కర్నూలు రైతులకు అమరావతిని తలదన్నే ఆఫర్ – కానీ జగన్‌ను నమ్ముతారా ?

ఎకరం పొలం లీజుకు ఇస్తే ఏటా రూ. 30వేల రూపాయలు ఇస్తారు. పది ఎకరాలిస్తే .. మూడు లక్షల రూపాయలిస్తారు. ఎవరో కాదు ప్రభుత్వమే. లీజు పరిమితి ముగిశాక ఎవరి భూములు వారికే.. ఇది మామూలు ఆఫర్ కాదు. ఈ ఆఫర్ ఇచ్చింది జగన్మోహన్ రెడ్డి. కర్నూలులో రామ్ కో సిమెంట్ కొత్త ప్లాంట్ ను జగన్ ప్రారంభించారు. సందర్భం లేకపోయినా ఆయన పొలాల లీజు గురించి మాట్లాడారు. ఎకరానికి ముఫ్ఫై వేలు ఇవ్వడమే కాకుండా మూడేళ్లకోసారి ఐదు శాతం లీజు పెంచుతుందని చెబుతున్నారు.

ఈ భూములన్నీ ప్రభుత్వం తీసుకుని ఏం చేస్తుందంటే… సంప్రదాయేతర ఇంధన విద్యుత్ సంస్థలకు ఇస్తుంది. వారు ఆ పొలాల్లో ప్లాంట్లు ఏర్పాటు చేస్తారు. టవర్లు ఏర్పాటు చేసి విద్యుత్ ఉత్పత్తి చేస్తారు. కర్నూలులో విండ్ పవర్ ఏర్పాటుకు చాలా సంస్థలు ముందుకు వస్తున్నాయి. ముఖ్యంగా ఇటీవలి కాలంలో జగన్ పదివేల మెగావాట్లకు ఒప్పందాలు చేసుకుంటున్నారు. ఆయన సన్నిహితుల కంపెనీైలు అందులో ఉన్నాయి. వాటికి భూమి కొరత ఉంది. ప్రైవేటు కంపెనీలకు భూ సేకరణ భారం కాబట్టి .. ప్రభుత్వమే రంగంలోకి దిగుతోంది.

స్వాధీనం చేసుకోవడం క్లిష్టమైన విషయం కాబట్టి రైతులకు సీఎం జగన్ లీజు ఆఫర్ ఇచ్చారు. ఎకరానికి ముఫ్పై వేలు.. మూడేళ్లకు ఐదు శాతం పెంపుదల ఆఫర్ ఆకర్షణీయంగానే ఉందన్న అభిప్రాయం వినిపిస్తోంది. అయితే భూములు ఒక సారి ప్రభుత్వం చేతుల్లోకి అక్కడ్నుంచి విద్యుత్ కంపెనీల చేతుల్లోకి వెళ్లిన తర్వాత తిరిగి రావడం అసాధ్యం. ప్రభుత్వం కౌలు ఇవ్వకపోతే చేయగలిగిందేమీ ఉండదు. ఇప్పుడు ప్రభుత్వంపై నమ్మకం ఉంటేనే ఇలాంటి ఆఫర్లు వర్కవుట్ అవుతాయి. కానీ జగన్ ను నమ్మే పరిస్థితి ఉందా అనేది కీలకం.

ఇప్పటికే అక్కడి రైతులు భూములు ఇచ్చేది లేదంటున్నారు. అందుకే ప్రజాప్రతినిధులు చొరవ తీసుకోవాలని జగన్ కోరుతున్నారు. కానీ నమ్మకం లేని చోట.. సాధ్యం కాదనే ఎక్కువ మంది భావన.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

‘టిల్లు స్వ్కేర్’ రివ్యూ: మ్యాజిక్ రిపీట్స్

Tillu Square movie review తెలుగు360 రేటింగ్ : 3/5 కొన్ని పాత్ర‌లు, టైటిళ్లు... ఆయా న‌టీన‌టుల కెరీర్‌ల‌కు బ్రాండ్ అంబాసిడ‌ర్లుగా మారిపోతుంటాయి. 'డీజే టిల్లు' అలాంటిదే. ఈ సినిమా 'మామూలు' సిద్దు జొన్న‌ల‌గ‌డ్డ‌ని 'స్టార్...

ప్రభాకర్ రావు వచ్చాకే అసలు ట్యాపింగ్ సినిమా !

ఫోన్‌ట్యాపింగ్‌ కేసులో నిందితులైన హైదరాబాద్‌ మాజీ టాస్క్‌ఫోర్స్‌ డీసీపీ రాధాకిషన్‌రావును గురువారం రాత్రి పోలీసులు అరెస్ట్‌ చేశారు. ఆయన గట్టు మల్లును ఇన్స్‌పెక్టర్ ను పెట్టుకుని ఓ మాఫియా నడిపారని...

డేరింగ్ అండ్ డాషింగ్ కేజ్రీవాల్

అవినీతి వ్యతిరేక ఉద్యమం చేసి వచ్చి అవినీతి కేసులో అరెస్టు అయ్యాడన్న ప్రచారం చేస్తున్నారు. సామాన్యుడు కాదు లంచగొండి అని గట్టిగా ప్రజల మైండ్లలోకి ఎక్కించే ప్రయత్నం చేస్తున్నారు. తన సీఎం...

విజయవాడ వెస్ట్ రివ్యూ : సుజనా చౌదరి నమ్మకమేంటి ?

ఏపీలో పొత్తుల్లో భాగంగా బీజేపీకి వెళ్లిన నియోజకవర్గం విజయవాడ వెస్ట్. అక్కడ్నుంచి అభ్యర్థిగా సుజనా చౌదరిని ఖరారు చేయడంతో కూటమిలోని పార్టీలు కూడా ఒప్పుకోక తప్పలేదు. నిజానికి అక్కడ జనసేన...

HOT NEWS

css.php
[X] Close
[X] Close