దసరా రోజు కేసీఆర్ జాతీయ పార్టీ పేరు ప్రకటన !

పరిస్థితులు కలిసి రాకపోయినా ముందుకే వెళ్లాలని కేసీఆర్ భావిస్తున్నారు. తెలంగాణలో కాకుండా ఇతర రాష్ట్రాల్లో భారీ బహిరంగసభ పెట్టి పార్టీ ప్రకటన చేయాలనుకున్న ఆయనకు ఏదీ కలసి రావడం లేదు. దీంతో మంచి రోజు అని విజయదశమి రోజున పార్టీ పేరు మాత్రం ప్రకటించాలని నిర్ణయించుకున్నారు. ఈ మేరకు దసరా రోజు మధ్యాహ్నం 1.19 నిమిషాలకు కేసీఆర్ జాతీయ పార్టీ ప్రకటన చేయాలని పండితులతో ముహుర్తం ఖరారు చేయించుకున్నట్లుగా టీఆర్ఎస్ వర్గాలు చెబుతున్నాయి.

అదే రోజున టీఆర్ఎస్ఎల్పీ భేటీ నిర్వహిస్తారు. అందరి ఆమోదంతో జాతీయ పార్టీ ప్రకటించనున్నారు. ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీల ఏకాభిప్రాయం మేరకు… పార్టీ ప్రకటన ఉంటుంది. ఇప్పటికే టీఆర్ఎస్ జిల్లా పార్టీల అధ్యక్షులు కేసీఆర్ జాతీయ రాజకీయాల్లోకి వెళ్లాలని స్వయంగా తీర్మానాలు చేశారు. ఇప్పటికే పలువురు మంత్రులు కీలక నేతలు.., కేసీఆర్ నాయకత్వం దేశానికి అవసరమని ప్రకటనలు చేస్తున్నారు. గతంలో జాతీయ నేతలందర్నీ పిలిచి కనీ వినీ ఎరుగని రీతిలో బహిరంగసభ నిర్వహించి జాతీయ పార్టీ ప్రకటన చేయాలనుకున్నారు కేసీఆర్. అయితే ఈ సారి పార్టీ పరమైన ప్రకటన మాత్రం ముహుర్తం ప్రకారం చేసి ఆ తర్వాత బహిరంగసభ నిర్వహించాలని ఆలోచిస్తున్నారు.

జాతీయ రాజకీయాల్లోకి వెళ్లాలని కేసీఆర్ చాలా కాలంగా ప్రయత్నిస్తున్నారు. ముందుగా ప్రాంతీయ పార్టీలన్నింటితో కూటమి కట్టడం ద్వారా ఆయన ఢిల్లీ రాజకీయాలు చేయాలనుకున్నారు. కానీ ప్రాంతీయ పార్టీల నేతలు తమ తమ రాష్ట్రాల్లో.. తమ పార్టీల ప్రయోజనాల పరంగా చూసుకుని ఎక్కువగా జాతీయ పార్టీలతో కలిసేందుకే మొగ్గు చూపుతున్నాయి. దీంతో కేసీఆర్ రైతు సంఘాల నాయకులతను రాజకీయాల్లోకి తెచ్చి .. జాతీయ పార్టీ ప్రకటన చేయాలని అనుకుంటున్నారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ఆ స్థానాల్లో ఇద్దరేసి అభ్యర్థులకు బీజేపీ బీ ఫాం..!?

పార్లమెంట్ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకున్న బీజేపీ వ్యూహాత్మకంగా ముందుకు సాగుతోంది.పోటీ చేసే అభ్యర్థులకు గెలుపు వ్యూహాలను చేరవేస్తూనే..మరోవైపు పార్టీ పరంగా ఎలాంటి వ్యూహాలను అనుసరించాలో అన్నింటిని పక్కా ప్లాన్ తో అమలు చేస్తోంది....

కేసీఆర్ బస్సులో లిఫ్ట్.. ఎంట్రీ వేరే లెవల్..!!

బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ వినియోగిస్తోన్న బస్సు అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. కేసీఆర్ సౌలభ్యం కోసం బస్సును కొత్త టెక్నాలజీతో అప్డేట్ చేయడంతో బస్సు డిజైన్ ఆకట్టుకుంటోంది. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు ముగిసాక కేసీఆర్...

రియల్లీ గ్రేట్..50 మందిని కాపాడిన బాలుడు

రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ లోని ఫార్మా కంపెనీ అగ్ని ప్రమాద ఘటనలో ఓ బాలుడి సాహసం 50మందిని ప్రాణాపాయం నుంచి కాపాడింది. భారీగా మంటలు ఎగిసిపడటంతో ప్రమాదంలో చిక్కుకొని ఆపన్నహస్తం కోసం...

పిఠాపురంపైకి అసాంఘిక శక్తుల దండయాత్ర !

ఒక్కడిని ఒక్కరంటే ఒక్కర్ని ఓడించడానికి అన్ని రకాల మాఫియాల్ని రంగంలోకి దించుతోంది వైసీపీ. విచ్చలవిడిగా డబ్బులు ఖర్చుపెట్టడమే కాదు.. నకిలీ మద్యంతో ముంచెత్తుతున్నారు. బయట నుంచి ఎర్ర చందనం స్మగ్లర్లు,...

HOT NEWS

css.php
[X] Close
[X] Close