32 మంది ఎమ్మెల్యేలకు చివరి చాన్సిచ్చిన జగన్ !

ఎంత చెప్పినా కొంత మంది మంత్రులు, ఎమ్మెల్యేలు పని తీరు మార్చుకోవడం లేదని సీఎం జగన్ అసహనం వ్యక్తం చేసారు. గడప గడపకూ మన ప్రభుత్వం కార్యక్రమంపై జగన్ సమీక్ష చేశారు. దీనికి అందరు ఎమ్మెల్యేలు.. ఇంచార్జులు, సమన్వయకర్తలు హాజరయ్యారు. మొత్తం 32 మంది పని తీరు బాగో లేదని జగన్ మొహం మీదనే చెప్పారు.వారి పేర్లు కూడా వినించారు. వారిలో విడదల రజని, గుడివాడ అమర్నాథ్ వంటి మంత్రులు కూడా ఉన్నారు. ఎన్ని సార్లు చెప్పినా.. మారడం లేదని.. అలా అయితే కష్టమని వారికి జగన్ హెచ్చరించారు.

మళ్లీ మార్చి నెలలో గడప గడపకూ మన ప్రభుత్వం కార్యక్రమం నిర్వహిస్తామని.. ఈ వంద రోజులు మనకు ఎంతో కీలకమని జగన్ చెప్పుకొచ్చారు. అప్పటికల్లా సర్వే రిపోర్టులు వస్తాయని.. అప్పుడే అభ్యర్థుల్ని ఖరారు చేస్తానన్నారు. పని తీరు బాగోలేని ఎమ్మెల్యేలు.. సర్వేల్లో సరిగ్గా ఫలితం పొందని వారిని పక్కన పెట్టడానికి ఏ మాత్రం వెనుకాడబోనని జగన్ స్పష్టం చేశారు. ఏప్రిల్‌లో సర్వే రిపోర్టులు వచ్చిన తర్వాత అభ్యర్థిత్వాలను ఖరారు చేస్తానని జగన్ చెప్పారు.

అయితే ఇలా గడప గడపకూ కార్యక్రమంలో వెనుకబడిన మంత్రులు.. పార్టీ పరంగా.. ప్రభుత్వ పరంగా ఇతర పనులు అప్పగించడంతోనే వారు సరిగ్గా వెళ్లలేకపోతున్నామని.. ఇది తెలిసి కూడా తమను అవమానించేలా… బహిరంగంగా పేర్లు చదివడం ఏమిటన్న వాదన ఆ పార్టీ నేతల్లో వినిపిస్తోంది. కొంత మంది నేతలు నిజంగానే నిరాసక్తంగా ఉన్నారు. టిక్కెట్ ఇస్తే సరి లేకపోతే లేదని గడప గడపకూ కార్యక్రమాన్ని లైట్ తీసుకుంటున్నారు.

మొత్తంగా పీకే టీమే.. ఎమ్మెల్యేల పనితీరును మార్క్ చేస్తోంది. దీనిపైనా వైసీపీ నేతల్లో అసంతృప్తి వ్యక్తమవుతోంది. అయితే జగన్ తమ పార్టీ నేతల కన్నా పీకే టీం రిపోర్టులకే ఎక్కువ ప్రాధాన్యం ఇస్తున్నారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

కొడాలి నాని నామినేషన్ తిరస్కరిస్తారా ?

కొడాలి నాని నామినేషన్ కు ఇంకా అధికారికంగా ఆమోదం లభించలేదు. ప్రభుత్వ భవనాన్ని లీజుకు తీసుకుని.. తీసుకోలేదని అఫిడవిట్ దాఖలు చేయడంతో వివాదాస్పదమయింది. రిటర్నింగ్ అధికారి కొడాలి నాని నియమించుకున్న...

కడప అసెంబ్లీ రివ్యూ : టీడీపీ గెలుపు ఖాయమని ఉద్ధృతంగా మౌత్ టాక్ !

రాష్ట్రం మొత్తం వైసీపీకి ఎదురుగాలి వీస్తోందని అందరూ చెప్పుకుంటున్నారు. వైసీపీ నేతలు కూడా ఒప్పుకుంటున్నారు. కానీ కడప జిల్లాలో మాత్రం వైసీపీదే అధిపత్యం అన్న నమ్మకంతో ఉన్నారు. జిల్లా మొత్తం పక్కన...

ఇక ఏపీలో ఆస్తి కొంటే జిరాక్సులే !

ఆంధ్రప్రేదశ్ ప్రభుత్వం ఆస్తుల రిజిస్ట్రేషన్లలో కొత్త పద్దతి ప్రవేశ పెట్టింది. ఇక నుంచి ఎవరికీ అక్కడ అసలైన పత్రాలివ్వరు. జిరాక్సులు మాత్రమే ఇస్తారు. వాటితోనే లావాదేవీలు నిర్వహించుకోవాలి. ఈ డేటా ,...

కరెంట్‌తో కితకితలు పెట్టుకుంటున్న బీఆర్ఎస్

బీఆర్ఎస్ పార్టీలో పై నుంచి కింది స్థాయి వరకూ ఎవరూ నేల మీదకు దిగడం లేదు. బీఆర్ఎస్ అధికారం కోల్పోయిన ఐదు నెలల్లోనే ఏదో జరిగిపోయిందని ప్రజల్ని నమ్మించేందుకు ప్రయత్నిస్తున్నారు. తామున్నప్పుడు...

HOT NEWS

css.php
[X] Close
[X] Close