కేసీఆర్‌కు సమస్య తెచ్చి పెట్టిన జగన్..!

ఏపీ సీఎం ఆర్టీసీ కార్మికుల్ని ప్రభుత్వ ఉద్యోగాలుగా గుర్తించారు..!
ఏపీ సీఎం ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేస్తున్నారు..!
ఏపీ సీఎం ఆర్టీసీ అప్పులన్నింటినీ భరించేందుకు సిద్ధమయ్యారు..!
ఏపీ సీఎం ఆర్టీసీ రాయితీలకు బడ్జెట్‌లో నిధులు కేటాయించారు..!

ఇవన్నీ తెలంగాణ సీఎం ఎందుకు చేయరు..? చేయాల్సిందేనంటూ.. తెలంగాణ ఆర్టీసీ కార్మికులు సమ్మెకు సిద్ధమవుతున్నారు. తెలంగాణ ఆర్టీసీ కార్మికులు గతంలో కేసీఆర్ ఇచ్చిన హామీలకు తగ్గట్లుగా … హామీ ఇచ్చి.. ఏపీ సీఎం అమలు చేసినట్లుగా… తమ డిమాండ్లను నెరవేర్చాలంటూ.. ఆందోళన ప్రారంభించారు. బడ్జెట్‌లో ఆర్టీసీకి ఒక్క రూపాయి కూడా కేటాయించకపోవడం.. ప్రభుత్వం.. వివిధ వర్గాలకు బస్ టిక్కెట్లకు ఇచ్చే రాయితీల కింద.. ఆర్టీసీకి ఇవ్వాల్సిన మొత్తాన్ని కూడా… కేటాయించకపోవడంతో… ఉద్యోగులు ఆందోళనకు గురవుతున్నారు. ఈ మొత్తం ఏడాదికి రూ. ఆరు నుంచి ఏడు వందల కోట్ల వరకూ ఉంటుందని అంచనా. ప్రభుత్వం ఒక్క రూపాయి కూడా ఇవ్వకపోతే.. ఆర్టీసీ దివాలా తీస్తుందన్న భయంతో.. ఉద్యోగులు… ఉద్యమబాట పట్టారు. వారి డిమాండ్.. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయడమే.

టీఎస్‌ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలన్న ప్రధాన డిమాండ్‌తో కార్మిక సంఘాలన్నీ ఏకతాటిపైకి వస్తున్నాయి. ఏపీతో పోలిస్తే.. తెలంగాణ ఆర్టీసికి అప్పులు తక్కువేనని కార్మిక సంఘాలు చెబుతున్నాయి. ఏపీలో జగన్ మోహన్ రెడ్డి సర్కార్.. ఉద్యోగుల్ని ప్రభుత్వంలో విలీనం చేయడంతో.. తెలంగాణ ఆర్టీసీ కార్మికులకు కూడా ధైర్యం వచ్చింది. పోరాడితే కేసీఆర్ పై కూడా ఒత్తిడి పెరుగుతుందని… ఖచ్చితంగా.. తమ కోరిక నెరవేరుస్తారని నమ్ముతున్నారు. ప్రస్తుతం ప్రభుత్వ ఉద్యోగుల వేతనాలు ఆర్టీసీ కార్మికుల కంటే 18 శాతం ఎక్కువగా ఉన్నాయి. విలీనమైతే ఈ వ్యత్యాసం ఉండదు. భారీగా జీతాలు పెరిగే అవకాశం ఉంటుందని కార్మికులు.. పోరాటానికి సిద్ధమయ్యారు.

తెలంగాణ ఉద్యమ సమయంలో… కార్మిక సంఘాలన్నింటినీ చీల్చి.. టీఆర్ఎస్‌కు అనుబంధంగా.. ఓ కొత్త కార్మిక సంఘం టీఎంయూని ఏర్పాటు చేశారు. దానికి ఇటీవల కాలం వరకూ.. గౌరవ అధ్యక్షుడిగా హరీష్ రావు ఉండేవారు. ముందస్తు ఎన్నికలకు ముందు … సమయం కేటాయించలేకపోతున్న కారణం చెప్పి వైదొలిగారు. దీంతో… కార్మిక సంఘాలపై.. టీఆర్ఎస్ పట్టు తగ్గిందనే ప్రచారం జరుగుతోంది. ఈ క్రమంలో ఆర్టీసీ విలీనం డిమాండ్ తో సమ్మెకు వెళ్లేందుకు కార్మికులు సిద్ధమవడం..తెలంగాణ ప్రభుత్వ వర్గాలను కలవరపరిచేదే. ఎందుకంటే.. ఇప్పటికిప్పుడు… ఎలాంటి ఆర్థిక సాయాన్ని ఆర్టీసీకి ప్రకటించే యోచనలో ప్రభుత్వం లేదు. ఆర్థిక పరిస్థితి అందుకు అనుకూలంగా కూడా లేదు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

జగన్ తండ్రిని కూడా వదల్లేదా..? షర్మిల సంచలన వ్యాఖ్యలు

ఏపీ కాంగ్రెస్ చీఫ్ వైఎస్ షర్మిల అసలు రాజకీయం ఇప్పుడు స్టార్ట్ చేశారు.వైఎస్సార్ కు వారసురాలు జగన్ రెడ్డి కాదని బలంగా చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. వైఎస్ రాజకీయ వారసత్వాన్ని కొనసాగిస్తున్నది తను...

భయపెడుతోన్న ఎండలు…వాతావరణ శాఖ బిగ్ అలర్ట్

ఎండలతో తెలుగు రాష్ట్రాలు కుతకుత ఉడుకుతున్నాయి. బయటకు వెళ్లేందుకు జనం జంకుతున్నారు. పగలూ, సాయంత్రం అనే తేడా లేకుండా ఉక్కపోత సెగలు పుట్టిస్తోంది.ఈ క్రమంలోనే వాతావరణ శాఖ బిగ్ అలర్ట్ ఇచ్చింది. రానున్న...

ఈవీఎం, వీవీ ప్యాట్ పిటిషన్లపై సుప్రీం కీలక తీర్పు

లోక్ సభ ఎన్నికల వేళ ఈవీఎం-వీవీప్యాట్‌కు సంబంధించి దాఖలైన పిటిషన్లపై సుప్రీంకోర్టు తీర్పు వెలువరించింది. వీవీప్యాట్‌ స్లిప్పులతో ఈవీఎం ద్వారా పోలైన ఓట్లను వందశాతం సరిపోల్చాలనే పిటిషన్లను సర్వోన్నత న్యాయస్థానం తిరస్కరించింది. జస్టిస్...

పోలింగ్ ముగిసిన తర్వాత ట్యాపింగ్ కేసులో అసలైనఅరెస్టులు !

ఎన్నికల హడావుడి తగ్గిన తర్వాత ట్యాపింగ్ కేసులో ఎన్నో బ్రేక్ డాన్సులు చోటు చేసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. స్పెషల్‌ ఇంటెలిజెన్స్ బ్యూరో చీఫ్‌గా పనిచేసిన ప్రభాకర్ రావుపై రెడ్ కార్నర్ నోటీసులు...

HOT NEWS

css.php
[X] Close
[X] Close