జగన్ అబద్దాల బుట్టలో జనం పడతారా..?

ఏపీ సీఎం జగన్ రెడ్డి జనాలను అమాయకులుగా అంచనా వేస్తున్నారు. తాను ఏం చెప్పినా గుడ్డిగా నమ్మేస్తారనుకుంటున్నారు. అబద్దాలే ఆయుధంగా చేసుకుంటున్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఎమ్మిగనూరు సభలో మాట్లాడిన జగన్…ఎమ్మెల్యే అభ్యర్థి బుట్టా రేణుక గురించి అబద్దాలను అందంగా చెప్పేశారు.

జగన్ చేసిన వ్యాఖ్యల వీడియోను షేర్ చేసిన టీడీపీ.. బుట్టా రేణుక గతంలో తన ఆస్తుల గురించి ఓ యూట్యూబ్ ఛానెల్ లో చెప్పిన వీడియోను దానికి జత చేసింది. ఆ ఛానెల్ ఇంటర్వ్యూలో రేణుక తమకు ఆటో మొబైల్ , హాస్పిటాలిటీ , విద్యా సంస్థలు ఉన్నాయని చెప్పింది. అంటే బుట్టా రేణుక ఆర్థికంగా బలవంతురాలే . కానీ, జగన్ ఎమ్మిగనూరు “మేమంతా సిద్ధం” సభలో.. రేణుక ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రమేనని వ్యాఖ్యానించారు. సంపన్నురాలైన రేణుకను పేద మహిళా అనే తరహాలో మాట్లాడటంతో సభకు వచ్చిన వారంతా ఒక్కసారిగా షాక్ అయ్యారు.

2014లో వైసీపీ ఎంపీగా పోటీ చేసిన బుట్టా రేణుక.. వైట్ లోనే 242 కోట్ల ఆస్తిని ఎన్నికల అఫిడవిట్ లో పేర్కొన్నారు. ఆ లెక్కన ప్రస్తుతం ఆమె ఆస్తి విలువ 1000 కోట్లపైగానే ఉంటుందని అంచనా. కానీ, జగన్ అందుకు విరుద్ధమైన కామెంట్స్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే జగన్ చేసిన వ్యాఖ్యలు ట్రోల్స్ అవుతున్నాయి. తన ఆస్తులతో పోల్చితే రేణుక అంతంత మాత్రమే కనుక.. జగన్ ఆ వర్షన్ లో అలా కామెంట్స్ చేసి ఉంటారని అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

బహిరంగ వాస్తవాలు కళ్ల ముందు ఉన్నప్పటికీ.. జగన్ వాస్తవాలను కప్పిపుస్తూ అబద్దాలను వల్లెవేస్తున్నారు. మరి.. జగన్ అబద్దాల గాలానికి ఎమ్మిగనూరు జనం చిక్కుతారా..? వెయిట్ అండ్ సీ.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

కొడాలి నాని నామినేషన్ తిరస్కరిస్తారా ?

కొడాలి నాని నామినేషన్ కు ఇంకా అధికారికంగా ఆమోదం లభించలేదు. ప్రభుత్వ భవనాన్ని లీజుకు తీసుకుని.. తీసుకోలేదని అఫిడవిట్ దాఖలు చేయడంతో వివాదాస్పదమయింది. రిటర్నింగ్ అధికారి కొడాలి నాని నియమించుకున్న...

కడప అసెంబ్లీ రివ్యూ : టీడీపీ గెలుపు ఖాయమని ఉద్ధృతంగా మౌత్ టాక్ !

రాష్ట్రం మొత్తం వైసీపీకి ఎదురుగాలి వీస్తోందని అందరూ చెప్పుకుంటున్నారు. వైసీపీ నేతలు కూడా ఒప్పుకుంటున్నారు. కానీ కడప జిల్లాలో మాత్రం వైసీపీదే అధిపత్యం అన్న నమ్మకంతో ఉన్నారు. జిల్లా మొత్తం పక్కన...

ఇక ఏపీలో ఆస్తి కొంటే జిరాక్సులే !

ఆంధ్రప్రేదశ్ ప్రభుత్వం ఆస్తుల రిజిస్ట్రేషన్లలో కొత్త పద్దతి ప్రవేశ పెట్టింది. ఇక నుంచి ఎవరికీ అక్కడ అసలైన పత్రాలివ్వరు. జిరాక్సులు మాత్రమే ఇస్తారు. వాటితోనే లావాదేవీలు నిర్వహించుకోవాలి. ఈ డేటా ,...

కరెంట్‌తో కితకితలు పెట్టుకుంటున్న బీఆర్ఎస్

బీఆర్ఎస్ పార్టీలో పై నుంచి కింది స్థాయి వరకూ ఎవరూ నేల మీదకు దిగడం లేదు. బీఆర్ఎస్ అధికారం కోల్పోయిన ఐదు నెలల్లోనే ఏదో జరిగిపోయిందని ప్రజల్ని నమ్మించేందుకు ప్రయత్నిస్తున్నారు. తామున్నప్పుడు...

HOT NEWS

css.php
[X] Close
[X] Close