మళ్లీ ఎప్పుడైనా ఢిల్లీకి జగన్.. సిగ్నల్ రావాలంతే !

ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి మళ్లీ ఢిల్లీ పర్యటనకు వెళ్లేందుకు సిద్దమవుతున్నారు. ఢిల్లీ నుంచి సిగ్నల్ రాగానే ఆయన ప్రత్యేక విమానం గన్నవరం నుంచి బయలుదేరుతుంది. సీఎం జగన్ ఢిల్లీ పర్యటనకు వెళ్తే ప్రధానంగా అమిత్ షాతో భేటీకే ఫస్ట్ ప్రయారిటీ ఇస్తారు. ఆతర్వాతే ప్రధాని మోడీ . అయితే ఈ సారి ప్రధాని మోడీ అపాయింట్‌మెంట్ దొరికింది కానీ… అమిత్ షాది దొరకలేదు. రెండురోజుల పాటు ఎదురు చూసి స్పందన లేకపోవడంతో వెనక్కి తిరిగి వచ్చేశారు. అమిత్ షా కార్యాలయం నుంచి అపాయింట్‌మెంట్ సంకేతాలు రాగానే మళ్లీ ఢిల్లీ వెళ్లాలని నిర్ణయించుకున్నారు.

ఢిల్లీలో ఎంత మంది కేంద్రమంత్రుల్ని కలిసినా అమిత్ షా చెప్పకపోతే పని కాదన్న అభిప్రాయం ఇప్పటికే అందరిలో ఉంది. అదినిజం కూడా . కీలకమైన అంశాల్లో అమిత్ షా నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది. ప్రధానమంత్రి కూడా అన్ని విషయాల్లో జోక్యం చేసుకోరు. ఆయన కూడా అమిత్ షాను కలవమనే చెబుతారు. అందుకే ఢిల్లీ పర్యటన అసంపూర్తిగానే ఉందని జగన్ భావిస్తున్నట్లుగా తెలుస్తోంది. తాను ఢిల్లీ పర్యటనకు వెళ్లి అప్పులకు అనుమతి విషయంలో తాత్కాలికంగా సక్సెస్ అయ్యారు.

కానీ ఈ మూడు నెలలకు తాము ప్రతిపాదించిన మొత్తం అప్పులు తీసుకునేలా ఒప్పించడానికి ప్రయత్నించాల్సి ఉంది. తాత్కలికంగా రెండున్నర వేల కోట్లు అప్పు పుట్టించగలిగారు కానీ..తర్వాత అనుమతి రాకపోతే ఇబ్బందికరం అవుతుంది. అందుకే జగన్ ఢిల్లీ వెళ్లి అమిత్ షాను కలిసి సమస్యను పరిష్కరించుకోవాలని అనుకుటున్నారు. అయితే అమిత్ షా సమయం ఇస్తారా లేదా అన్నదానిపై మాత్రం ఇంకా స్పష్టత రాలేదు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

సీఐ అంజూ యాదవ్‌నూ సాగనంపారు !

తిరుపతిలో అత్యంత వివాదాస్పదమైన మహిళా సీఐ అంజూ యాదవ్ ను కూడా ఈసీ సాగనంపింది. పోలింగ్ రోజు ఎట్టి పరిస్థితుల్లోనూ విధుల్లో ఉండకూదని ఆర్థరాత్రే బదిలీ చేస్తూ ఈసీ ఉత్తర్వులు...

అల్లు అర్జున్ టూర్ : నంద్యాల ఎస్పీ, డీఎస్పీ, సీఐలపై ఈసీ చార్జ్‌షీట్

అల్లు అర్జున్ నంద్యాల పర్యటన పోలీసులపై కూడా కేసులు నమోదయ్యేలా చేసింది. అల్లు అర్జున్ నంద్యాల పర్యటనకు పోలీసులు అనుమతి తీసుకోలేదు. మామూలుగా అయితే పెద్దగా మ్యాటర్ కాదు....

వారణాశిలో మోడీ నామినేషన్‌కు చంద్రబాబు

తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబునాయుడును వారణాశిలో తన నామినేషన్ కు రావాల్సిందిగా ప్రధాని మోడీ ఆహ్వానించారు. మంగళవారం ప్రధాని మోద ీనామినేషన్ వేయనున్నారు. వారణాశిలో ఎన్నికలు చివరి విడతలో జరగున్నాయి. పదమూడో తేదీన...

మిత్రుడు దంతులూరి కృష్ణ కూడా జగన్‌కు వ్యతిరేకమే !

జగన్మోహన్ రెడ్డికి అధికారం అందిన తర్వాత ఆ అధికారం నెత్తికెక్కడంతో దూరం చేసుకున్న వారిలో తల్లి, చెల్లి మాత్రమే కాదు స్నేహితులు కూడా ఉన్నారు. చిన్న తనం నుంచి అంటే 35...

HOT NEWS

css.php
[X] Close
[X] Close