ఒకే వేదికపై జగన్, చంద్రబాబు .. కానీ !

రాజ్‌భవన్‌లో గవర్నర్‌ బిశ్వభూషన్ హరిచందన్‌ ఏర్పాటుచేసిన ఎట్‌హోమ్‌ కార్యక్రమానికి సీఎం జగన్ తో పాటు ప్రతిపక్ష నేత చంద్రబాబు కూడా హాజరయ్యారు. ఈ కార్యక్రమానికి హైకోర్టు చీఫ్‌ జస్టిస్‌ ప్రశాంత్‌ కుమార్‌ మిశ్రా, సీఎస్‌ సమీర్‌ శర్మ, డీజీపీ రాజేంద్రనాథ్‌రెడ్డి, హైకోర్టు న్యాయమూర్తులు హాజరయ్యారు. అసెంబ్లీ మినహా… జగన్ , చంద్రబాబు ఒకే వేదికపై ఎప్పుడూ కనిపించలేదు. చాలా సందర్భాల్లో జగనే ఎవాయిడ్ చేశారు అయితే ఎట్ హోంలోనూ వారు ముక్తసరిగా పలకరించుకున్నట్లుగా తెలుస్తోంది.

ఒకప్పుడు చంద్రబాబు, దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి కలిస్తే… రాజకీయాలు ఎలా ఉన్నా, అప్పటికి ఆహ్లాదకర వాతావరణమే ఉండేది. ఇరువురు నేతల మధ్య ఆసక్తికర సంభాషణలు చోటుచేసుకొనేవి. జగన్ హయాంలో ఆ పరిస్థితి కనిపించడం లేదు. ఉప్పు-నిప్పు అన్నట్లుగానే పరిస్థితులు ఉన్నాయి. గత వారం దిల్లీలో జరిగిన అమృత్ మహోత్సవ్ కమిటీ భేటీలో జగన్ పాల్గొనాల్సి ఉన్నా… చంద్రబాబు మాత్రమే హాజరయ్యారు. జగన్ హాజరు కాలేదు.

అక్కడే ఉన్నప్పటికీ హాజరు కాలేదు. మరుసటి రోజు జరిగిన నీతి అయోగ్ సమావేశంలో మాత్రం పాల్గొన్నారు. కేవలం చంద్రబాబు హాజరవుతున్నారనే జగన్ హాజరు కాలేదని అంతా భావించారు. రాజ్ భవన్‌కు మాత్రం ఇద్దరు నేతలూ హాజరయ్యారు. అయితే హైకోర్టు సీజే సహా అనేక మంది ప్రముఖులు హాజరు కావడంతో వ్యక్తిగతంగా మాట్లాడుకునే సందర్భం ఎదురు కాలేదు. పలకరింపులకే పరిమితమైనట్లుగా తెలుస్తోంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

మంత్రి బుగ్గన సిబ్బంది బెదిరింపులు…మహిళ సూసైడ్..!?

ఏపీ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ సిబ్బంది అత్యుత్సాహం ఓ మహిళా నిండు ప్రాణాన్ని బలిగొన్నాయి.కనీస మానవత్వం చూపకుండా బెదిరింపులకు దిగడంతో ఓ నిరుపేద మహిళా ఉరేసుకొని ఆత్మహత్య చేసుకుంది. కోనసీమ జిల్లా కొత్తపేటకు...

మేనిఫెస్టో మోసాలు : జాబ్ క్యాలెండర్, మెగా డీఎస్సీ ఏది బ్రో !

చంద్రబాబునాయుడు నిరుద్యోగ యువత కోసం నిరుద్యోగ భృతి పథకం పెట్టి.. భృతి ఇచ్చి.. ఇలా భృతి తీసుకునేవాళ్లకు ట్రైనింగ్ ఇచ్చి ఎప్పటికప్పుడు ఉద్యోగాలిచ్చేలా వ్యవస్థను సృష్టిస్తే.. జగన్ ెడ్డి ఏపీకి...

అప్రూవర్ గా శరత్ చంద్రారెడ్డి…కవితకు బెయిల్ దక్కేనా..?

ఢిల్లీ మద్యం కుంభకోణంలో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసులో ఈడీ అధికారుల వద్ద అప్రూవర్ గా మారిన శరత్ చంద్రారెడ్డి తాజాగా సీబీఐ అధికారుల ముందు కూడా అప్రూవర్...

సూప‌ర్ హిట్ ల‌వ్ స్టోరీకి సీక్వెల్ కూడా!

ఈమ‌ధ్య సీక్వెల్ క‌థ‌ల జోరు ఎక్కువ‌గా క‌నిపిస్తోంది. అయితే యాక్ష‌న్‌, క్రైమ్‌, థ్రిల్ల‌ర్‌, హార‌ర్ చిత్రాల‌కు సీక్వెల్ చూశాం. ఇప్పుడు ల‌వ్ స్టోరీల్లోనూ ఆ ట్రెండ్ మొద‌లైపోయింది. ఇటీవ‌ల మ‌ల‌యాళంలో సూప‌ర్ హిట్...

HOT NEWS

css.php
[X] Close
[X] Close