మిని మున్సిపల్ ఎన్నికలతో టీఆర్ఎస్ క్లీన్ స్వీప్ పూర్తి..!

తెలంగాణలో జరిగిన మినీ మున్సిపల్ ఎన్నికల్లో టీఆర్ఎస్ జోరు కొనసాగింది. రెండు కార్పొరేషన్లు.. ఐదు మున్సిపాలిటీలలో జరిగిన ఎన్నికల్లో అన్ని చోట్లా.. టీఆర్ఎస్‌నే విజయం సాధించింది. వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్‌లో బీజేపీ కాస్త పోటీ ఇచ్చింది. మొత్తం 66 డివిజిన్లు ఉన్న కార్పొరేషన్‌లో.. టీఆర్ఎస్ 50 వరకూ గెలుచుకోనుంది. బ్యాలెట్లతో ఓటింగ్ జరగడంతో కౌంటింగ్ నెమ్మదిగా సాగుతోంది. ట్రెండ్స్‌ను బట్టి… టీఆర్ఎస్కు యాభై కార్పొరేటర్ల బలం చేకూరే అవకాశం ఉంది. ఖమ్మం కార్పొరేషన్‌లోనూ టీఆర్ఎస్ హవా కనిపిస్తోంది.

అయితే అక్కడ కాంగ్రెస్ కాస్త గట్టి పోటీ ఇస్తోంది. అరవై స్థానాలున్న ఖమ్మం కార్పొరేషన్‌లో టీఆర్ఎస్ నలభై వరకూ గెలుచుకునే అవకాశం ఉంది. ఇప్పటికే ముఫ్పై స్థానాలకు పైగా ఆధిక్యంలో ఉన్నారు. మంత్రి పువ్వాడ అజయ్.. వ్యక్తిగత ప్రతిష్టగా తీసుకుని ఎన్నికల కోసం పని చేశారు. ఇక ఎన్నికలు జరిగిన ఐదు మున్సిపాల్టీలు అయిన సిద్దిపేట, జడ్చర్ల, అచ్చంపేట, కొత్తూరు, నకిరేకల్ మున్సిపాలిటీల్లో టీఆర్ఎస్ ఏకపక్ష విజయాలను నమోదు చేసింది.

అచ్చంపేట, కొత్తూరులో మాత్రం కాంగ్రెస్ కాస్త పోటీ ఇచ్చింది. మినీ మున్సిపల్ ఎన్నికలపై సీఎం కేసీఆర్ కూడా.. ప్రత్యేకంగా దృష్టి పెట్టారు. కరోనా వచ్చి ఐసోలేషన్‌లో ఉన్నప్పటికీ.. పార్టీ నేతలకు ఎప్పటికప్పటికి దిశానిర్దేశం చేశారు. అన్ని చోట్లా.. ఏకపక్ష ఫలితాలు సాధించడంతో.. బీజేపీ .. ఒక్క వరంగల్‌లో తప్ప.. ఎక్కడా కాస్త కూడా ప్రభావం చూపకపోవడంతో… కేసీఆర్ మిషన్ పూర్తయినట్లయింది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

రేవంత్‌కు ఢిల్లీ పోలీసుల నోటీసులు – తెలంగాణపై దాడే !

ఓ సోషల్ మీడియా పోస్టు షేర్ చేసినందుకు ఢిల్లీ నుంచి వచ్చి పోలీసులు నోటీసులు ఇవ్వడాన్ని సీఎం రేవంత్ రెడ్డి.. తెలంగాణపై దాడిగా పేర్కొన్నారు. బీజేపీ విధానాలను ప్రశ్నించినందుకు తెలంగాణ ముఖ్యమంత్రికి,...

దేవగౌడ మనవడి రాసలీలలు – బీజేపీకి తలనొప్పి !

కర్ణాటకలో రాజకీయ నేతల రాసలీలల ఎపిసోడ్ లేకుండా ఎన్నికలు జరగవు. గతంలో అసెంబ్లీలోనే ఎమ్మెల్యేలు బ్లూ ఫిల్మ్‌ చూస్తూ దొరికిపోయారు. తర్వాత మంత్రిగా ఉండి రమేష్ జార్కిహోళి అనే నేత చేసిన...

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్‌పై ఏపీ వ్యాప్తంగా విస్తృత చర్చ

వైఎస్ జగన్ సర్కార్ ఇంప్లిమెంట్ చేసిన ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై ఏపీ వ్యాప్తంగా విస్తృత చర్చ జరుగుతోంది. ఏ గ్రామంలో చూసినా దీనిపైనే చర్చ. పట్టణ ప్రాంతాల్లో రాజకీయ అవగాహన ఉన్న...

కొన్ని చోట్ల స్వతంత్రులకు గాజు గ్లాస్ గుర్తు – ఈసీ ఆదేశాలపై గందరగోళం !

ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో ఎన్నికల సంఘం నిర్దిష్టమైన ఆదేశాలపై రిటర్నింగ్ అధికారులకే స్పష్టత లేకపోవడంతో ఎక్కడికక్కడ గందరగోళం ఏర్పడుతోంది. నామినేషన్ల ఉపసంహరణ గడువు ముగియడంతో స్వతంత్రులకు రిటర్నింగ్ అధికారులు గుర్తులు కేటాయింటారు. ఫ్రీ సింబల్స్...

HOT NEWS

css.php
[X] Close
[X] Close