మంత్రివర్గానికి ఆరు నెలలు ఎక్స్‌టెన్షన్ !?

జగన్ పదవి చేపట్టి రెండున్నరేళ్లయింది. మంత్రి పదవులు ఇచ్చినప్పుడే అందరికీ రెండున్నరేళ్లే పదవి కాలం అని చెప్పారు. ఇప్పుడు రెండున్నరేళ్లయింది. మామూలుగా అయితే కొత్త టీమ్ వర్క్ ప్రారంభించాల్సి ఉంది.కానీ జగన్ ఇంకా అలాంటి నిర్ణయం తీసుకోలేదు. అంతర్గతంగా ఏమైనా తీసుకున్నారేమో స్పష్టతలేదు. తీసుకుంటే మాత్రం నేడో రేపో లేకపోతే గవర్నర్ ఆస్పత్రి నుంచి రాగానే కొత్త టీం ప్రమాణస్వీకారం చేస్తుంది. కానీ అలాంటి సూచనలేమీ కనిపించడం లేదని… వైసీపీలోని కొంత మంది ముఖ్యులు కూడా తమ నేతలకు చెబుతున్నారు. ప్రస్తుతం ఉన్న మంత్రులకు మరో ఆరు నెలల పొడిగింపు ఇచ్చారని అంటున్నారు.

కొద్ది రోజుల కిందట మంత్రి వర్గ సమావేశంలోనే జగన్ కేబినెట్ ప్రక్షాళన గురించి చెప్పారు. వంద శాతం మంత్రుల్ని తొలగిస్తున్నట్లుగా చెప్పారు. ఈ విషయాన్ని మీడియాకు కూడా లీక్ చేయాలని మంత్రి బాలినేనికి కూడా సూచనలు ఇచ్చారు. ఆ ప్రకారం ఆయన మీడియాకు కూడా లీక్ చేశారు. కానీ ఇప్పుడు కసరత్తు ఎక్కడి వరకు వచ్చిందో మాత్రం స్పష్టత లేదు. నలుగురు ఐదుగురు మంత్రులు వివాదాల్లో ఇరుక్కున వారిని పక్కన పెడితే… హైకమాండ్ ఏది చెబితే అది చేయడానికి వెనుకాడని వీర విధేయ మంత్రులు ఉన్నారు. దేనికంటే దేనికైనా సరే వెనుకాడబోమని చెబుతున్నారు. వారి విధేయతను కాదనగలమా అన్న అనుమానం వైసీపీ పెద్దల్లో ఉంది.

అలాగే సీనియర్లను కూడా పక్కన పెట్టలేని పరిస్థితి. అలా అని కొంత మందిని ఉంచి కొంత మందిని తీసేస్తే తేడా వస్తుంది. ఈ సమీకరణాలన్నింటినీ కవర్ చేసుకోవడానికి సీఎం జగన్ మరో ఆరు నెలల సమయం తీసుకోవాలని భావిస్తున్నారని అంటున్నారు. అయితే ఆయనకు రాత్రికి రాత్రి మార్చేయాలని అనిపిస్తే.. తర్వాత రోజు ఉదయం మారిపోతుంది. అందులో సందేహం లేదు. ఇప్పటికైతే.. ఆ ఆలోచన లేదని.. అందుకే రెండున్నరేళ్లు గడిచినా …సైలెంట్‌గానే ఉన్నారని అంటున్నారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

కేకేను తిట్టి పంపించిన కేసీఆర్

రాజ్యసభ ఎంపీ కేకే, ఆయన కుమార్తె హైదరాబాద్ మేయర్ విజయలక్ష్మి శనివారం కాంగ్రెస్ పార్టీలో చేరాలని నిర్ణయించుకున్నారు. తనను పార్టీలో చేర్చుకుని రెండు సార్లు రాజ్యసభ సీటు ఇచ్చిన కేసీఆర్ కు ఓ...

అవినాష్ రెడ్డికి ఎన్నికల ముందే బెయిల్ రద్దు గండం ?

అవినాష్ రెడ్డి బెయిల్ రద్దు చేయాలని అప్రూవర్ గా మారిన దస్తగిరికి పిటిషన్ వేసే హక్కు ఉందని హైకోర్టు స్పష్టం చేసింది. దీంతో ఆయన వేసిన పిటిషన్‌పై విచారణ జరగనుంది. ఏప్రిల్...

‘ఆడు జీవితం’ రివ్యూ: ఎడారి పాలైన బ్రతుకుల వ్యధ

ఫారిన్ చిత్రాలతో పోల్చుకుంటే భారతీయ చిత్రాలలో సర్వైవల్ థ్రిల్లర్స్ తక్కువే. అయితే ఈ మధ్య కాలంలో మలయాళ పరిశ్రమ ఈ జోనర్ పై ప్రత్యేక దృష్టి పెట్టింది. '2018' చిత్రం ఆస్కార్ నామినేషన్స్...

అనపర్తిలో ఆందోళన… నల్లమిల్లి దారెటు..?

అవును ప్రచారమే నిజమైంది. అనపర్తి సీటు టీడీపీ నుంచి బీజేపీ ఖాతాలోకి వెళ్ళిపోయింది. పొత్తులో భాగంగా బీజేపీ నేత ములగపాటి శివ కృష్ణంరాజుకి కేటాయించారు. దీంతో టీడీపీ టికెట్ ఆశించిన మాజీ...

HOT NEWS

css.php
[X] Close
[X] Close