ప్రత్యేక సీమకు జగన్ శంకుస్థాపన..!

మరో సారి రాష్ట్ర ఉద్యమం రాకుండా మూడు రాజధానులని.. అసెంబ్లీలో బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి ప్రకటించారు కానీ.. ఆ మూడు రాజధానుల వల్లే ప్రత్యేక రాయలసీమ ఉద్యమం ఊపిరి పోసుకుంటోంది. జగన్ ప్రత్యేక రాయలసీమకు టెంకాయ కొట్టి శంకుస్థాపన చేశాడని.. రెండేళ్లకో, ఐదేళ్లకో వచ్చి తీరాల్సిందేనని మాజీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి జోస్యం చెప్పారు. కొద్ది రోజులుగా.. రాయలసీమలో రాజధానిపై మార్పుపై చర్చ జరుగుతోంది. అమరావతిని నిర్వీర్యం చేయడం వల్ల ఓ సామాజికవర్గం నష్టపోతుందని.. అధికార పార్టీ నేతలు అంతర్గతంగా ప్రచారం చేస్తున్నప్పటికీ.. తమకు దూరం చేయడం వల్ల తాము నష్టపోతున్నామన్న అంశం.. మెల్లగా చర్చల్లోకి వస్తోంది.

ఇదే విషయాన్ని జేసీ దివాకర్ రెడ్డితో పాటు.. పలువురు నేతలు చెబుతున్నారు. పొరుగు రాష్ట్రాల సమీపంలో ఉన్న వారు.. తమను ఆయా రాష్ట్రాల్లో కలపాలని కోరుతున్నారు. అమరావతి రైతులకు మద్దతు తెలిపిన.. రాయలసీమకు చెందిన పలువురు టీడీపీ నేతలు.. ఉంచితే అమరావతిని ఉంచాలి.. లేకపోతే.. ప్రత్యేక రాయలసీమ ఇవ్వాల్సిందేనని డిమాండ్ చేస్తున్నారు. చిన్నరాష్ట్రానికి మూడు రాజధానులు అవసరం లేదని… కేంద్రం, కోర్టులున్నాయని జేసీ చెబుతున్నారు. జగన్‌ ప్రభుత్వం తీరుపై కేంద్రం వేచిచూసే ధోరణిలో ఉందని .. జగన్‌ అనుకున్నంత సులువుగా మూడు రాజధానులు ఏర్పడవని గుర్తు చేశారు.

విశాఖ నుంచి రాయలసీమ ప్రాంతానికి రోడ్డు సౌకర్యం కూడా లేదని.. హైకోర్టు వల్ల రాయలసీమకు ఎటువంటి ప్రయోజనం ఉండదని తేల్చేశారు. జిల్లాకో కియా లాంటి పరిశ్రమ ఒకటి ఏర్పాటు చేస్తే చాలు
అభివృద్ధి జరుగుతుందన్నారు. మొత్తానికి జేసీ.. రాయలసీమ ఉద్యమానికి జగనే.. ఊపిరి పోశాడని తేల్చేశారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

video

విశ్వ‌క్ ‘లైలా’వ‌తారం!

https://www.youtube.com/watch?v=9STsOoGDUfA లేడీ గెట‌ప్పులు వేయాల‌న్న ఆశ‌.. ప్ర‌తీ హీరోకీ ఉంటుంది. స‌మ‌యం సంద‌ర్భం క‌ల‌సి రావాలంతే! ఒక‌ప్ప‌టి అగ్ర హీరోలంతా మేక‌ప్పులు మార్చి, శారీలు క‌ట్టి - ఆడ వేషాల్లో అద‌ర‌గొట్టిన‌వాళ్లే. ఈత‌రం హీరోలు...

రఘురామకు ఇంకా కూటమి నుంచి టిక్కెట్ చాన్స్ ఉందా ? లేదా?

రఘురామకృష్ణరాజు పోటీ ఎక్కడ ?. ఈ ప్రశ్న ఇప్పుడు ఇటు కూటమి క్యాంప్‌తో పాటు అటు వైసీపీ క్యాంప్‌లోనూ హాట్ టాపిక్ గానే ఉంది. వైసీపీ క్యాంప్.. ఇదే ప్రశ్నతో ఆయనను...

ఆ స్వామిజీకి టిక్కెట్ రాకుండా చేసింది బాలకృష్ణేనట !

పరిపూర్ణానంద అనే స్వామిజీకి ప్రవచాలు చెప్పుకోవడం కన్నా రాజకీయాల్లో ఆదిత్యనాథ్ ని అయిపోవాలన్న ఆశ ఎక్కువగా ఉంది. గతంలో తెలంగాణలో ప్రయత్నించారు. వర్కవుట్ కాలేదు. ఈ సారి ఏపీలో దృష్టి పెట్టారు....

గంటాకే భీమిలీ – టీడీపీ ఫైనల్ లిస్ట్ రిలీజ్

గంటా శ్రీనివాసరావు హైకమాండ్ అనుకున్నది కాకుండా.. తాను అనుకున్న చోట పోటీ చేయడంలో ఎక్స్ పర్ట్. మరోసారి అనుకున్నది సాధించారు. భీమిలీ సీటు ఆయన ఖాతాలోనే పడింది. టీడీపీ విడుదల చేసిన...

HOT NEWS

css.php
[X] Close
[X] Close