భూసేకరణను వ్యతిరేకిస్తూ విజయవాడలో జగన్ నేడు ధర్నా

రాజధాని నిర్మాణం కోసం తమ పంట భూములను ఇవ్వడానికి అయిష్టత చూపుతున్న ఉండవల్లి, పెనుమాక. బేతపూడి తదితర గ్రామాల రైతులపై ప్రభుత్వం భూసేకరణ చట్టం ప్రయోగించి బలవంతంగా వారి భూములను స్వాధీనం చేసుకోవాలనుకొంటోంది. ఈ బలవంతపు భూసేకరణను వ్యతిరేకిస్తూ వైకాపా అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి ఈరోజు విజయవాడలో సీ.ఆర్.డి.ఏ. కార్యాలయం సమీపంలో లెనిన్ సెంటర్ వద్ద ఈరోజు ఉదయం 10 నుండి సాయంత్రం 4.00 గంటల వరకు ధర్నా చేయబోతున్నారు. ఈ ధర్నాలో రైతులు, వైకాపా నేతలు, కార్యకర్తలు, భూసేకరణను వ్యతిరేకిస్తున్న ఇతర పార్టీలు, ప్రజా సంఘాలు పాల్గొంటాయి.

రాజధాని నిర్మాణం కోసం ప్రభుత్వం ఇప్పటికే 33, 000 ఎకరాల భూమిని సేకరించినప్పటికీ, ఉండవల్లి తదితర గ్రామాలకు చెందిన 2,700 ఎకరాలను కూడా భూసేకరణ చట్టం ప్రయోగించి స్వాధీనం చేసుకొనేందుకు సిద్దమవుతోంది. ఇటీవల ఉండవల్లి, పెనుమాక తదితర గ్రామాలలో పర్యటించిన జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ కూడా బలవంతపు భూసేకరణపై తీవ్ర అభ్యంతరం తెలిపారు. కానీ రాష్ట్ర ప్రభుత్వం భూసేకరణకే మొగ్గు చూపుతోంది. ఆ భూములు స్వాధీనం చేసుకోకపోతే రాజధాని నిర్మాణం చేప్పట్టలేమని వాదిస్తోంది. ఎట్టిపరిస్థితుల్లో కూడా ఆ భూములను స్వాధీనం చేసుకొని తీరుతామని ప్రభుత్వం విస్పష్టంగా చెప్పడంతో ప్రభుత్వ మొండి వైఖరిని నిరసనగా జగన్మోహన్ రెడ్డి ఈరోజు ధర్నా చేపడుతున్నారు. రైతులను కాపాడాల్సిన ప్రభుత్వమే వారి భూములను బలవంతంగా గుంజుకోవాలనుకోవడం కంచే చేనుని మేసినట్లుందని ఆయన అన్నారు. ఈ ధర్నా కోసం మంగళగిరి వైకాపా ఎమ్మెల్యే ఆళ్ళ రామకృష్ణా రెడ్డి అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

video

‘ప్ర‌స‌న్న‌వ‌ద‌నం’ ట్రైల‌ర్‌: కొత్త పాయింటే ప‌ట్టారు

https://www.youtube.com/watch?v=uy8tkUFAsnA సుహాస్‌పై ప్రేక్ష‌కుల‌కు ఓ మంచి అభిప్రాయ‌మే ఉంది. త‌ను క‌చ్చితంగా విభిన్న ప్ర‌య‌త్నాలు చేస్తాడ‌నది అంద‌రి న‌మ్మ‌కం. క‌ల‌ర్ ఫొటో నుంచి అంబాజీ పేట మ్యారేజీ బ్యాండు వ‌ర‌కూ త‌న ట్రాక్ రికార్డ్...

హరీష్ రావు ఉత్తుత్తి రాజీనామా – కామెడీ చేసిన కాంగ్రెస్ !

తెలంగాణ ఉద్యమం కోసం ఇప్పటికే ఎన్నో సార్లు రాజీనామా చేశానని.. తనకు పదవులు ఓ లెక్క కాదంటూ చెప్పే హరీష్ రావు.. తాజాగా చేసిన రాజీనామా ఆయనను ట్రోల్ చేసేలా ఉంది....

చేసింది పొన్నవోలే కానీ చేయించింది జగన్ కాదట !

సీబీఐ చార్జిషీట్‌లో వైఎస్ఆర్ పేరును సోనియా గాంధీ పెట్టించారంటూ ఇంత కాలం జగన్ చేస్తున్న ప్రచారానికి షర్మిల ఒకే ఒక్క డైలాగ్ తో చెక్ పెట్టారు. పొన్నవోలు ద్వారా...

నారా భువనేశ్వరి డీప్ ఫేక్ ఆడియోతో వైసీపీ అరాచకం !

ఇంట్లో సొంత కుటుంబసభ్యుల్ని అత్యంత హీనంగా దూషిస్తున్న జగన్మోహన్ రెడ్డి పార్టీ.. ఆ పార్టీ సోషల్ మీడియా విభాగం పూర్తిగా కంట్రోల్ తప్పిపోయింది. ఏకంగా నారా భువనేశ్వరి ఆడియో పేరుతో డీప్ ఫేక్...

HOT NEWS

css.php
[X] Close
[X] Close