సన్నబియ్యం ఇస్తామని మేనిఫెస్టోలో చెప్పలేదు : జగన్

అసెంబ్లీలో రెండో రోజు.. ప్రశ్నోత్తరాల సమయంలో సన్నబియ్యం అంశం డామినేట్ చేసింది. ఏపీ సర్కార్ ప్రజలకు సన్న ఇస్తామని చెప్పి ఇవ్వలేదని టీడీపీ నేతలు ఆరోపించారు. దీనికి సీఎం జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వ వాదన వినిపించారు. అసలు సన్నబియ్యం ఇస్తామని.. తాము మేనిఫెస్టోలో పెట్టలేదని గుర్తు చేశారు. మేనిఫెస్టోను ఆయన అసెంబ్లీలో ప్రదర్శించారు. ఎక్కడా సన్నబియ్యం ఇస్తామన్న హామీ లేదని… స్పష్టం చేశారు. కావాలంటే.. టీడీపీ నేతలు కళ్లజోళ్లు సర్దుకుని.. మేనిఫెస్టోను ఓ సారి చూడాలని సలహా ఇచ్చారు. అయితే.. తాము మేనిఫెస్టోలో పెట్టకపోయినప్పటికీ.. ప్రజలకు మంచి చేయాలన్న ఉద్దేశంతోనే… నాణ్యమైన బియ్యం సరఫరా చేయాలనుకున్నామని.. ఆ మేరకు శ్రీకాకుళం జిల్లాలో పైలట్ ప్రాజెక్టుగా అమలు చేస్తున్నామని స్పష్టం చేశారు. సన్నబియ్యం ఇస్తామని ఎక్కడా చెప్పలేదన్నారు.

సన్నబియ్యం అన్న పేరే లేదని.. జగన్మోహన్ రెడ్డి తేల్చారు. బియ్యం గురించి తెలుసుకుని.. నాలెడ్జ్ పెంచుకోవాలని.. జగన్ టీడీపీ సభ్యులకు సూచించారు. తాము వచ్చే ఏప్రిల్‌కు.. రాష్ట్రం మొత్తం నాణ్యమైన బియ్యం ఇస్తామని శ్రీకాకుళంలో.. బియ్యం పథకం ప్రారంభోత్సవ సమయంలో.. జగన్ చేసిన ప్రసంగాన్ని అసెంబ్లీలో ప్రదర్శించారు. సన్నబియ్యం ఇస్తామని తాము చెప్పామంటూ.. టీడీపీ నేతలు చేస్తున్న ఆరోపణల్ని జగన్ తోసి పుచ్చారు. సాక్షిలో వచ్చిందంటూ.. టీడీపీ సభ్యులు అరుస్తూండటంతో… ఆ విషయంపైనా జగన్ వివరణ ఇచ్చారు. టీడీపీ సభ్యులు పొరపడినట్లే.. సాక్షి పత్రిక సిబ్బంది కూడా.. నాణ్యమైన బియ్యానికి బదులు సన్నబియ్యం అని రాశారని వివరించారు.

సన్నబియ్యం విషయంలో ప్రభుత్వం గతంలో తాము చేసిన ప్రకటనలకు..తమకు కావాల్సిన అర్థమే తీసుకుంటోందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. మొదటి కేబినెట్ సమావేశంలో… సెప్టెంబర్ నుంచి రేషన్ కార్డులపై సన్నబియ్యం పంపిణీ చేయాలని నిర్ణయం తీసుకున్నారు. ఆ తర్వాత అనేక సార్లు పౌరసరఫరాల మంత్రి కొడాలి నాని కూడా.. అదే విషయాన్ని ప్రకటించారు. జగన్మోహన్ రెడ్డి పాదయాత్రలో కూడా సన్నబియ్యం ఇస్తామని చెప్పారు. తీరా అమలు చేసే సమయానికి ఇబ్బందులు వచ్చాయి. ఆ విషయాన్ని నేరుగా చెప్పి… నాణ్యమైన బియ్యాన్ని ఇస్తామని ప్రకటిస్తే.. సరిపోయేది కానీ.. అసలు సన్నబియ్యం హామీ ఇవ్వలేదనే… వాదన ప్రారంభించడంతో.. టీడీపీ దీన్నో అస్త్రంగా మార్చుకుంది. పదే పదే హైలెట్ చేస్తూ.. ప్రజల దృష్టిలో పెడుతోందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

మా రాష్ట్రానికి రండి… రేవంత్ కోసం 7 రాష్ట్రాల రిక్వెస్ట్!

గెల‌వ‌టం అసాధ్య‌మ‌నుకున్న తెలంగాణ‌లో పార్టీని గెలిపించిన సీఎం రేవంత్ రెడ్డికి... ఇత‌ర రాష్ట్రాల నుండి మా రాష్ట్రానికి రండి అంటూ ఇన్విటేష‌న్లు వ‌స్తున్నాయి. మా రాష్ట్రంలో తెలుగు వారున్నారు మీరు రండి అంటూ...

నేల దిగిన విక్ర‌మ్‌… ఈసారి కొట్టేస్తాడేమో..?!

విక్ర‌మ్ న‌టుడిగా ఎప్పుడూ ఫెయిల్ కాలేదు. ప్ర‌తీసారీ ఏదో ఓ రూపంలో కొత్త‌ద‌నం ఇవ్వాల‌నే ప్ర‌య‌త్నం చేస్తూనే ఉంటాడు. అదే త‌న ప్ల‌స్సు, అదే మైన‌స్సు కూడా. మితిమీరిన ప్ర‌యోగాల‌తో చేతులు కాల్చుకోవ‌డం...

మోత్కుపల్లి ఏ పార్టీలో ఉన్నా అంతే !

మోత్కుపల్లి నరసింహులు కాంగ్రెస్ పార్టీపై అసంతృప్తి వ్యక్తం చేశారు. కాంగ్రెస్‌లో మాదిగలకు అన్యాయం జరుగుతోందని.. మఖ్యమంత్రి రేవంత్ తప్పు చేస్తున్నారని తెరపైకి వచ్చారు. ఒక రోజు దీక్ష చేస్తానని ప్రకటించారు. నిజానికి మోత్కుపల్లి...

తగ్గేదేలే – తోట త్రిమూర్తులే అభ్యర్థి !

దళితుల శిరోముండనం కేసులో దోషిగా తేలి జైలు శిక్షకు గురైన మండపేట వైసీపీ అభ్యర్థి తోట త్రిముర్తులకు జగన్ అభయం ఇచ్చారు. జైలు శిక్ష పడినా అభ్యర్థి ఆయనేనని స్పష్టం చేయడంతో ...

HOT NEWS

css.php
[X] Close
[X] Close