చ. పట్టణ ప్రాంతాల్లో రాజకీయ అవగాహన ఉన్న...

కొన్ని చోట్ల స్వతంత్రులకు గాజు గ్లాస్ గుర్తు – ఈసీ ఆదేశాలపై గందరగోళం !

ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో ఎన్నికల సంఘం నిర్దిష్టమైన ఆదేశాలపై రిటర్నింగ్ అధికారులకే స్పష్టత లేకపోవడంతో ఎక్కడికక్కడ గందరగోళం ఏర్పడుతోంది. నామినేషన్ల ఉపసంహరణ గడువు ముగియడంతో స్వతంత్రులకు రిటర్నింగ్ అధికారులు గుర్తులు కేటాయింటారు. ఫ్రీ సింబల్స్...

HOT NEWS

css.php
[X] Close
[X] Close