పులివెందుల క్యాడర్‌కు జగన్ డబ్బుల పంపిణీ – మరి ఇతర నియోజకవర్గాల్లో ?

పులివెందుల వైసీపీ నేతలకు జగన్ రెడ్డి డబ్బులు పంచుతున్నారు. స్థాయిని బట్టి రూ. యాభై వేల నుంచి ఇరవై లక్షల వరకూ పంచుతున్నారు. స్వయంగా అవినాష్ రెడ్డి లెక్కలు రాసుకుంటూ .. పులివెందులలోని సీఎం క్యాంప్ ఆఫీస్ నుంచే ఈ డబ్బులు పంచుతూండటం ఆసక్తికరంగా మారింది. ఎన్ని కోట్లను పంచుతారనే సంగతిని పక్కన పెడితే ఎప్పుడూ లేని విధంగా సొంత పార్టీ క్యాడర్ కు డబ్బులు పంచడం ఏమిటన్న చర్చ మాత్రం పులివెందులలో నడుస్తోంది.

వైసీపీ అధికారంలోకి వచ్చాక పార్టీ క్యాడర్ పరిస్థితి ఘోరంగా మారింది. దానికి పులివెందుల కూడా మినహాయింపు కాదు. ఆర్థికంగా చితికిపోయారు. అందుకే ఎన్నికలకు ముందు అందరికీ ఎంతో కొంత ఆర్థిక సాయం చేయాలని నిర్ణయించుకున్నారు. కార్యకర్తల దగ్గర ఓ లేఖ తీసుకుని యాభై వేలు ఇస్తున్నారు.. ఎంపీటీసీల స్థాయి నుంచి అన్ని స్థాయిలో ప్రజాప్రతినిధులకు లక్షలు పంచుతున్నారు. అయితే జగన్ రెడ్డి పరిస్థితి ఇలా ఉంటే.. మరి మిగతా నియోజకవర్గాల్లో పరిస్థితి ఏమిటన్నది చాలా మందికి అర్థం కావడంలేదు.

రాష్ట్రం మొత్తం వైసీపీ క్యాడర్ పూర్తిగా దెబ్బతినిపోయింది. అందుకే ఎవరూ కనీసం గ్రామాల్లో వైఎస్ విగ్రహాల చుట్టూ పెరిగిన పిచ్చి మొక్కల్ని కూడా తొలగించడం లేదు. వర్థంతులు… జయంతులు కూడా పట్టించుకోవడం లేదు. పార్టీ కోసం రూపాయి ఖర్చు పెట్టినా దండగేనని అనుకుంటున్నారు. ఈ పరిస్థితిని గమనించి క్యాడర్ కు డబ్బులు పులివెందులలో పంచుతున్నారు.. మరి నియోజకవర్గాల్లో క్యాడర్ కు ఎప్పుడు .. ఎవరు డబ్బులు పంచుతారు ?

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

అభివృద్ధితో సంక్షేమం – టీడీపీ, జనసేన మేనిఫెస్టో కీలక హామీలు

ఆంధ్రప్రదేశ్‌ ఎన్నికల్లో టీడీపీ, జనసేన ఉమ్మడి మేనిఫెస్టోను రిలీజ్ చేసింది. సంక్షేమం, రాష్ట్రాభివృద్ధి కోసం ఐదేళ్లు ప్రజలకు ఏం చేయబోతున్నారో మేనిఫెస్టో ద్వారా వివరించారు. ఇప్పటికే ప్రజల్లోకి వెళ్లిన సూపర్...

ఏపీలో ఎన్నికల ఫలితం ఎలా ఉండనుంది..ఆ సర్వేలో ఏం తేలిందంటే..?

ఏపీలో సర్వే ఏదైనా కూటమిదే అధికారమని స్పష్టం చేస్తున్నాయి. ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ కూడా కూటమి తిరుగులేని మెజార్టీతో అధికారంలోకి వస్తుందని స్పష్టం చేశారు. ఈ క్రమంలోనే రైజ్ ( ఇండియన్...

టీ 20 ప్ర‌పంచ‌క‌ప్: భార‌త జ‌ట్టు ఇదే

జూన్‌లో జ‌ర‌గ‌బోయే టీ 20 వ‌ర‌ల్డ్ క‌ప్ కోసం భార‌త‌జ‌ట్టుని బీసీసీఐ ప్ర‌క‌టించింది. రోహిత్ శ‌ర్మ‌ని కెప్టెన్‌గా నియ‌మించింది. గాయం కార‌ణంగా జ‌ట్టుకు దూర‌మై, ప్ర‌స్తుతం ఐపీఎల్ లో బ్యాటర్‌, కీప‌ర్ గా...

గాజు గ్లాస్ గుర్తుపై ఏ క్షణమైనా ఈసీ నిర్ణయం – లేకపోతే హైకోర్టులో !

జనసేన పార్టీకి గాజు గ్లాస్ గుర్తు రిజర్వ్ చేసినప్పటికీ ఆ పార్టీ పోటీ చేయని స్థానాల్లో స్వతంత్రులకు గుర్తు కేటాయించడంపై తీవ్ర వివాదాస్పదమయింది. ఈ అంశంపై జనసేన హైకోర్టును ఆశ్రయించింది. ఈ సందర్బంగా...

HOT NEWS

css.php
[X] Close
[X] Close