కలెక్టర్లను గ్రామాల్లోకి తరుముతున్న జగన్..!

కలెక్టర్ “వైట్ కాలర్” జాబ్ కాదని… ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి… మాటలతో కాదు.. చేతలతో .. చెబుతున్నారు. కలెక్టర్లందరికీ.. విధుల విషయంలో కొత్త కొత్త పని విధానాలు ఖరారు చేశారు. నెలలో పదిహేను రోజుల పాటు కచ్చితంగా.. క్షేత్ర స్థాయికి వెళ్లాలని స్పష్టం చేశారు. వీడియో కాన్ఫరెన్స్‌ల కన్నా క్షేత్రస్థాయి పర్యటనలతోనే ప్రజలకు న్యాయం చేయగలమని.. ఆయన అధికారులకు స్పష్టం చేశారు. పథకాల విషయంలో ప్రజలు, లబ్ధిదారులు, తదితర వర్గాల నుంచి వచ్చే ఫీడ్ బ్యాక్ చాలా కీలకమని స్పష్టం చేశారు. ఆకస్మిక తనిఖీలు చేయాలని రాత్రి పూట ఆస్పత్రులు, హాస్టల్స్, పల్లెల్లో నిద్ర చేయాలని పేర్కొన్నారు. దీని వల్ల క్షేత్రస్థాయి పరిస్థితులు మెరుగు పడతాయని జగన్ భావిస్తున్నారు.

పరిపాలనలో తనకు కళ్లూ, చెవులు కలెక్టర్లేనని మొదటి నుంచి చెబుతున్న జగన్.. వారిని ప్రజల్లోకి పంపేందుకు గట్టి కార్యాచరణ ప్రారంభించారు. ఇప్పటికి.. ఆరు నెలల కాలంలో.. కలెక్టర్లు పెద్దగా కుదురుకోలేదు. ప్రభుత్వం కొత్త విధానాలు తీసుకు రావడంతో.. వాటికి అనుగుణంగా.. యంత్రాంగాన్ని సిద్ధం చేసుకోవడంతో.. కలెక్టర్లు తీరిక లేకుండా గడిపారు. వాలంటీర్లు, గ్రామ సచివాలయాల వ్యవహారం దగ్గర్నుంచి.. ప్రతీ విషయం కలెక్టర్లే చూడాల్సి వస్తోంది. ఈ క్రమంలో పని ఒత్తిడితో పలువురు కలెక్టర్లు క్షేత్ర స్థాయికి వెళ్లింది తక్కువ.

గత ముఖ్యమమంత్రి చంద్రబాబునాయుడు.. వీడియో కాన్ఫరెన్స్‌లకు ప్రాధాన్యం ఇచ్చేవారు. గంటల తరబడి మీటింగులు జరిగేవి. గణాంకాలకే ప్రాధాన్యం ఇచ్చేవారు. క్షేత్ర స్థాయిలో ప్రజల ఫీడ్ బ్యాక్‌పై పెద్దగా దృష్టి పెట్టేవారు కాదు. జగన్మోహన్ రెడ్డి ఈ విషయాన్ని గమనించారేమో కానీ… వీడియో కాన్ఫరెన్స్‌ల కన్నా.. ఎక్కువగా… కలెక్టర్ల క్షేత్రస్థాయి పర్యటనల కోసమే.. సీఎం ఒత్తిడి చేస్తున్నారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ఏబీపీ సీఓటర్ సర్వే : బీఆర్ఎస్‌కు ఒక్కటే !

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించి మంచి జోరు మీద ఉన్న కాంగ్రెస్ పార్టీకి లోక్ సభ ఎన్నికల్లో గట్టి పోటీ ఎదురయినప్పటికీ పది వరకూ లోక్ సభ సీట్లను గెల్చుకునే అవకాశం...

ఏబీపీ సీఓటర్ సర్వే : టీడీపీ కూటమికి 20, వైసీపీకి 5 లోక్‌సభ సీట్లు

ఎన్డీఏ కూటమి బలం రోజు రోజుకు పెరుగుతోంది. వైసీపీపై వ్యతిరేకత అంతకంతకూ పెరుగుతోందని సర్వేల వెల్లడిస్తున్నయి. అత్యంత ఖచ్చితంగా సర్వేలు, ఒపీనియన్ పోల్స్ వెల్లడిస్తుందని పేరున్న ఏబీపీ- సీఓటర్ ఎన్నికలకు ముందు నిర్వహించిన...

సునీత సాక్ష్యాలకు పాత ఆరోపణలే అవినాష్ రెడ్డి కౌంటర్ !

వివేకా హత్య కేసులో సునీత జస్టిస్ ఫర్ వివేకా పేరుతో పెడుతున్న ప్రెస్ మీట్లు వెల్లడిస్తున్న సంచనల విషయాలతో అవినాష్ రెడ్డికి మైండ్ బ్లాంక్ అవుతోంది. స్పందించకపోతే నిజం అని...

రాయి కేసు : లీకులిచ్చి జగన్ పరువు తీసిన పోలీసులు !

అనవసర డ్రామాలతో భద్రతా వైఫల్యమని పోలీసుల్ని చేతకాని వాళ్లుగా చేస్తున్నారని కోపం వచ్చిందేమో కానీ విజయవాడ పోలీసులు వైసీపీతో పాటు జగన్ పరువు తీసే లీకులు మీడియాకు ఇచ్చారు. జగన్ పై...

HOT NEWS

css.php
[X] Close
[X] Close